గుర్రంపై అసెంబ్లీకి మహిళా ఎమ్మెల్యే

అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ఝార్ఖండ్‌లోని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అంబా ప్రసాద్‌ వినూత్నంగా అసెంబ్లీకి వచ్చారు. గుర్రంపై స్వారీ చేసుకుంటూ.....

Updated : 13 May 2022 17:09 IST

రాంచీ: అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ఝార్ఖండ్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అంబా ప్రసాద్‌ వినూత్నంగా అసెంబ్లీకి వచ్చారు. గుర్రంపై స్వారీ చేసుకుంటూ రాంచీలోని అసెంబ్లీ భవనం వద్దకు చేరుకున్నారు. ఈ అశ్వాన్ని మాజీ కర్నల్‌ రవి రాఠోర్‌ తనకు కానుకగా ఇచ్చారని చెప్పారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళలు తమకు తాము తక్కువగా చూసుకోరాదన్నారు. తమలో ఉన్న శక్తిని గుర్తించాలని పిలుపునిచ్చారు. వనితలు అన్ని అడ్డంకుల్ని అధిగమించి తమ కలల్ని సాకారం చేసుకొనే దిశగా ముందుకు సాగాలన్నారు.  31 ఏళ్ల అంబా ప్రసాద్‌ రాంగఢ్‌ జిల్లాలోని బర్కగాన్‌ అసెంబ్లీ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

మరోవైపు, మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె శుభాకాంక్షలు తెలిపారు. అంబా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో తొలి ప్రాజెక్టులో భాగంగా 115 మంది పేద వితంతువులకు నెలకు రూ.9వేలు వచ్చేలా స్థానికంగా ఉపాధి కల్పించే కార్యక్రమాన్ని ఆమె సోమవారం ప్రారంభించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని