Telangana News: సామూహిక ‘జనగణమన’తో మారుమోగిన తెలంగాణ

స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా సీఎం కేసీఆర్‌ ఇచ్చిన పిలుపుమేరకు యావత్‌ తెలంగాణ జాతీయ గీతం ‘జనగణమన’తో మారుమోగింది.

Updated : 16 Aug 2022 12:59 IST

హైదరాబాద్‌: స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా సీఎం కేసీఆర్‌ ఇచ్చిన పిలుపుమేరకు యావత్‌ తెలంగాణ జాతీయ గీతం ‘జనగణమన’తో మారుమోగింది. మంగళవారం ఉదయం సరిగ్గా 11.30గంటలకు నిమిషం పాటు రాష్ట్రంలోని అన్ని ప్రధాన కూడళ్లు, ప్రభుత్వ కార్యాలయాలు, పంచాయతీలు, అంగన్‌వాడీ కేంద్రాలు, విద్యాసంస్థలతో పాటు ప్రైవేటు సంస్థల వద్ద సామూహికంగా జాతీయగీతాన్ని ఆలపించారు. మెట్రో రైళ్లు సహా ఇతర వాహనాలను ఎక్కడికక్కడే నిలిపేసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

హైదరాబాద్‌లోని అబిడ్స్‌ జీపీవో సర్కిల్‌ వద్ద నిర్వహించిన కార్యక్రమానికి సీఎం కేసీఆర్‌ హాజరై ‘జనగణమన’ ఆలపించారు. కేసీఆర్‌తో పాటు పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజానిధులు, పెద్ద ఎత్తున యువత ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని