HYD: భక్తుల కోలాహలం మధ్య సాగర్‌కు చేరువవుతున్న మహాగణపతి

భక్తుల కోలాహలం మధ్య వినాయకుడి శోభాయాత్ర సందడిగా కొనసాగుతోంది. ఖైరతాబాద్‌ మహాగణపతి

Published : 19 Sep 2021 13:00 IST

హైదరాబాద్‌: భక్తుల కోలాహలం మధ్య వినాయకుడి శోభాయాత్ర సందడిగా కొనసాగుతోంది. ఖైరతాబాద్‌ మహాగణపతి యాత్ర తెలుగు తల్లి ఫైఓవర్‌ వరకు చేరుకుంది. గంగమ్మ ఒడిలో చేరడానికి ముందుకు సాగుతున్న గణనాథుడిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. మరోవైపు బాలాపూర్‌ గణపతి సైతం నిమజ్జనానికి హుస్సేన్‌ సాగర్‌ వైపు కదిలాడు. పది అడుగులు ఆపై ఎత్తు ఉన్న విగ్రహాలను ట్యాంక్‌ బండ్‌ వైపు మళ్లిస్తున్నారు. పది అడుగుల లోపు విగ్రహాలు ఎన్టీఆర్‌ మార్గ్‌, పీవీ మార్గ్‌లో నిమజ్జనం చేస్తున్నారు. వీటితో పాటు నగరం శివారుల్లోని జలాశయాల్లో నిమజ్జనం కొనసాగుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని