ప్రచార జోరు.. వ్యూహాలకు పదును
ఎన్నికల కోడ్ కూసింది మొదలు ఖమ్మం, మహబూబాబాద్ లోక్సభ స్థానాల్లో అగ్రనేతల సమావేశాలు, సభలతో పట్టణాలకే పరిమితమైన ప్రచారం
ఈటీవీ, ఖమ్మం, ఈనాడు డిజిటల్, కొత్తగూడెం: ఎన్నికల కోడ్ కూసింది మొదలు ఖమ్మం, మహబూబాబాద్ లోక్సభ స్థానాల్లో అగ్రనేతల సమావేశాలు, సభలతో పట్టణాలకే పరిమితమైన ప్రచారం.. ఇప్పుడు పల్లెలకు చేరుతోంది. పోలింగ్ సమయం ముంచుకొస్తుండటంతో ప్రధాన పార్టీల అభ్యర్థుల ప్రచారం జోరందుకుంటోంది. కరపత్రాల పంపిణీ, ఇంటింటి ప్రచారం, పోలింగ్ బూత్ స్థాయిలో సమావేశాలు, ఆత్మీయ సమ్మేళనాలతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు యత్నిస్తున్నారు. మరోవైపు ప్రత్యర్థి పార్టీల నాయకులు, కార్యకర్తల కదలికలపై ఓ కన్నేసి ఉంచుతున్నారు.
ముగిసిన అగ్రనేతల పర్యటనలు
ఖమ్మం, మహబూబాబాద్ లోక్సభ స్థానాల్లో అగ్రనేతల బహిరంగ సభలు, రోడ్షోలు దాదాపు ముగిసినట్టే. కొత్తగూడెం, మణుగూరులో నిర్వహించిన బహిరంగ సభల్లో సీఎం రేవంత్రెడ్డి పాల్గొన్నారు. భారాస చేపట్టిన బస్సు యాత్రలో భాగంగా ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్లో నిర్వహించిన రోడ్షోల్లో మాజీ సీఎం కేసీఆర్ ప్రసంగించారు. కొత్తగూడెం, మహబూబాబాద్లో భాజపా బహిరంగ సభలకు ఆపార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా హాజరయ్యారు.
స్థానిక నాయకులు అన్నీ తామై..
మూడు రోజుల్లో ప్రచార ఘట్టం ముగియనుంది. ఇంత తక్కువ వ్యవధిలో లోక్సభ స్థానం పరిధిలోని అన్ని గ్రామాల్లో పర్యటించడం సాధ్యం కాదని అభ్యర్థులే చెబుతున్నారు. అందుకే వారి అనుచరులు, పార్టీ ముఖ్యనాయకులు, బంధువులు ఎక్కడికక్కడ ప్రచార బాధ్యతలను భుజానికెత్తుకుంటున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు బహిరంగ సభలు, కార్నర్ సమావేశాలు, ర్యాలీలకు ప్రాధాన్యమిస్తుంటే ఆయా పార్టీల స్థానిక నాయకులు ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుస్తున్నారు. ఎండల తీవ్రత కారణంగా బహిరంగ సభలకు హాజరుకాని ప్రజల కోసం ప్రధాన పార్టీల అభ్యర్థుల ప్రచార వాహనాలకు మైకులు పెట్టి అగ్రనేతల ప్రసంగాలు వినిపిస్తున్నారు.
పదవుల ఆశ చూపుతూ..
ఇప్పుడు మద్దతుగా నిలిస్తే.. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచి, ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యుల పదవులు కట్టబెట్టేందుకు సహకరిస్తామని గ్రామస్థాయి నాయకులకు ఆయా పార్టీల ముఖ్యనేతలు హామీ ఇస్తున్నారు. ప్రత్యర్థి పార్టీల నాయకులను ఇదేమాదిరిగా తమ బుట్టల్లో వేసుకుంటున్నారు.
వనరులను సమకూర్చుకుంటూ..
