TS News: ఎనుమాముల మార్కెట్లో మిర్చి రైతుల ఆందోళన.. కాంటాలు ధ్వంసం
మిర్చి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ వరంగల్లోని ఎనుమాముల మార్కెట్లో రైతులు తీవ్రస్థాయిలో
వరంగల్: మిర్చి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ వరంగల్లోని ఎనుమాముల మార్కెట్లో రైతులు తీవ్రస్థాయిలో నిరసన తెలుపుతున్నారు. తమకు ప్రభుత్వం న్యాయం చేయాలంటూ మార్కెట్ కార్యాలయం వద్ద ధర్నా కొనసాగిస్తున్నారు. రైతుల ఆందోళన నేపథ్యంలో వ్యాపారులతో అధికారులు చర్చలు జరిపారు. మిర్చి నాణ్యత చూసి మరోసారి పరిశీలించాలని.. ధరలు సవరించాలని వ్యాపారులకు అధికారులు సూచించారు. ఈ విషయంలో మార్కెట్ ఛైర్మన్ చెప్పినప్పటికీ రైతులు వినలేదు. నిర్ణయించిన ధరకు రూ.2వేలు అదనంగా ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు. ఓ వైపు చర్చలు జరుగుతుండగానే మరోవైపు అధికారులు కాంటాలు నిర్వహించడంపై రైతులు భగ్గుమన్నారు. కాంటాలు నిర్వహణను అడ్డుకుని తూకం పూర్తయిన బస్తాలను ట్రాక్టర్ల పైనుంచి కింద పడేశారు. ఈ క్రమంలో కాంటాలతో పాటు డీసీఎం వాహనం అద్దాలను రైతులు ధ్వంసం చేశారు. రైతుల ఆందోళన నేపథ్యంలో మార్కెట్ వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్ - బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా గురువారం రాత్రి 7.30 గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. -
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
సీఎం జగన్ (YS Jagan)కు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్య (Viveka Murder Case)కు కారకులైన వారికి మళ్లీ ఎంపీగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారంటూ ఆమె నిలదీశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు