CM Kcr: పోడు సాగుదారుల నుంచి దరఖాస్తుల స్వీకరణకు సీఎం ఆదేశం
పోడు భూముల సమస్య పరిష్కరించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. పోడు భూముల సమస్య పరిష్కారం, అడవుల పరిరక్షణతో పాటు హరితహారంపై తెలంగాణ
హైదరాబాద్: పోడు భూముల సమస్య పరిష్కరించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. పోడు భూముల సమస్య పరిష్కారం, అడవుల పరిరక్షణతో పాటు హరితహారంపై తెలంగాణ సీఎం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ... అడవులపై ఆధారపడిన గిరిజనులకు మేలు చేయాలని, అడవులను నాశనం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అడవుల రక్షణలో అధికారులు, ప్రజాప్రతినిధులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. నవంబరు 8 నుంచి డిసెంబరు 8వరకు పోడు భూములు సాగుచేస్తున్న వారి నుంచి దరఖాస్తులు స్వీకరించాలని ఆదేశించారు.
‘‘నవంబరు 8లోపు సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేయాలి. ఆర్వోఎఫ్ఆర్ చట్టం ప్రకారం గ్రామ కమిటీలు నియమించాలి. రెండు, మూడు గ్రామాలకు ఒక నోడల్ అధికారి ఉండాలి. గంజాయి సాగు చేసే వారికి రైతుబంధు, బీమా, విద్యుత్ బంద్ చేయాలి. గంజాయి సాగు చేసేవారిని అరెస్టు చేసి జైలుకు పంపిస్తాం. ఆర్వోఎఫ్ఆర్ భూముల్లో గంజాయి సాగుచేస్తే పట్టా రద్దు చేస్తాం. గుడుంబా తయారీని పూర్తిస్థాయిలో అరికట్టాలి. గుడుంబా తయారీ దారులకు ఉపాధి, పునరావాసం కల్పించాలి’’ అని సీఎం ఆదేశించారు. ప్రగతిభవన్లో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, అటవీశాఖ, గిరిజన సంక్షేమశాఖ అధికారులతో పాటు మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్రావు, ప్రశాంత్రెడ్డి, సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. -
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
రాష్ట్రంలో 3 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM