TS High Court: టీఎస్పీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ రద్దుపై విచారణ వాయిదా
టీఎస్పీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ రద్దుపై హైకోర్టు డివిజన్ బెంచ్లో విచారణ బుధవారానికి వాయిదా పడింది.
హైదరాబాద్: టీఎస్పీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ రద్దుపై హైకోర్టు డివిజన్ బెంచ్లో విచారణ బుధవారానికి వాయిదా పడింది. పరీక్షకు సంబంధించి పూర్తి వివరాలు సమర్పించాలని అడ్వొకేట్ జనరల్ను ఆదేశిస్తూ తదుపరి విచారణను న్యాయమూర్తి వాయిదా వేశారు.
‘‘బయోమెట్రిక్ అమలు చేయడం వల్ల ఇబ్బందేమిటి?గతంలో అలా అమలు చేసిన పరీక్షల వివరాలను తెలపండి. నోటిఫికేషన్లో పేర్కొన్నట్లు బయోమెట్రిక్ ఎందుకు అమలు చేయలేదు? మీ నోటిఫికేషన్ను మీరే అమలు చేయకపోతే ఎలా? ఒకసారి పరీక్ష రద్దయ్యాక మరింత జాగ్రత్తగా ఉండాలి కదా? నిరుద్యోగుల్లో విశ్వాసం కల్పించాల్సిన బాధ్యత టీఎస్పీఎస్సీకి ఉంది. అభ్యర్థుల భవిష్యత్తు, టీఎస్పీఎస్సీ ప్రతిష్ఠ ప్రశ్నార్థకంగా మారాయి’’ అని విచారణ సందర్భంగా హైకోర్టు వ్యాఖ్యానించింది. గ్రూప్ -1 ప్రిలిమ్స్ను రద్దు చేస్తూ ఈ నెల 23న హైకోర్టు సింగిల్ జడ్జి ఆదేశాలు జారీ చేశారు. హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలపై టీఎస్పీఎస్సీ అప్పీల్కు వెళ్లిన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


తాజా వార్తలు (Latest News)
-
రెండిళ్ల గొడవ.. రోడ్డెక్కింది గోడై!
-
IPL: ఐపీఎల్ వేలం.. 1166 మంది క్రికెటర్ల ఆసక్తి
-
Israel-Hamas Conflict: ఆగిన కాల్పులు విరమణ.. ఇజ్రాయెల్ దాడిలో 178 మంది మృతి
-
టీచర్ అవుదామనుకొని..
-
Gujarat: గుండెపోటుతో 6 నెలల్లో 1052 మంది మృతి.. 80శాతం 25ఏళ్ల లోపువారే!
-
Surya Kumar Yadav: ఆ ఒక్కటి మినహా.. అంతా మాకు కలిసొచ్చింది: సూర్య