Telangana News: గంజాయికి బానిసైన కోదాడ విద్యార్థికి ‘గాంధీ’లో చికిత్స .. వైద్యులు ఏమన్నారంటే?
గంజాయి మత్తుకు బానిసైన సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన 8వ తరగతి విద్యార్థి ప్రస్తుతం సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కుమారుడు గంజాయి సేవిస్తున్నాడన్న ఆగ్రహంతో తల్లి ...
హైదరాబాద్: గంజాయి మత్తుకు బానిసైన సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన 8వ తరగతి విద్యార్థి ప్రస్తుతం సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కుమారుడు గంజాయి సేవిస్తున్నాడన్న ఆగ్రహంతో తల్లి .. బాలుడిని స్తంభానికి కట్టేసి కళ్లలో కారం పోసి కొట్టడంతో గాయపడ్డాడు. గంజాయి అధిక మోతాదులో తీసుకోవడంతో బాలుడికి మానసికంగా, శారీరకంగా ఇబ్బందులు తలెత్తినట్టు గాంధీ ఆసుపత్రి వైద్యులు పేర్కొన్నారు. ఏడాది నుంచి తోటి స్నేహితులతో కలిసి నిర్మానుష్య ప్రాంతాల్లో గంజాయి సేవిస్తూ, ఉదయం నుంచి రాత్రి వరకు అక్కడే మత్తులో తూగుతూ ఉండే వాళ్లమని విద్యార్థి తెలిపాడు. ఒక సారి ఫ్రెండ్ ద్వారా గంజాయి సేవించడంతో దానికి బానిసయ్యానని వివరించాడు. అరకు నుంచి గంజాయి వస్తుందని, ఒక్కో పొట్లం రూ.500 చొప్పున కొనుగోలు చేస్తున్నామని తెలిపాడు. తాము కూలి పనులకు ఉదయం వెళ్లి రాత్రికి ఇంటికి వస్తామని, కుమారుడు గంజాయి సేవిస్తున్న విషయం ఆలస్యంగా గుర్తించామని విద్యార్థి తండ్రి మీడియాకు వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. -
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
రాష్ట్రంలో 3 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్