vontimitta: కన్నుల పండువగా ఒంటిమిట్ట కోదండరాముడి కల్యాణం
ఆంధ్రుల భద్రాద్రిగా ఖ్యాతిగాంచిన వైఎస్ఆర్ జిల్లాలోని ఒంటిమిట్ట కోదండరాముడి కల్యాణం కన్నుల పండువగా జరిగింది. పిండారబోసినట్లనిపించే వెన్నెల కాంతిలో..
ఒంటిమిట్ట: ఆంధ్రుల భద్రాద్రిగా ఖ్యాతిగాంచిన వైఎస్ఆర్ జిల్లాలోని ఒంటిమిట్ట కోదండరాముడి కల్యాణం కన్నుల పండువగా జరిగింది. పిండారబోసినట్లనిపించే వెన్నెల కాంతిలో తిరుమల నుంచి వచ్చిన వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ కల్యాణం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. తితిదే ఛైర్మన్ సుబ్బారెడ్డి దంపతులు స్వామివారికి కానుకలు సమర్పించారు. మూలమూర్తికి ఒక కిరీటం, ఉత్సవమూర్తులకు 3 కిరీటాలు అందజేశారు. ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సీతారాముల కల్యాణానికి పట్టువస్త్రాలు పంపించారు. విద్యుత్తు దీపాల వెలుగుల్లో రాములోరి సన్నిధి దేదీప్యమానంగా ప్రకాశించింది. కొత్తగా నిర్మించిన శాశ్వత కల్యాణ వేదికపై తొలిసారిగా స్వామివారి కల్యాణం జరిపించారు. వివిధ సుదూర ప్రాంతాల నుంచి విచ్చేసిన భక్తులతో ఒంటిమిట్ట జనసంద్రంగా మారింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
సీఎం జగన్కు బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుందని వైఎస్ సునీత అన్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్ - బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా గురువారం రాత్రి 7.30 గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. -
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
సీఎం జగన్ (YS Jagan)కు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్య (Viveka Murder Case)కు కారకులైన వారికి మళ్లీ ఎంపీగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారంటూ ఆమె నిలదీశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం