Droupadi Murmu: ఆత్మన్యూనతను దరిచేరనీయొద్దు: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
మనిషి ఎంత గొప్ప స్థాయికి ఎదిగినా.. తన మూలాలు, సంస్కృతిని మరవొద్దని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తెలిపారు. గ్రామమైనా, ఏజెన్సీ ప్రాంతమైనా సొంత సంస్కృతిని చూసి గర్వపడాలని అభిప్రాయపడ్డారు.
హైదరాబాద్: మనిషి ఎంత గొప్ప స్థాయికి ఎదిగినా.. తన మూలాలు, సంస్కృతిని మరవొద్దని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తెలిపారు. గ్రామమైనా, ఏజెన్సీ ప్రాంతమైనా సొంత సంస్కృతిని చూసి గర్వపడాలని అభిప్రాయపడ్డారు. శీతాకాల విడిదికి హైదరాబాద్ వచ్చిన ఆమె.. నగరంలోని నారాయణగూడ కేశవ్ మెమోరియల్ విద్యాసంస్థల విద్యార్థులతో ముఖాముఖిలో పాల్గొన్నారు. విద్యార్థుల సందేహాలను రాష్ట్రపతి నివృత్తి చేశారు. హైదరాబాద్ ఐటీ సహా ఇతర రంగాల్లో పురోగతి సాధించిందని.. విద్యార్థులు అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
‘‘గ్రామం, గిరిజన ప్రాంతం నుంచి వచ్చామనే ఆత్మన్యూనతను దరిచేరనీయొద్దు. సంస్కృతి పరిరక్షణ హక్కును కూడా రాజ్యాంగం మనకు కల్పించింది. మన దేశంలో ప్రతి ఊరికి గ్రామదేవత రక్షణగా ఉంటుంది. మన విశిష్ట సంస్కృతే మన ప్రత్యేక గుర్తింపు. మన రాజ్యాంగం మహిళలకు ఎన్నో అవకాశాలు కల్పించింది. అన్ని విషయాల్లో అమెరికాతో పోల్చుకోవద్దు. భారత్లో ఉన్నన్ని కులాలు, భాషలు, వైవిధ్యం అక్కడ లేవు. పిల్లలకు తల్లిదండ్రులు చిన్నతనం నుంచే విలువలు నేర్పాలి. పెరుగుతున్న యువ జనాభా భారత్కు మరింత సానుకూలం’’ అని ద్రౌపదీ ముర్ము అన్నారు.
గవర్నర్ తమిళిసై మాట్లాడుతూ దేశ మహోన్నత పదవిలో మహిళ ఉండటం గర్వకారణమన్నారు. దేశమంతా ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు జరుగుతున్న వేళ.. భారత్ విశ్వగురువుగా ఎదుగుతోందని చెప్పారు. కేంద్రమంత్రి కిషన్రెడ్డి మాట్లాడుతూ దేశాభివృద్ధి కోసం ఏదైనా చేయాలనే ఆలోచన విద్యార్థుల్లో రావాలని సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నోటా.. వచ్చిందిలా
ఓటు హక్కును వినియోగించుకోవడం అందరి బాధ్యత. నచ్చని అభ్యర్థులు పోటీలో ఉన్నప్పుడు తమ అభిప్రాయాన్ని వ్యక్తీకరించే అవకాశం లేకపోవడం వల్ల రకరకాల పద్ధతుల్లో గతంలో తమ వ్యతిరేకతను తెలిపేవారు. -
రైలు తలుపు.. మృత్యు పిలుపు
కాగజ్నగర్ రైల్వే స్టేషన్ పరిధిలో ఈ మధ్య తరచూ రైల్వే ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఎక్కువగా రైళ్ల నుంచి కిందపడి తీవ్ర గాయాలపాలై మృతిచెందుతున్నారు. బల్లార్ష-దిల్లీ మధ్య నిత్యం ప్రతి అరగంటకు ఒక ప్యాసింజర్, ఎక్స్ప్రెస్, సూపర్ఫాస్ట్ రైళ్లు ప్రయాణిస్తుంటాయి. -
ప్రచార జోరు.. వ్యూహాలకు పదును
ఎన్నికల కోడ్ కూసింది మొదలు ఖమ్మం, మహబూబాబాద్ లోక్సభ స్థానాల్లో అగ్రనేతల సమావేశాలు, సభలతో పట్టణాలకే పరిమితమైన ప్రచారం -
ఓట్ల పండగకు ఆహ్వానం
పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఓటరు చైతన్యంపై సామాజిక మాధ్యమాల్లో వినూత్న సందేశాలు చక్కర్లు కొడుతున్నాయి. -
ఐఎఫ్ఎస్లో మెరిసిన పల్లె బిడ్డలు
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మారుమూల పల్లెలకు చెందిన ఇద్దరు యువకులు ఐఎఫ్ఎస్ సాధించారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (09/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.