తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్‌

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది. తెలంగాణలో 6, ఏపీలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి...

Updated : 31 Oct 2021 16:17 IST

దిల్లీ: తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది. తెలంగాణలో 6, ఏపీలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. నవంబరు 9న నోటిఫికేషన్‌, 29న పోలింగ్‌.. అదే రోజు లెక్కింపు జరగనుంది. ఈ మేరకు భారత ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది. ఏపీలో ఈ ఏడాది మే 31న మూడు, తెలంగాణలో జూన్‌ 3వ తేదీన ఆరు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయిన విషయం తెలిసిందే. కరోనా విజృంభణ నేపథ్యంలో ఆ సమయంలో ఎన్నికల నిర్వహణను ఈసీ వాయిదా వేసింది.

ఎమ్మెల్సీలుగా ఏపీలో చిన గోవిందరెడ్డి, మహ్మద్‌ షరీఫ్‌, సోము వీర్రాజు.. తెలంగాణలో ఆకుల లలిత, మహ్మద్‌ ఫరూద్దీన్‌, గుత్తా సుఖేందర్‌రెడ్డి, నేతి విద్యాసాగర్‌, వెంకటేశ్వర్లు, కడియం శ్రీహరిల పదవీకాలం ముగియడంతో ఆ ఖాళీలను భర్తీ చేసేందుకు ఈసీ షెడ్యూల్‌ విడుదల చేసింది.

ఎన్నికల ప్రక్రియ ఇలా..

నోటిఫికేషన్ : నవంబరు 9

నామినేషన్ల దాఖలుకు తుది గడువు- నవంబరు 16

నామినేషన్ల పరిశీలన- నవంబరు 17

నామినేషన్ల ఉప సంహరణకు చివరి తేదీ- నవంబరు 22

పోలింగ్‌- నవంబరు 29

ఓట్ల లెక్కింపు- నవంబరు 29


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని