
Published : 08 Jul 2021 20:06 IST
ప్రతి జిల్లా కేంద్రంలో నీరా కేఫ్లు: శ్రీనివాస్గౌడ్
హైదరాబాద్: గతంలో ఏ ప్రభుత్వాలు గీత కార్మికులకు సాయం చేయలేదని మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. తెరాస ప్రభుత్వం వచ్చాకే ఆదుకున్నామని తెలిపారు. ప్రమాదవశాత్తు మరణించినా, గాయపడిన గీత కార్మికుల కుటుంబాలకు ‘కేసీఆర్ అభయ హస్తం’ పథకం కింద ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తోంది. ఇందులో భాగంగా ఇవాళ రవీంద్ర భారతిలో బాధితులకు మంత్రి ఆర్థిక సాయం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు.
‘‘గీత కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల పరిహారం చెల్లిస్తున్నాం. గౌడ యువకులకు రుణాలు ఇచ్చే ఆలోచన చేస్తున్నాం. రూ.20 కోట్లతో ట్యాంక్బండ్తో పాటు ప్రతి జిల్లా కేంద్రంలో నీరా కేఫ్లు ఏర్పాటు చేస్తాం. త్వరలో గౌడలకు డిజైన్తో కూడిన లూనాలు అందిస్తాం’’ అని మంత్రి అన్నారు.
ఇవీ చదవండి
Tags :