Rain effect: ఇంట్లో ఉండలేరు.. బయటకు రాలేరు!
గత రెండురోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో భాగ్యనగర వాసులు అల్లాడుతున్నారు. వరద సమస్య ఒకవైపు అయితే దీనికితోడు డ్రైనేజీ సమస్య మరో వైపు. ..
హైదరాబాద్: గత రెండురోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో భాగ్యనగర వాసులు అల్లాడుతున్నారు. వరద సమస్య ఒకవైపు అయితే దీనికితోడు డ్రైనేజీ సమస్య మరో వైపు. దీంతో ఇంట్లో ఉండలేక, బయటకి వెళ్లలేక కాలనీ వాసులు ఇబ్బందులు పడుతున్నారు. మీర్పేట కార్పొరేషన్ పరిధిలోని జిల్లెలగూడ పరిధిలోని సాయినగర్ కాలనీలో వరదనీటితో ప్రజలు సతమతమవుతుండగా.. దీనికి తోడు డ్రైనేజీ నీరు కూడా కలిసి కాలనీల్లో పొంగి ప్రవహిస్తూ దుర్గంధం వెదజల్లుతోంది. వరద నీటితో కాలనీల్లో రోడ్లన్నీ దెబ్బతిన్నాయి. రెండేళ్లుగా స్థానికులు ఇదే సమస్యతో ఇబ్బంది పడుతుంటే ఆరు నెలల క్రితం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు ప్రారంభించారు. కానీ, అసంపూర్తిగా వదిలేశారు. దీంతో డ్రైనేజీ వాటర్ మొత్తం రోడ్లపైకి చేరి ఇళ్లలోంచి జనం బయటకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. దుర్వాసన, దోమల బెడదతో అనారోగ్యానికి గురై ఆసుపత్రి పాలవుతున్నామని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులకు పలుమార్లు విన్నవించినా పట్టించుకోలేదని, ఇప్పటికైనా డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని వారంతా కోరుతున్నారు.
వరదనీటిలో ఎల్బీనగర్లోని లోతట్టు కాలనీలు
భారీ వర్షాలకు ఎల్బీనగర్లోని లోతట్టు కాలనీలన్నీ వరద నీటిలోనే నానుతున్నాయి. వనస్థలిపురం పరిధిలోని శారదానగర్, శాంతి నగర్ కాలనీ, గాంధీ నగర్, విజయపురి కాలనీలో రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోయింది. హయత్నగర్ పరిధిలో రాత్రి కురిసిన వర్షానికి మునగనూర్, తొర్రూర్, బంజారా కాలనీ, అంబేడ్కర్ నగర్, భగత్సింగ్ కాలనీల్లో రోడ్లన్నీ జలమయం కావడంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నన్ను చంపేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. -
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
రాష్ట్రంలో 3 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
నన్ను చంపేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్