గుర్రంపై అసెంబ్లీకి మహిళా ఎమ్మెల్యే
అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ఝార్ఖండ్లోని కాంగ్రెస్ ఎమ్మెల్యే అంబా ప్రసాద్ వినూత్నంగా అసెంబ్లీకి వచ్చారు. గుర్రంపై స్వారీ చేసుకుంటూ.....
రాంచీ: అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ఝార్ఖండ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అంబా ప్రసాద్ వినూత్నంగా అసెంబ్లీకి వచ్చారు. గుర్రంపై స్వారీ చేసుకుంటూ రాంచీలోని అసెంబ్లీ భవనం వద్దకు చేరుకున్నారు. ఈ అశ్వాన్ని మాజీ కర్నల్ రవి రాఠోర్ తనకు కానుకగా ఇచ్చారని చెప్పారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళలు తమకు తాము తక్కువగా చూసుకోరాదన్నారు. తమలో ఉన్న శక్తిని గుర్తించాలని పిలుపునిచ్చారు. వనితలు అన్ని అడ్డంకుల్ని అధిగమించి తమ కలల్ని సాకారం చేసుకొనే దిశగా ముందుకు సాగాలన్నారు. 31 ఏళ్ల అంబా ప్రసాద్ రాంగఢ్ జిల్లాలోని బర్కగాన్ అసెంబ్లీ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
మరోవైపు, మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె శుభాకాంక్షలు తెలిపారు. అంబా ఫౌండేషన్ ఆధ్వర్యంలో తొలి ప్రాజెక్టులో భాగంగా 115 మంది పేద వితంతువులకు నెలకు రూ.9వేలు వచ్చేలా స్థానికంగా ఉపాధి కల్పించే కార్యక్రమాన్ని ఆమె సోమవారం ప్రారంభించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..