India Corona: 16 వేలకు పైగా కొత్త కేసులు..39 మరణాలు

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి అదుపులోనే ఉంది. తాజాగా 2.73 లక్షల మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 16,464 మందికి వైరస్‌ సోకినట్లు సోమవారం కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

Published : 01 Aug 2022 09:51 IST

గణాంకాలు వెల్లడించిన కేంద్రం

దిల్లీ: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి అదుపులోనే ఉంది. తాజాగా 2.73 లక్షల మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 16,464 మందికి వైరస్‌ సోకినట్లు సోమవారం కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ముందురోజు కంటే మూడువేల మేర కేసులు తగ్గాయి. 24 గంటల వ్యవధిలో 16,112 మంది కోలుకున్నారు. 39 మంది మరణించారు. క్రియాశీల కేసులు 1,43,989(0.33శాతం)కి చేరాయి. ఇప్పటి వరకూ 4.40 కోట్ల మందికి కరోనా సోకగా.. 98.48 శాతం మంది వైరస్‌ నుంచి బయటపడ్డారు. 5.26 లక్షల మంది మృత్యుఒడికి చేరుకున్నారు. నిన్న 8.34 లక్షల మంది టీకా తీసుకోగా.. మొత్తంగా 204 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని