నన్ను జైలుకు పంపాలని కుట్ర పన్నుతున్నారు: దస్తగిరి

తప్పుడు కేసులతో తనను ఎలాగైనా జైలుకు పంపాలని కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌ కుట్ర పన్నుతున్నారని వైఎస్‌ వివేకా హత్య కేసులో కీలక సాక్షి, డ్రైవర్‌ దస్తగిరి ఆరోపించాడు. 

Published : 26 Jun 2023 21:52 IST

కడప: పులివెందులలో కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌ అనుచరులు తనను బెదిరిస్తున్నారని వైఎస్ వివేకా హత్య కేసులో కీలక సాక్షి, డ్రైవర్‌ దస్తగిరి ఆరోపించాడు. పిల్లాడిని హింసించాననే ఆరోపణలతో పులివెందుల పోలీసులు తనపై తప్పుడు కేసు నమోదు చేసినట్లు తెలిపాడు. సోమవారం తన భార్య షబానాతో కలిసి దస్తగిరి కడప ఎస్పీ కార్యాలయానికి వచ్చాడు. పులివెందుల పోలీసులు తనపై నమోదు చేసిన తప్పుడు కేసుపై కడప ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు. ఈ కేసు గురించి సీబీఐ ఎస్పీకి కూడా సమాచారం అందించినట్లు చెప్పాడు. వైఎస్‌ అవినాష్‌ తనను ఎలాగైనా జైలు పంపాలని కుట్ర పన్నుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని