TS News: పాకాల సరస్సుకు పెనుశాపంగా ప్లాస్టిక్ మహమ్మారి!
చుట్టూ దట్టమైన అటవీ ప్రాంతం. ఎన్నో రకాల పక్షి జాతులు, ప్రకృతి సోయగాలతో పర్యాటకులను అమితంగా ఆకట్టుకునే ప్రాంతం.. పాకాల సరస్సు.
వరంగల్: చుట్టూ దట్టమైన అటవీ ప్రాంతం. ఎన్నో రకాల పక్షి జాతులు, ప్రకృతి సోయగాలతో పర్యాటకులను అమితంగా ఆకట్టుకునే ప్రాంతం.. పాకాల సరస్సు. స్వచ్ఛతకు చిరునామాగా పేరొందిన ఈ సరస్సు.. ఆసియాలోనే ఏడో స్వచ్ఛమైన సరస్సుగా నిలిచింది. ఇలా ఎన్నో విశిష్టతలున్న ఈ తటాకానికి.. ప్లాస్టిక్ మహమ్మారి పెనుశాపంగా మారింది. సందర్శకులు, సమీప ప్రాంతాల ప్రజల విచ్చలవిడి ప్లాస్టిక్ వాడకంతో పాకాల సరస్సు క్రమంగా కాలుష్యపు కోరల్లో చిక్కుకుంటోంది.
కాకతీయుల పాలనకు సజీవ సాక్ష్యం.. అన్నదాతలకు అండగా, ప్రకృతి ప్రేమికులను కనువిందు చేసే పాకాల సరస్సు క్రమంగా కలుషితమవుతోంది. వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని ఈ సరస్సు.. ప్రకృతి రమణీయతకు మారుపేరుగా నిలుస్తోంది. వందలాది మొసళ్లకు ఆవాసంగా ఉన్న ఈ తటాకానికి ప్లాస్టిక్ శాపంగా మారుతోంది. చెరువు పరిసర గ్రామాలకు చెందిన ప్రజలు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చే సందర్శకులు విచ్చలవిడిగా ప్లాస్టిక్ వినియోగిస్తున్నారు. పాలిథీన్ కవర్లు, వాటర్ బాటిళ్లు, ఇతర ఆహార పొట్లాలను ఇష్టానుసారంగా అక్కడి పరిసరాల్లో పడేస్తుండటంతో.. అవన్నీ సరస్సులోకి కొట్టుకువస్తున్నాయి. పర్యాటక ప్రాంతాల్లో ప్లాస్టిక్ నిషేధాన్ని కొన్ని చోట్ల అమలు చేస్తున్నా.. పాకాల వద్ద మాత్రం విచ్చలవిడిగా ఉపయోగిస్తున్నారు. హైదరాబాద్లోని జూ పార్కులో ప్లాస్టిక్ను పూర్తిగా నిషేధించిన అధికారులు.. జూ లోపలికి పంపేముందు పక్కాగా తనిఖీలు చేస్తున్నారు. సందర్శకులు తెచ్చిన ప్లాస్టిక్ వస్తువులను అందులోకి అనుమతించడంలేదు. ప్రకృతి రమణీయతకు మారుపేరుగా నిలిచే పాకాల వద్ద సైతం అలాంటి నిబంధనలు విధిస్తే కాలుష్యం బారిన పడకుండా కాపాడే అవకాశం ఉంటుంది. అలా చేయకపోతే భవిష్యత్తులో సరస్సు మనుగడకు ముప్పు సంభవించే ప్రమాదం ఉందని పర్యావరణ ప్రేమికులు హెచ్చరిస్తున్నారు.
► Read latest General News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
రాష్ట్రంలో 3 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?