Telangana News: వరంగల్ ఎంజీఎం ఘటన.. బాధ్యులపై కఠిన చర్యలు: ఎర్రబెల్లి
వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో శ్రీనివాస్ అనే రోగి కాలు, చేతివేళ్లను ఎలుకలు కరిచిన ఘటనలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు.
హనుమకొండ: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో శ్రీనివాస్ అనే రోగి కాలు, చేతివేళ్లను ఎలుకలు కరిచిన ఘటనలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. ఐసీయూలో ఎలుకలు కరవడం పూర్తిగా బాధ్యతారాహిత్యమన్నారు. ఆస్పత్రులను మెరుగు పరుస్తున్నామని.. ఇలాంటి లోపాలు ఉండటం కూడా సరికాదని మంత్రి పేర్కొన్నారు. జిల్లాకు చెందిన మంత్రిగా ఎంజీఎం ఆస్పత్రిలో సౌకర్యాలపై వైద్యవిద్య సంచాలకులు డాక్టర్ రమేశ్ రెడ్డితో కలిసి ఇవాళ మంత్రి పరిశీలించారు. ఆస్పత్రిలో కలియతిరిగి పరిసరాలను పరిశీలించారు. రోగిని ఎలుక కరిచిన ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధితుడు శ్రీనివాస్ కుటుంబసభ్యులను మంత్రి పరారమర్శించారు.
‘‘ఆస్పత్రిలో నిర్లక్ష్యం కారణంగా లోపం జరిగింది. దీనిపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశించాం. ఘటన జరిగిన తర్వాత విషయాన్ని ఆస్పత్రి సూపరింటెండెంట్ దృష్టికి తీసుకెళ్లారని.. ఆస్పత్రిలో పరిశుభ్రత సరిగా లేదనే విషయాలు మా దృష్టికి వచ్చాయి. వీటన్నింటికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటాం. కొవిడ్ సమయంలో ఎంజీఎం ఆస్పత్రి పెద్ద ఎత్తున సేవలు అందించింది. వైద్యులు, సిబ్బంది అందరూ బాగా పనిచేశారు. నేను ప్రత్యేకంగా ఎవరినీ ఏమీ అనడం లేదు. కానీ, ఈ ఘటన పూర్తిగా నిర్లక్ష్యం కారణంగానే జరిగిందని స్పష్టంగా తెలుస్తోంది. జిల్లా కలెక్టర్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఇప్పటికే ఆస్పత్రి సూపరింటెండెంట్ని బదిలీ చేయడంతో పాటు ఇద్దరు వైద్యులను సస్పెండ్ చేశాం. బాధితుడు శ్రీనివాస్ కుటుంబసభ్యులతో మాట్లాడాను. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ నిమ్స్కి తరలిస్తామని చెప్పడంతో వారు ఒప్పుకున్నారు’’ అని మంత్రి వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. -
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
రాష్ట్రంలో 3 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM