నా ఒక్క ఓటే కదా... అనుకుంటే ఎలా?
‘నా ఒక్క ఓటే కదా.. వేయకపోతే ఏమవుతుంది’ చాలా మందిలో ఉన్న భావన ఇదే. ఓటు హక్కు ఉన్నప్పటికీ పోలింగ్ కేంద్రం వరకు వచ్చి ఓటు వేసేందుకు చాలామంది ఆసక్తి చూపించరు. ఇలా ప్రతి ఒక్కరు నా ఒక్క ఓటే కదానుకుంటే అనర్హులు అందలమెక్కే ప్రమాదం ఉందని భావించాలి.
గెలుపోటముల్లో ప్రతి ఓటు కీలకమే
ఈనాడు, హైదరాబాద్: ‘నా ఒక్క ఓటే కదా.. వేయకపోతే ఏమవుతుంది’ చాలా మందిలో ఉన్న భావన ఇదే. ఓటు హక్కు ఉన్నప్పటికీ పోలింగ్ కేంద్రం వరకు వచ్చి ఓటు వేసేందుకు చాలామంది ఆసక్తి చూపించరు. ఇలా ప్రతి ఒక్కరు నా ఒక్క ఓటే కదానుకుంటే అనర్హులు అందలమెక్కే ప్రమాదం ఉందని భావించాలి. భాగ్యనగరంలో ప్రతి ఎన్నికల్లో పోలింగ్ శాతం తగ్గడానికి రకరకాల కారణాలతోపాటు కొందరి ఓటర్లలో ఉన్న ఇలాంటి ధోరణి కూడా కారణమని నిపుణులు చెబుతున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్క ఓటు కీలకమే. కొన్నిసార్లు ఒక్క ఓటు సైతం అభ్యర్థుల గెలుపోటములపై ప్రభావం చూపిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. గత ఎంపీ ఎన్నికలో పాతబస్తీలో మరీ తక్కువగా 39 శాతం ఓట్లు పోలవగా దాదాపు 61 శాతం మంది తమ ఓటుహక్కు వినియోగించుకోలేదు. ఒక్క చేవెళ్లలో 53.80శాతం ఓట్లు పోలవగా సికింద్రాబాద్, మల్కాజిగిరిల్లో 45 శాతం లోపే నమోదయ్యాయి.
ప్రశ్నించే హక్కు ఎక్కడ?
ఓటు వేయకుంటే ప్రశ్నించే తత్వం బలహీన పడుతుంది. ఓటు హక్కు వినియోగించుకోవడం వల్ల ధైర్యంగా స్థానిక ప్రజాప్రతినిధుల దృష్టికి ఆయా సమస్యలను నేరుగా తీసుకెళ్లే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఎన్నికల సందర్భంగా అన్ని ప్రధాన పార్టీలు నియోజకవర్గాల వారీగా మానిఫెస్టోలను తయారు చేసి కాలనీలు, అపార్ట్మెంట్లలో పంచుతున్నారు. పారిశుద్ధ్యం, తాగునీరు, రోడ్లు ఇతర మౌలిక వసతులు కల్పిస్తామని భరోసా ఇస్తున్నారు. ఓటు హక్కును వినియోగించుకోవడం వల్ల గెలిచిన అభ్యర్థి ఆయా సమస్యలపై దృష్టి పెట్టకపోతే నిలదీసే అవకాశం ఉంటుంది. అసలు ఓటే వేయకపోతే ప్రశ్నించే హక్కు కోల్పోయినట్లేనని నిపుణులు చెబుతున్నారు.
నోటా ఉంది కదా...?
ఏ పార్టీకి, ఏ అభ్యర్థికి ఓటు వేయడం ఇష్టం లేకపోతే నోటాను ఎన్నికల సంఘం అందుబాటులోకి తెచ్చింది. నగరంలో ప్రతి ఎన్నికల్లో కొన్ని నియోజక వర్గాల్లో పెద్ద సంఖ్యలో నోటా ఓట్లు నమోదయ్యాయి. నోటా ద్వారా తమ పనితీరు నచ్చక ప్రజలు ఎక్కువ శాతం నోటాను ఎన్నుకుంటున్నారని అభ్యర్థుల్లో బాధ్యతను గుర్తు చేయవచ్చని చెబుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏసీపీ ఉమామహేశ్వరరావు.. ఆయన తీరెప్పుడూ వివాదాస్పదమే
[ 22-05-2024]
ఎస్సై.. ఇన్స్పెక్టర్.. ఏసీపీ.. ఎక్కడ పనిచేసినా ఆయన తీరెప్పుడూ వివాదాస్పదమే. కింది స్థాయి సిబ్బందిని వేధించి సస్పెండ్ అయ్యారు. ఓ మహిళ నుంచి ఫిర్యాదు తీసుకునే క్రమంలో ఆమె కూర్చున్న మంచంపై దర్జాగా కాలుపెట్టి క్రమశిక్షణ చర్యలకు గురయ్యారు. -
గాడి తప్పిన నగర సీసీఎస్
[ 22-05-2024]
నగర సీసీఎస్.. కీలక ఆర్థిక నేరాల కేసులను ఛేదించటంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం గాడి తప్పింది. తాజాగా సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు నివాసంలో, మరికొన్ని చోట్ల దాడులు నిర్వహించగా భారీఎత్తున నోట్లకట్టలు, -
ఔటర్ చుట్టూ.. ఔరా అనిపించేలా
[ 22-05-2024]
రాష్ట్రంలో కొత్తగా ఐటీ సంస్థలు. పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం శరవేగంగా ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. ఔటర్ చుట్టూ వాటిని ఏర్పాటు చేసేందుకు వీలుగా ప్రభుత్వ భూములను సేకరించేందుకు రెవెన్యూ అధికారుల కసరత్తు చేస్తున్నారు. -
జూలో జత కలిసే
[ 22-05-2024]
హైదరాబాద్ నగరంలోని నెహ్రూ జూపార్కులోని పెద్దపులులు నాలుగేళ్ల తర్వాత జత కలిశాయి. కేటాయించిన స్థలంతో పోలిస్తే వాటి సంతతి ఎక్కువ అవడంతో కేంద్ర జూ అథారిటీ(సీజెడ్ఏ) అప్పట్లో ఆంక్షలు విధించింది. -
విద్యార్థుల సృజనకు సరికొత్త వేదిక
[ 22-05-2024]
సరికొత్త ఆలోచనలు... విభిన్న కోణాల్లో సమాజ స్థితిగతులపై అధ్యయనం... అత్యాధునిక సమాచార సాంకేతిక పరిజ్ఞానంతో లఘు చిత్రాలు రూపొందించనున్న విద్యార్థులకు ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రోత్సాహం ఇవ్వనుంది. -
వర్షపు నీటినీ తాగొచ్చు
[ 22-05-2024]
నగరంలో కురుస్తున్న వాన నీటిలో కొంతైనా భూమిలోకి ఇంకించినా.. ఫిల్టర్ చేసి వాడుకున్నా.. నగరవాసులకు నీటి కష్టాలే ఉండవు. నగరంలో సరాసరి వర్షపాతం 850 మిల్లీమీటర్లు. హెచ్ఎండీఏ పరిధిలో 7,200 చదరపు కిలోమీటర్ల మేరకు ఏటా కురుస్తున్న వాన నీళ్లు 15 టీఎంసీలకు సమానమని నిపుణులు చెబుతున్నారు. -
వానాకాలం సన్నద్ధత షురూ
[ 22-05-2024]
సాధారణంగా మే నెలలో ఎండలు మండుతుంటాయి.. రెప్పపాటు కాలం కరెంట్ పోయినా చెమటలు కక్కాల్సిందే.. ఇటీవల కురుస్తున్న వర్షాలతో ప్రస్తుతం వాతావరణం సాధారణంగానే ఉంది. -
అనుభవజ్ఞులకు చోటు
[ 22-05-2024]
రాజధానిలోని 5 విశ్వవిద్యాలయాలకు ఇన్ఛార్జులుగా అనుభవజ్ఞులైన ఐఏఎస్ అధికారులు ఎం.దానకిషోర్, బుర్రా వెంకటేశం, డాక్టర్ శైలజా రామయ్యర్, ఎస్.ఎ.ఎం.రిజ్వీ, జయేష్ రంజన్ను రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం నియమించింది. -
ఇళ్ల దరఖాస్తుల తిరస్కరణపై గ్రేటర్ కమిషనర్ ఆగ్రహం
[ 22-05-2024]
నిర్మాణ అనుమతుల కోసం వచ్చే దరఖాస్తులను ఉద్దేశపూర్వకంగా తిరస్కరిస్తూ.. ప్రజలను వేధింపులకు గురిచేస్తున్నారంటూ జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్రాస్ టౌన్ప్లానింగ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
నిర్లక్ష్యం.. తప్పదు మూల్యం
[ 22-05-2024]
శిరస్త్రాణం లేకుండా ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్నారా.. అయితే మీ జేబుకు భారీగా చిల్లు పడినట్లే. ఒకసారి హెల్మెట్ ధరించకుండా వాహనం నడిపితే ట్రాఫిక్ పోలీసులు విధించే జరిమానా రూ.135 (సర్ఛార్జీలతో కలిపి). -
డీఈవోకు తాఖీదులు
[ 22-05-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, విద్యార్థులకు అందజేయాల్సిన ఏకరూప దుస్తుల పురోగతిపై నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న విద్యాశాఖాధికారులపై కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. -
గొంతుపై కాలుతో తొక్కి.. భార్య ప్రాణం తీసిన భర్త
[ 22-05-2024]
కట్టుకున్న భర్తే కాలయముడిగా మారాడు. భార్య గొంతుపై కాలుతో తొక్కి అత్యంత దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన ఉప్పల్ పోలీస్స్టేషన్ పరిధిలోని బ్యాంకుకాలనీలో జరిగింది. ఇన్స్పెక్టర్ ఎలక్షన్రెడ్డి కథనం ప్రకారం.. -
గాబరా పెడుతూ.. నాసివి అంటగడుతూ..
[ 22-05-2024]
తొలకరి ఇంకా ప్రారంభం కాలేదు. అప్పుడే కొందరు విత్తన వ్యాపారులు అన్నదాతలను పరుగులు పెట్టిస్తున్నారు. పత్తి విత్తనాల కోసం రైతుల అవసరాన్ని ఆసరా చేసుకుని కృత్రిమ కొరతకు తెర తీస్తున్నారు. -
కంకర దారిలో.. కష్టాల ప్రయాణం
[ 22-05-2024]
గ్రామీణ రహదారుల నిర్మాణానికి నిధులు మంజూరై సంవత్సరాలు దాటినా పనులు పూర్తి చేయించలేని దుస్థితి నెలకొంది. దెబ్బతిన్న తారు రహదారుల నిర్మాణానికి కంకర పరిచారు. ఏళ్లు గడిచినా.. -
ఆగని పారిశ్రామిక ప్రమాదాలు
[ 22-05-2024]
పరిశ్రమల ఏర్పాటులో నిర్వాహకులు ప్రభుత్వ నిబంధనలు సక్రమంగా పాటించడంలేదు. దీంతో వాటి పరిసర ప్రజలు ఇక్కట్ల పాలవుతున్నారు. మూడు రోజుల క్రితం తాండూరు మండలం గుంతబాస్పల్లి శివారులోని రసాయన పరిశ్రమలో అగ్ని ప్రమాదం సంభవించి స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. -
పూడూరులో ఎన్ఐఏ సోదాల కలకలం
[ 22-05-2024]
వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలో మంగళవారం జాతీయ పరిశోధన సంస్థ(ఎన్ఐఏ) సోదాలు జరిపి ఓ యువకుణ్ని అదుపులోకి తీసుకోవడం జిల్లాలో కలకలం రేపింది. -
సైబర్ మోసం..యువకుల అప్రమత్తం
[ 22-05-2024]
బషీరాబాద్ మండలం వాల్యానాయక్ తండాకు చెందిన సిద్దునాయక్, అదే తండాకు చెందిన మరో యువకుడు ఇటుకల వ్యాపారం చేస్తారు. మంతట్టి రైల్వే స్టేషన్ పనుల గుత్తేదారు కింద పనిచేసే సహాయకుడు ఇటీవల ట్రాక్టర్ ఇటుకలు కావాలని కోరగా రూ.23,500కు మాట్లాడుకున్నారు. -
ట్రిపుల్ఐటీ విద్యార్థులతో ఈడబ్ల్యూబీజీ ప్రొఫెసర్ భేటీ
[ 22-05-2024]
యూరోపియన్ వెల్నెస్ బయోమెడికల్ గ్రూప్(ఈడబ్ల్యూబీజీ) ప్రొఫెసర్ డా.మైక్చాన్ మంగళవారం గచ్చిబౌలిలోని ట్రిపుల్ఐటీ విద్యార్థులతో భేటీ అయ్యారు. స్టెమ్ సెల్ థెరపీ విధానంలో వచ్చిన మార్పులు, జరుగుతున్న పరిశోధనలపై వారితో చర్చించారు. -
నైజీరియా నుంచే ఫోన్
[ 22-05-2024]
రాష్ట్ర డీజీపీ రవిగుప్తా ఫొటోను వాట్సప్ డీపీగా పెట్టుకొని బెదిరింపులకు పాల్పడ్డ నిందితుడు నైజీరియాలో ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడయింది. ఇదే నంబర్తో ఇంకా ఎవరికైనా ఫోన్లు వెళ్లాయా అన్నదానిపైనా అధికారులు దృష్టి సారించారు. -
రవీంద్రభారతిలో 20కోట్ల ఏళ్ల నాటి వృక్ష శిలాజం
[ 22-05-2024]
సుమారు ఇరవై కోట్ల సంవత్సరాల నాటి అరుదైన వృక్ష శిలాజం రవీంద్రభారతి ప్రాంగణంలో కొలువుదీరాయి. రాష్ట్రానికి చెందిన పురాతత్వ పరిశోధకుడు సముద్రాల సునీల్ మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం సుంపుటం గ్రామ పరిధిలో దీనిని కనుగొన్నారు. -
నల్సార్లో సెంటర్ ఫర్ ఆర్బిట్రేషన్ లా ఏర్పాటుకు ఎంఓయూ
[ 22-05-2024]
నల్సార్ యూనివర్సిటీలో మిలన్ కె.బెనర్జీ ‘సెంటర్ ఫర్ ఆర్బిట్రేషన్ లా’ ఏర్పాటుకు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది గౌరవ్ బెనర్జీ వర్సిటీ వైస్ఛాన్సలర్ ప్రొఫెసర్ వి.కృష్ణదేవరావుతో దిల్లీలో ఇటీవల అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. -
మాజీ ఉద్యోగుల సొమ్ము స్వాహా
[ 22-05-2024]
అమెజాన్ డెవలప్మెంట్ సెంటర్లో పనిచేస్తూ ఆ సంస్థకు చెందిన రూ.3.2 కోట్లను స్వాహా చేసిన వ్యక్తిని సైబరాబాద్ ఈవోడబ్ల్యూ పోలీసులు అరెస్టు చేశారు. -
‘లక్ష్య’ అథ్లెట్లకు పుల్లెల గోపీచంద్ అభినందనలు
[ 22-05-2024]
ఈనాడు ‘లక్ష్య’ అథ్లెట్లను భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ అభినందించారు. మంగళవారం హనుమకొండ జిల్లా కేంద్రంలో జరిగిన బ్యాట్(బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ) రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ఆయన హాజరయ్యారు. -
ఉపాధ్యాయుల నియామకంలో నైపుణ్యం ముఖ్యం
[ 22-05-2024]
ప్రైవేటు పాఠశాలల్లో బోధనా సిబ్బంది నియామకంలో ప్రధానంగా చూడాల్సింది వారి అకడమిక్ అర్హతలు కాదని.. వివిధ అంశాల్లో వారికున్న నైపుణ్యాలను పరిగణనలోకి తీసుకోవాలని కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్స్ (సీఐఎస్సీఈ) -
ద్విచక్ర వాహనం నుంచి పడి గృహిణి మృతి
[ 22-05-2024]
స్పీడ్బ్రేకర్ వద్ద భర్త ద్విచక్రవాహనంపై నుంచి కిందపడిన మహిళ తీవ్రంగా గాయపడి మృతిచెందింది. సెక్రటేరియట్ పోలీసుస్టేషన్ ఎస్ఐ శ్రీనివాస్ కథనం ప్రకారం.. బేగంపేట్ రసూల్పురాలో నివాసం ఉంటున్న ఫాతిమా (30), ఫయాజ్లు భార్యాభర్తలు.