Earthquake: శ్రీకాకుళం జిల్లాలోభూప్రకంపనలు

శ్రీకాకుళం జిల్లాలో స్వల్ప భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి.

Updated : 05 Jan 2022 05:17 IST

శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలో స్వల్ప భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఇచ్ఛాపురం, కవిటి మండలాల్లో మంగళవారం రాత్రి భూ ప్రకంపనలు వచ్చాయి. రత్తకన్న, తేలుకుంచి, అమీన్‌సాహిబ్‌ పేట, పురుషోత్తపురం గ్రామాల్లో, ఇచ్ఛాపురం సమీప ఒడిశా ప్రాంతంల్లోనూ భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. పది నిమిషాల వ్యవధిలో భూమి మూడుసార్లు కంపించింది. దీంతో ప్రజలు ఏం జరుగుతుందో తెలియక తీవ్ర భయాందోళనలతో ఇళ్ల నుంచి బయటికి వచ్చి పరుగులు తీశారు. 
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని