ఆఫీస్ ఛైర్ను ఆవిష్కరించిందెవరో తెలుసా?
ఒకప్పుడు ఏ కార్యాలయంలోనైనా ఉద్యోగులు కూర్చోవడానికి చెక్క కుర్చీలే ఉండేవి. ఇప్పుడు ఏ ఎక్కడ చూసినా చక్రాల కుర్చీలే(ఆఫీస్ వీల్ ఛైర్స్) దర్శనమిస్తాయి. వీటిలో కూర్చుంటే స్వల్ప దూరం వెళ్లడానికి మాటిమాటికి లేవాల్సిన అసవరం ఉండదు. ఈ కుర్చీలో కూర్చొని కాస్త
ఇంటర్నెట్ డెస్క్: ఒకప్పుడు ఏ కార్యాలయంలోనైనా ఉద్యోగులు కూర్చోవడానికి చెక్క కుర్చీలే ఉండేవి. ఇప్పుడు ఎక్కడ చూసినా చక్రాల కుర్చీలే(ఆఫీస్ వీల్ ఛైర్స్) దర్శనమిస్తాయి. వీటిలో కూర్చుంటే స్వల్ప దూరం వెళ్లడానికి మాటిమాటికి లేవాల్సిన అవసరం ఉండదు. ఈ కుర్చీలో కూర్చొని కాలితో నెడితే అదే మనల్ని కొంత దూరం తీసుకెళ్తుంది. పక్కనే ఉన్న మరో డెస్క్కు వెళ్లాలన్నా, చుట్టుపక్కల ఉండే వస్తువులను తీసుకోవాలన్న ఈ కుర్చీలతో సౌకర్యవంతంగా ఉంటుంది. వీటినే ‘ఆఫీస్ ఛైర్స్’ అంటుంటారు. ధరను బట్టి వీటిలో పలు డిజైన్లు అందుబాటులో ఉన్నాయి. మీరూ ఆఫీసుకెళ్లి ఇలాంటి వాటిలోనే కూర్చొని పనిచేస్తుంటారు కదా.. మరి ఎప్పుడైనా ఈ ఆఫీస్ ఛైర్లను ఎవరు కనిపెట్టారు అనే సందేహం వచ్చిందా? ఎవరో ఒక శాస్త్రవేత్త కనిపెట్టి ఉంటారులే అని అనుకోకండి. దీన్ని ఎవరు కనిపెట్టారో తెలిస్తే.. ఆశ్చర్యపోతారు.
ఛార్లెస్ డార్విన్.. ఈ పేరు ప్రపంచానికి సుపరిచితమే. భూమిపై జీవం ఎలా పుట్టింది అనే అంశంపై ఎన్నో సిద్ధాంతాలు, వాదనలు ఉన్నాయి. వాటిలో ప్రపంచం మెచ్చిన, నమ్ముతున్న జీవ పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది డార్వినే. జీవరాశి పుట్టుక గురించి 1859లో ఆయన ‘ది ఆరిజిన్ ఆఫ్ స్పీసెస్’ అనే పుస్తకం రచించారు. భూమిపై జీవరాశి ఉన్నపళంగా పుట్టలేదని, ఒక జీవ కణం నుంచి కాలక్రమంలో అనేక జీవరాశులు పుట్టుకొచ్చాయని పేర్కొన్నారు. కోతులే పరిణామ క్రమంలో మనుషులుగా మార్పు చెందాయని డార్విన్ సిద్ధాంతం చెబుతోంది. ఈ సిద్ధాంతాన్ని వ్యతిరేకించే వారు కూడా చాలా మంది ఉన్నారు. కానీ, దీన్ని అనేక మంది శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు అంగీకరించారు. అలా ఎన్నో పరిశోధనలు చేసి జీవరాశి పుట్టుకను కనిపెట్టిన ఛార్లెస్ డార్వినే.. ఈ ఆఫీస్ ఛైర్లను కనుగొన్నారు. నమ్మశక్యంగా లేదు కదా..! కానీ, నిజం ఆయనే దీన్ని ఆవిష్కరించారు.
1809 ఫిబ్రవరి 12న ఇంగ్లాండ్లో సంపన్న కుటుంబంలో జన్మించిన ఛార్లెస్ డార్విన్కు చిన్నతనం నుంచే జంతువులు, పక్షులపై ఆసక్తి ఉండేది. అలా ఉన్నత విద్యను అభ్యసించి జీవశాస్త్రంపై పరిశోధనలు చేయడం మొదలుపెట్టారు. 1840వదశాబ్దం ప్రారంభంలో ఛార్లెస్ డార్విన్ వివిధ జీవజాతులపై పరిశోధనలు చేశారు. ఈ క్రమంలో ప్రయోగశాలలో తను కూర్చున్న కుర్చీకి నలువైపులా పరికరాలు ఉండేవి. వాటిని తీసుకోవడానికి ప్రతిసారి కుర్చీలోంచి లేవాల్సి రావడం డార్విన్ను విసిగించింది. దీంతో తన కుర్చీ కింద చక్రాలు అమర్చారు. దీంతో కుర్చీలో కూర్చొనే చుట్టుపక్కల ఉన్న వస్తువుల్ని తీసుకోవడం సులువైంది.
అయితే, అదే సమయంలో వ్యాపారస్తులు తమ వ్యాపారాలను ఇంట్లో నిర్వహించడం నుంచి.. ప్రత్యేకంగా కార్యాలయాలు ఏర్పాటు చేసుకోవడం మొదలైంది. అప్పటి వరకు కుటుంబసభ్యులు, స్నేహితులతో నడిపించే కార్యకలాపాలకు.. ఉద్యోగులను నియమించాల్సి వచ్చింది. దీంతో ఉద్యోగుల కోసం డార్విన్ తయారు చేసినటువంటి చక్రాల కుర్చీలను తయారు చేయించేవారు. ఈ కుర్చీల గురించి తెలిసి జర్మనీకి చెందిన ప్రముఖ రాజకీయవేత్త బిస్మార్క్ పార్లమెంటులో ఇలాంటి కుర్చీలనే వేయించాడు. ఆ తర్వాత 1849లో అమెరికాకు చెందిన ట్రాయ్ అనే సంస్థ థామస్ ఇ. వారెన్ అనే శాస్త్రవేత్తతో ‘సెంట్రిపెటెల్ స్ప్రింగ్ ఆర్మ్ఛైర్ (ప్రస్తుత ఆఫీస్ ఛైర్లకు ప్రాథమిక రూపంగా చెప్పొచ్చు)ను తయారు చేయించింది. వాటిని 1851లో లండన్లో నిర్వహించిన భారీ ఎగ్జిబిషన్లో ప్రదర్శించారు. అలా కాలక్రమంలో ఈ ఆఫీస్ ఛైర్ అభివృద్ధి చెందుతూ ఇప్పుడు అనేక డిజైన్లలో అందుబాటులోకి వచ్చాయి. ఇదండీ చక్రాల కుర్చీ కథ.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్లో భారీ వర్షం.. పలు చోట్ల ట్రాఫిక్ జామ్
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలు చోట్ల ఈదురుగాలులు, మెరుపులతో కూడిన వర్షం పడింది. -
తెలంగాణలో రైతు భరోసా నిధుల విడుదలపై ఈసీ ఆంక్షలు
తెలంగాణలో రైతు భరోసా నిధుల విడదులపై కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. -
ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) జ్యుడీషియల్ కస్టడీని రౌజ్ అవెన్యూ న్యాయస్థానం పొడిగించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
నాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
మీరు పెద్ద రాజకీయ యుద్ధాన్ని ఎదుర్కోనున్నారు.. జనసేనకు మద్దతు ప్రకటించిన నాని
జనసేన పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు తెలుపుతూ నాని పోస్ట్ పెట్టారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
దావత్ కావాలా నాయనా!.. వ్యవసాయ క్షేత్రాల్లో కార్యకర్తల ఖుషీ
ఎన్నికల పండుగొచ్చింది.. దావత్ల మీద దావత్లు ఏర్పాటవుతున్నాయి. కార్యకర్తలను మచ్చిక చేసుకోవడానికి, ప్రచారంలో జోరు ఉండటానికి నాయకులు విందు కార్యక్రమాలను ఎంచుకుంటున్నారు. -
ఆదర్శ కేంద్రం.. ఓటుకు కదులుదాం
లోక్సభ ఎన్నికల్లో శతశాతం ఓటింగ్ లక్ష్యంగా ఎన్నికల సంఘం ప్రత్యక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఓటరు చైతన్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. దివ్యాంగులు, 85 ఏళ్లకు పైబడిన వారికి ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించే అవకాశం కల్పించారు. -
పోస్టల్ బ్యాలెట్ ఇంకా రెండు రోజులే!
ఆదిలాబాద్ లోక్సభ నియోజకవర్గంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు 16,972 మంది పోస్టల్ బ్యాలెట్ నమోదు చేసుకోగా.. ఇప్పటి వరకు 5,200 మంది మాత్రమే వినియోగించుకున్నారు. -
రూ.2 చెల్లించు.. ఛాలెంజ్ ఓటేయ్
ఛాలెంజ్ ఓటు.. దీని గురించి ఎన్నికల సమయంలో వింటుంటాం. ఎన్నికల నిర్వహణ నిబంధనలు 1961 చట్టంలోని సెక్షన్ 49ఏలో వివరాలు ఉంటాయి. పలు సందర్భాలలో ఒకరి ఓటును మరొకరు వేస్తారు. -
భాజపా అభ్యర్థితో కాదు ప్రధానితోనే పోటీ
మనకు పోటీ భాజపా అభ్యర్థితో కాదని, ప్రధాని నరేంద్ర మోదీతోనే పోటీ అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (07/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్.. టీమ్ఇండియా జెర్సీ ధరెంతో తెలుసా?
-
నేహాశెట్టి ‘ఎమోషన్స్’.. పుస్తకంతో మాళవిక మోహనన్
-
ఆస్ట్రేలియా హెలికాప్టర్పై నిప్పుల వర్షం.. చైనా దుందుడుకు చర్య
-
Team India: పాక్లో ఛాంపియన్స్ ట్రోఫీ.. టీమ్ఇండియా వెళ్తుందా? బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ ఏమన్నారంటే..
-
ఒకే ఫ్రేమ్లో ఇద్దరు సీఈఓలు.. సుందర్ పిచాయ్ గ్రాడ్యుయేషన్ ఫొటో వైరల్
-
చేతులూ కాళ్లూ కట్టేసి సిగరెట్లతో భర్తకు వాతలు.. వీడియోతో పోలీస్స్టేషన్కు బాధితుడు!