Bhadrachalam: భద్రాద్రి రాములోరి పట్టాభిషేకం.. 25 నుంచి ఆన్‌లైన్‌లో టికెట్లు

భద్రాద్రి రాములోరి కల్యాణం, పట్టాభిషేకం వేడుకలకు ఆన్‌లైన్‌లో టికెట్లను విడుదల చేయనున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.

Published : 25 Mar 2024 00:09 IST

భద్రాచలం: భద్రాద్రి రాములోరి కల్యాణం, పట్టాభిషేకం వేడుకలకు ఆన్‌లైన్‌లో టికెట్లను విడుదల చేయనున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. ఏప్రిల్‌ 17న సీతారాముల కల్యాణం, 18న మహా పట్టాభిషేకం వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఇందుకుగాను మార్చి 25వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో టికెట్లు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. ఈ రెండు వేడుకల్లో పాల్గొనాలనుకునే భక్తులు ముందస్తుగానే ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్‌ చేసుకోవాలని ఆలయ అధికారులు సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని