Droupadi Murmu: ఆత్మన్యూనతను దరిచేరనీయొద్దు: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
మనిషి ఎంత గొప్ప స్థాయికి ఎదిగినా.. తన మూలాలు, సంస్కృతిని మరవొద్దని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తెలిపారు. గ్రామమైనా, ఏజెన్సీ ప్రాంతమైనా సొంత సంస్కృతిని చూసి గర్వపడాలని అభిప్రాయపడ్డారు.
హైదరాబాద్: మనిషి ఎంత గొప్ప స్థాయికి ఎదిగినా.. తన మూలాలు, సంస్కృతిని మరవొద్దని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తెలిపారు. గ్రామమైనా, ఏజెన్సీ ప్రాంతమైనా సొంత సంస్కృతిని చూసి గర్వపడాలని అభిప్రాయపడ్డారు. శీతాకాల విడిదికి హైదరాబాద్ వచ్చిన ఆమె.. నగరంలోని నారాయణగూడ కేశవ్ మెమోరియల్ విద్యాసంస్థల విద్యార్థులతో ముఖాముఖిలో పాల్గొన్నారు. విద్యార్థుల సందేహాలను రాష్ట్రపతి నివృత్తి చేశారు. హైదరాబాద్ ఐటీ సహా ఇతర రంగాల్లో పురోగతి సాధించిందని.. విద్యార్థులు అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
‘‘గ్రామం, గిరిజన ప్రాంతం నుంచి వచ్చామనే ఆత్మన్యూనతను దరిచేరనీయొద్దు. సంస్కృతి పరిరక్షణ హక్కును కూడా రాజ్యాంగం మనకు కల్పించింది. మన దేశంలో ప్రతి ఊరికి గ్రామదేవత రక్షణగా ఉంటుంది. మన విశిష్ట సంస్కృతే మన ప్రత్యేక గుర్తింపు. మన రాజ్యాంగం మహిళలకు ఎన్నో అవకాశాలు కల్పించింది. అన్ని విషయాల్లో అమెరికాతో పోల్చుకోవద్దు. భారత్లో ఉన్నన్ని కులాలు, భాషలు, వైవిధ్యం అక్కడ లేవు. పిల్లలకు తల్లిదండ్రులు చిన్నతనం నుంచే విలువలు నేర్పాలి. పెరుగుతున్న యువ జనాభా భారత్కు మరింత సానుకూలం’’ అని ద్రౌపదీ ముర్ము అన్నారు.
గవర్నర్ తమిళిసై మాట్లాడుతూ దేశ మహోన్నత పదవిలో మహిళ ఉండటం గర్వకారణమన్నారు. దేశమంతా ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు జరుగుతున్న వేళ.. భారత్ విశ్వగురువుగా ఎదుగుతోందని చెప్పారు. కేంద్రమంత్రి కిషన్రెడ్డి మాట్లాడుతూ దేశాభివృద్ధి కోసం ఏదైనా చేయాలనే ఆలోచన విద్యార్థుల్లో రావాలని సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Chandrababu: ఇన్నర్ రింగ్రోడ్డు కేసు.. చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్పై తీర్పు రిజర్వ్
-
The Great Indian Suicide: చనిపోయిన వ్యక్తిని బతికించడానికి 8మంది ఆత్మహత్య!
-
వైర్లెస్ ఇయర్ఫోన్స్ కొనేటప్పుడు ఏమేం చూడాలి? ఇంతకీ ఏమిటీ నాయిస్ క్యాన్సిలేషన్?
-
PM Modi: ఎన్టీపీసీ విద్యుత్ ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ
-
Asteroid: లక్ష్యం లేకుండా సంచరిస్తున్న భారీ గ్రహశకలం.. భూమికి సమీపంగా వస్తోందట!
-
Nizamabad: మోదీ సభకు భారీగా తరలివచ్చిన ప్రజలు.. బైపాస్ రోడ్డు మూసివేత