రోజు వారీగా ప్రచారం ముగిశాక రాత్రి 10 గంటల నుంచి అర్ధరాత్రి వరకు ముఖ్యులతో అభ్యర్థులు సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఓటుబ్యాంకును పదిలపరుచుకునేందుకు వ్యూహాలకు పదును పెడుతున్నారు. వార్డులు, గ్రామాల్లో ప్రభావం చూపే నాయకులు, యువకులను లక్ష్యంగా చేసుకొని తమకు సహకరించాలని వర్తమానం పంపుతున్నారు. పోలింగ్కు ముందు రెండు రోజుల పాటు ఓటర్లకు మద్యం, డబ్బు పంపిణీకి కావాల్సిన వనరులను సమకూర్చుకుంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 pM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
తెలంగాణ ఈసెట్ ఫలితాలు వచ్చేశాయ్
Telangana ECET Results: పాలిటెక్నిక్ డిప్లొమా, బీఎస్సీ (గణితం) విద్యార్థులు లేటరల్ ఎంట్రీ ద్వారా బీటెక్, బీఫార్మసీ రెండో ఏడాదిలో ప్రవేశానికి నిర్వహించిన ఈసెట్ (TG ECET Results) ఫలితాలు విడుదలయ్యాయి. -
ప్రారంభమైన ‘టెట్’ ఎగ్జామ్.. పరీక్షా కేంద్రాల వద్ద రద్దీ
తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ప్రారంభమైంది. అభ్యర్థుల రాకతో వివిధ పరీక్షా కేంద్రాల వద్ద రద్దీ నెలకొంది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో అభిషేకం టికెట్లపై అదనపు బాదుడు.. భక్తుల జేబుకు చిల్లు
శ్రీశైలం దేవస్థానంలో భక్తుల నుంచి అదనంగా టికెట్ రుసుం వసూలు చేస్తున్నారు. అభిషేక కర్తలతోపాటు అదనంగా వచ్చే వారికి టికెట్ రేటు పెంచి విక్రయిస్తున్నారు. -
ఏపీలో ఎన్నికల హింసపై సిట్ నివేదిక సిద్ధం
ఏపీలో ఎన్నికలకు ముందు, తర్వాత హింసపై సిట్ ప్రాథమిక నివేదిక సిద్ధమైంది. ఉదయం 10 గంటలకు డీజీపీకి ప్రత్యేక విచారణ బృందం నివేదిక అందించనుంది. -
బతుకుజీవుడా..
జాతీయ, రాష్ట్రీయ రహదారులపై వాహనాలు వేగంగా దూసుకెళ్తుంటాయి. ప్రధాన మార్గాల్లో రాత్రివేళల్లోనూ రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో వేసవిలో రోడ్లపై కొనసాగుతున్న పశు సంచారం రోడ్డు ప్రమాదాలకు కారణమవుతోంది. -
నాణ్యతే ప్రామాణికం.. అవగాహనే కీలకం
రోజువారీ జీవితంలో లెక్కలు, కొలతలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఉదయం లేచిన వెంటనే తాగే నీటి నుంచి రాత్రి నిద్రకు ఉపక్రమించే వరకు తీసుకునే ఆహార పదార్థాలు, వినియోగించే పరికరాల నాణ్యతపైనే మన కార్యకలాపాలు ఆధారపడి ఉంటాయి. -
రాములోరికి పసిడి పుష్పార్చన
భద్రాచలం రామాలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. కోవెల పరిసరాలు కిక్కిరిసిపోయాయి. మూలవిరాట్కు అర్చకులు సుప్రభాతం పలికి ఆరాధించారు. -
అరచేతిలో వాతావరణ సమాచారం
వాతావరణంలోని మార్పులను ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక యాప్లను రూపొందించింది. ప్రధానంగా వర్షాకాలంలో వీటి ఉపయోగం ఎక్కువగా ఉండనుంది. -
సింగరేణిలో ఎందుకీ వివక్ష?
ఎన్నికల విధుల్లో పాల్గొంటే ఎంతో కొంత లాభం జరగాలి కదా.. నష్టం ఎందుకు అంటారా.. సింగరేణి క్లరికల్ సిబ్బందికి ఆర్థికంగానే కాకుండా ఇతరత్రా నష్టం వాటిల్లుతోంది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
బాలుడి డ్రైవింగ్తో ఇద్దరి మృతి.. ప్రమాదంపై టీనేజర్ను వ్యాసం రాయమన్న కోర్టు
-
అది మనసులో పెట్టుకొనే ఓటేశా: పౌరసత్వం తర్వాత అక్షయ్ కుమార్ తొలి ఓటు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 pM
-
ఐఆర్జీసీకి ఆప్తుడు.. ఎవరీ హొస్సేన్ అమీర్ అబ్దొల్లహియన్
-
ఎస్బీఐ కస్టమర్లకు అలర్ట్.. ఆ లింకులపై క్లిక్ చేయొద్దు..!
-
సంబరాల్లో బెంగళూరు.. ధోనీతో కరచాలనం చేసేందుకూ సమయం లేదా?: మాజీలు