ఆ అయిదు రాష్ట్రాల్లోనే 62 శాతం..!

దేశంలోని కేరళ, మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్‌, పశ్చిమ్‌ బెంగాల్‌,  చత్తీస్‌ఘడ్‌ రాష్ట్రాల్లో కలిపి 62 శాతం కరోనా క్రియాశీల కేసులు ఉన్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ, కుటుంబ సంక్షేమ శాఖ శనివారం తెలిపింది.  ప్రస్తుతం భారత్‌లో  2,50,183 క్రియాశీల కేసులు ఉన్నాయి. వీటిలో 62 శాతం కేసులు ఈ అయిదు రాష్ట్రాల్లోనే ఉన్నాయి. ప్రస్తుతం కేరళలో 65,054 యాక్టివ్‌ కేసులుండగా, 3 వేలకుపైగా మరణించారు...

Published : 03 Jan 2021 02:12 IST

దిల్లీ: దేశంలోని కేరళ, మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్‌, పశ్చిమ్‌ బెంగాల్‌,  ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో కలిపి 62 శాతం కరోనా క్రియాశీల కేసులు ఉన్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ, కుటుంబ సంక్షేమశాఖ శనివారం తెలిపింది. ప్రస్తుతం భారత్‌లో  2,50,183 క్రియాశీల కేసులున్నాయి. వీటిలో 62 శాతం కేసులు ఈ అయిదు రాష్ట్రాల్లోనే ఉన్నాయి. ప్రస్తుతం కేరళలో 65,054 యాక్టివ్‌ కేసులుండగా, 3 వేలకుపైగా మరణించారు. సుమారు 2 మిలియన్ల కరోనా కేసులు నమోదైన మహారాష్ట్రలో 52,084 క్రియాశీల కేసులున్నాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లో 13,831, పశ్చిమ బెంగాల్‌లో 11,616, ఛత్తీస్‌గఢ్‌లో 11,344 యాక్టివ్ కేసులు ఉన్నాయని  కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని