బడిబాట: దేశంలో 48శాతం విద్యార్థులు కాలినడకనే పాఠశాలలకు..!
మన దేశంలో పాఠశాలలకు వెళ్లే 48శాతం మంది విద్యార్థులకు కాలినడకనే అనుసరిస్తున్నట్లు తాజా సర్వే వెల్లడించింది.
నేషనల్ అచీవ్మెంట్ సర్వే(NAS)లో వెల్లడి
దిల్లీ: మన దేశంలో పాఠశాలలకు వెళ్లే 48శాతం మంది విద్యార్థులకు కాలినడకనే అనుసరిస్తున్నట్లు తాజా సర్వే వెల్లడించింది. కేవలం తొమ్మిది శాతం చిన్నారులు మాత్రమే పాఠశాల వాహనం వినియోగిస్తున్నట్లు తెలిపింది. అంతేకాకుండా 25శాతం పాఠశాలలకు చెందిన విద్యార్థుల చదువుల్లో వారి తల్లిదండ్రుల నుంచి మద్దతు ఉండడం లేదని తేలింది. కేంద్ర విద్యాశాఖ గతేడాది నిర్వహించిన నేషనల్ అచీవ్మెంట్ సర్వే (NAS)-2021లో ఈ విషయాలు వెల్లడయ్యాయి.
దేశవ్యాప్తంగా గతేడాది నవంబర్ 12న నిర్వహించిన ఈ సర్వేలో 720 జిల్లాల్లోని లక్షా 18వేల పాఠశాలల నుంచి వివరాలు సేకరించారు. ఈ సర్వేలో మూడు, ఐదు, ఎనిమిది, పదోతరగతికి చెందిన మొత్తం 34లక్షల మంది విద్యార్థులు పాల్గొన్నారు. వీరిలో 48శాతం మంది విద్యార్థులు కాలినడకనే పాఠశాలలకు చేరుకుంటున్నట్లు చెప్పగా.. మరో 18శాతం మంది సైకిళ్లను వాడుతున్నారు. ఆర్టీసీ వంటి ప్రజారవాణా, స్కూల్ వాహనాల్లో వెళ్లేవారు తొమ్మిది శాతం చొప్పున ఉన్నారు. మరో ఎనిమిది శాతం మంది ద్విచక్ర వాహనాల్లో పాఠశాలలకు వెళ్తుండగా మూడు శాతం మంది కార్లు/క్యాబ్లలో వెళ్తున్నట్లు చెప్పారు. ఇక చదువుల్లో తల్లిదండ్రులు తమ చిన్నారులకు బాసటగా ఏవిధంగా నిలవాలో 87శాతం పాఠశాలలు చెబుతున్నట్లు సర్వేలో వెల్లడైంది. అయితే, వారిలో 25శాతం మంది విద్యార్థులకు తల్లిదండ్రుల నుంచి మద్దతు కరవైందని తేలింది.
నేషనల్ అచీవ్మెంట్ సర్వేలో భాగంగా ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్తోపాటు ప్రైవేటు పాఠశాలను పరిగణనలోకి తీసుకున్నారు. ఇందులో భాగంగా మూడు, ఐదు తరగతులు చదివే విద్యార్థులను భాషా పరిజ్ఞానం, గణితం, ఈవీఎస్ వంటి సబ్జెక్టులపై పట్టును పరిశీలించారు. ఎమినిదో తరగతి విద్యార్థులకు భాషా పరిజ్ఞానంతోపాటు గణితం, సామాన్య, సాంఘిక శాస్త్రాలపై అవగాహన ఏమేరకు ఉందో అంచనా వేయగా.. పదో తరగతి విద్యార్థులకు భాషా పరిజ్ఞానం, గణితం, సామాన్య, సాంఘికశాస్త్రంతోపాటు ఇంగ్లీష్పై పట్టును విశ్లేషించారు. ఈ అచీవ్మెంట్ టెస్ట్తోపాటు విద్యార్థులు, ఉపాధ్యాయులు, పాఠశాలలపై ఎన్సీఈఆర్టీ రూపొందించిన ప్రశ్నలను 22 భాషల్లో అనువదించి అందించారు. జాతీయ స్థాయిలో సీబీఎస్ఈ నిర్వహించిన ఈ సర్వేను కేవలం ఒకేరోజులో పూర్తిచేయగా.. ఇందుకు ఎన్ఐసీ సాంకేతిక సహకారం అందించినట్లు కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
WhatsApp: యూజర్ల సందేశాలకు భద్రత కల్పించేందుకు సంభాషణలను ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ చేస్తున్నామని వాట్సప్ తెలిపింది. ఒకవేళ దాన్ని బ్రేక్ చేయాలని చెబితే తాము భారత్ను వీడాల్సి వస్తుందని స్పష్టం చేసింది. -
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
విజయ్ మాల్యా విదేశాల్లోని ఆస్తులపై భారత ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీంతోపాటు ఆ దేశాలకు అతడు వస్తే అప్పగించాలని కోరుతోంది. తాజాగా ఫ్రాన్స్ను ఈ మేరకు అభ్యర్థించింది. -
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!