Pet parrot: ఆ చిలకను తెచ్చిన వారికి నగదు బహుమతి..
మనుషులు తప్పిపోయారన్న వార్తలు మనం తరచు టీవీల్లో, సోషల్ మీడియాల్లో చూస్తుంటాం. అడపాదడపా కుక్క తప్పిపోయిందన్న ప్రకటనలు చూస్తుంటాం.
ఇంటర్నెట్ డెస్క్: మనుషులు తప్పిపోయారన్న వార్తలు మనం తరచూ టీవీల్లో, సోషల్ మీడియాల్లో చూస్తుంటాం. అడపాదడపా కుక్క తప్పిపోయిందన్న ప్రకటనలు చూస్తుంటాం. కానీ, ఓ కుటుంబం చిలుక తప్పిపోయిందని, దాన్ని ఆచూకీ తెలిపిన వారికి నగదు బహుమతి ఇస్తామంటూ ప్రకటన చేశారు. అంతేకాదు చిలుక వివరాలు ఉన్న గోడ పత్రికను ఊరూవాడా అంతా అంటించారు. వివరాల్లోకి వెళితే.. బిహార్లోని గయా ప్రాంతానికి చెందిన ఓ కుటుంబం 12 సంవత్సరాలుగా ఒక చిలుకను పెంచుకుంటున్నారు. నెల క్రితం అది పంజరంలో నుంచి ఎగిరిపోయింది. దానిని తిరిగి ఇంటికి తీసుకురావడం కోసం వాళ్లు దగ్గర్లోని చెట్ల దగ్గరకు వెళ్లి ప్రత్యేకమైన శబ్దం చేశారు. అయినా అది తిరిగి రాకపోవడంతో దాని వివరాలతో పోస్టర్ వేసి ఊరంతా అంటించారు. సామాజిక మాధ్యమాల్లోనూ పోస్ట్ చేశారు. ఆచూకీ చెప్పిన వారికి రూ.5,100 బహుమతి ఇస్తామని ప్రకటించారు. దాని యజమాని మాట్లాడుతూ.. ‘ మా చిలుక(పోపో) తప్పిపోయింది. దానిని మేము 12 సంవత్సరాల నుంచి ఇంట్లో మనిషి లాగా పెంచుకుంటున్నాము. దయచేసి అది ఎవరికైనా దొరికితే మాకు తెచ్చివ్వండి. బదులుగా మీకు మూడు చిలుకలు ఇస్తాము’. అని అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలను వెంటనే నిలిపివేయండి: సుప్రీంకోర్టు ఆదేశం
ఏపీలో అక్రమ ఇసుక తవ్వకాలను వెంటనే నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. -
వైభవంగా సింహాద్రి అప్పన్న చందనోత్సవం.. భారీగా తరలివచ్చిన భక్తులు
భక్తులంతా వేయికళ్లతో ఎదురుచూసిన సింహాద్రి అప్పన్న స్వామి నిజరూప దర్శనం సాక్షాత్కారమైంది. వైశాఖ శుద్ధ తదియ పర్వదినాన్ని పురస్కరించుకుని సింహాచలంలో చందనోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (10/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు. -
అసెంబ్లీలో అలా తిట్టుకోవడం చూసి షాకయ్యా..: చిరంజీవి
సినీ నటుడు చిరంజీవి, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి నాటి జ్ఞాపకాలను ఒకరితో ఒకరు పంచుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల వేళ సుప్రీం తీర్పు ప్రయోజనకరం: కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్పై హర్షం
-
ఫ్రెండ్షిప్ మ్యారేజ్.. ఆ దేశంలో ఇదో కొత్త ట్రెండ్!
-
గూగుల్, యాపిల్కు పోటీగా మైక్రోసాఫ్ట్ గేమింగ్ స్టోర్
-
రోల్ మోడల్ లాంటి ఐపీఎల్లో... ఇదేం అంపైరింగ్!
-
ఖలిస్థానీ నేత అమృత్పాల్ సింగ్ నామినేషన్ దాఖలకు సహకరించాం: పంజాబ్ ప్రభుత్వం
-
వరుస నష్టాలకు బ్రేక్.. 260 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్