- TRENDING TOPICS
- Ind vs Zim
- Monkeypox
కరోనా మరణాల్లో మూడో స్థానానికి!
63వేల మరణాలతో మెక్సికోకు చేరువైన భారత్
24గంటల్లో 78వేల కేసులు, 948 మంది మృత్యువాత
దిల్లీ: భారత్లో కరోనా వైరస్ మహమ్మారి విలయతాండవం కొనసాగుతూనే ఉంది. నిత్యం 70వేలకు పైగా కేసులు, వెయ్యికి పైగా మరణాలు నమోదవుతున్నాయి. గడిచిన 24గంటల్లో మరో 948 కరోనా రోగులు మృతిచెందారు. ఆదివారంనాటికి దేశంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 63,498కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. దీంతో ప్రపంచంలోనే అత్యధిక మరణాలు సంభవిస్తున్న దేశాల జాబితాలో భారత్ మూడోస్థానానికి చేరింది. 63వేల కరోనా మరణాలతో ప్రపంచంలో మూడోస్థానంలో కొనసాగుతున్న మెక్సికోకు భారత్ చేరువయ్యింది. ఇక భారత్లో కరోనా కేసులు నిత్యం రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. వరుసగా నాలుగోరోజు 75వేలకు పైగా పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. నిన్న ఒక్కరోజే అత్యధికంగా మరో 78,761పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 35లక్షల 42వేలకు చేరింది. వీరిలో ఇప్పటికే 27లక్షల మంది కోలుకోగా మరో ఏడు లక్షల క్రియాశీల కేసులు ఉన్నాయి. నిన్న మరో 64వేల మంది బాధితులు వైరస్ నుంచి కోలుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 76శాతం దాటింది. మరణాల రేటు 1.8శాతంగా కొనసాగుతోంది.
ప్రపంచ వ్యాప్తంగా వైరస్ తీవ్రత కొనసాగుతూనే ఉంది. జాన్స్ హాప్కిక్స్ విశ్వవిద్యాలయ నివేదిక ప్రకారం, ప్రపంచంలో కరోనా తీవ్రత అధికంగా ఐదు దేశాల వివరాలు...
దేశం కేసుల సంఖ్య మరణాల సంఖ్య
అమెరికా 59,60,652 1,82,760
బ్రెజిల్ 38,46,153 1,20,262
భారత్ 35,42,733 63,498
మెక్సికో 5,91,712 63,819
బ్రిటన్ 3,34,916 41,585
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Social look: శ్రీముఖి కామెడీ టైమింగ్.. హాట్ స్టిల్స్తో హయాతీ.. సామ్రాట్కు పుత్రికోత్సాహం
-
Politics News
Uttam kumar reddy: ఇచ్చిన హామీలను ఎప్పుడు నెరవేరుస్తారో ప్రధాని చెప్పాలి: ఉత్తమ్కుమార్రెడ్డి
-
India News
Corona: దిల్లీలో ఆస్పత్రుల్లో చేరికలు 60% పెరిగాయ్..!
-
India News
వ్యవసాయ రుణాలపై వడ్డీ రాయితీ.. కేంద్ర కేబినెట్ నిర్ణయం
-
Politics News
Revanth Reddy: సీఎల్పీ బృందాన్ని ఎందుకు అడ్డుకున్నారు?.. పోలీసుల తీరుపై రేవంత్ ఆగ్రహం
-
India News
Vaccines: ప్రపంచంలో వినియోగించే అన్ని టీకాల్లో.. 60శాతం భారత్వే..!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- స్తంభనలోపాన్ని కట్టేయండి
- Hrithik Roshan: హృతిక్! ముందు నీ సినిమా సంగతి చూసుకో..
- Hyderabad News: అనుమానాస్పద స్థితిలో సాఫ్ట్వేర్ ఇంజినీరు మృతి
- Pak PM: ఆసియా టైగర్ అవుతామనుకున్నాం.. కానీ, ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాం
- TSRTC: హైదరాబాద్లో ఇకపై ఆ రెండు గంటలూ ఉచిత ప్రయాణం..
- Noida Twin Towers: అమాంతం నీరు కిందికి దుమికినట్లు.. భవనాలు కుప్పకూలుతాయి..!
- S Jaishankar: కుమారుడితో రెస్టారెంట్కు కేంద్రమంత్రి.. తర్వాత ఏం జరిగిందంటే..?
- Naga Chaitanya: ఆ నటి అంటే నాకెంతో ఇష్టం: నాగచైతన్య
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (17/08/2022)
- Meira Kumar: 100ఏళ్ల క్రితం మా నాన్న జగ్జీవన్రామ్నూ ఇలాగే కొట్టారు..