Telangana News: రాజీవ్ స్వగృహ టవర్ల విక్రయానికి నోటిఫికేషన్ విడుదల
హైదరాబాద్ నగరంలోని పోచారం, గాజులరామారంలోని మొత్తం పనులు పూర్తి కాని రాజీవ్ స్వగృహ టవర్ల విక్రయానికి తాజాగా హెచ్ఎండీఏ నోటిఫికేషన్ జారీ చేసింది.
హైదరాబాద్: రాజీవ్ స్వగృహ ఫ్లాట్లను విడిగా అమ్మకానికి పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా టవర్ల అమ్మకాన్ని చేపట్టింది. హైదరాబాద్ నగరంలోని పోచారం, గాజులరామారంలోని మొత్తం పనులు పూర్తి కాని రాజీవ్ స్వగృహ టవర్ల విక్రయానికి తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. పోచారంలో 4, గాజులరామారంలో 5 టవర్ల విక్రయించనున్నట్లు పేర్కొంది. పోచారంలోని ఒక్కో టవర్లో 72 నుంచి 198 ఫ్లాట్లు ఉండగా... గాజుల రామరంలోని ఒక్కో టవర్లో 112 ఫ్లాట్లు ఉన్నాయి. ఆసక్తి కలిగిన సంస్థలు, వ్యక్తులు టవర్ మొత్తం వ్యయంలో రెండు శాతం ఈఎండీ సమర్పించాలని రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ తెలిపింది. ఈఎండీ సమర్పించేందుకు జనవరి 30 వ తేదీ వరకు గడువు విధించింది. లాటరీ ద్వారా ఈ టవర్లను కేటాయించనున్నట్టు పేర్కొంది. https://www.hmda.gov.in/ , https://www.swagruha.telangana.gov.in/ వెబ్ సైట్లలో టవర్ల వివరాలు, పూర్తి సమాచారం అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
IndiGo: విమానం గాల్లో ఉండగా ఎమర్జెన్సీ డోర్ తెరిచి ఆత్మహత్యాయత్నం..
-
BJP: ఏపీలో మద్యం అక్రమాలపై సీబీఐ విచారణ కోరుతాం: పురంధేశ్వరి
-
Sai pallavi: ఇంతకన్నా నీచం మరొకటి ఉండదు.. పెళ్లి రూమర్స్పై సాయిపల్లవి ట్వీట్
-
Stock Market: నాలుగోరోజూ నష్టాల్లోనే.. 19,700 దిగువకు నిఫ్టీ
-
Sapta Sagaralu Dhaati Movie Review: రివ్యూ: సప్త సాగరాలు దాటి - సైడ్ ఎ
-
Congress: జగన్ నిరంకుశ పాలనకు ఇది నిదర్శనం: గిడుగు రుద్రరాజు