చరిత్ర సృష్టించి తిరిగొస్తున్న క్రూడ్రాగన్!
తొలిసారి ఓ ప్రైవేటు సంస్థ నిర్మించిన వ్యోమనౌకలో రోదసీలోకి వెళ్లిన అమెరికాకు చెందిన వ్యోమగాములు తిరుగుపయనమయ్యారు. శనివారం వారు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్) నుంచి క్రూడ్రాగన్ వ్యోమనౌకలో ప్రయాణం ప్రారంభించారు.........
వాషింగ్టన్: తొలిసారి ఓ ప్రైవేటు సంస్థ నిర్మించిన వ్యోమనౌకలో రోదసీలోకి వెళ్లిన అమెరికాకు చెందిన వ్యోమగాములు తిరుగుపయనమయ్యారు. శనివారం వారు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్) నుంచి క్రూడ్రాగన్ వ్యోమనౌకలో ప్రయాణం ప్రారంభించారు. అమెరికా కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం 7:35 గంటలకు వ్యోమనౌక ఐఎస్ఎస్ నుంచి విడిపోయి భూమి దిశగా తన ప్రయాణాన్ని ప్రారంభించింది.
వాతావరణం అనుకూలించకపోయినా..
మానవసహిత అంతరిక్ష యాత్రల్లో సరికొత్త అధ్యాయం లిఖిస్తూ ప్రైవేటు కంపెనీ స్పేస్ఎక్స్ నిర్మించిన క్రూడ్రాగన్ వ్యోమనౌకలో తొలిసారి వ్యోమగాములు బాబ్ బెంఖెన్, డగ్ హార్లీలు మే 30న రోదసీలోకి వెళ్లిన విషయం తెలిసిందే. దాదాపు రెండు నెలల పాటు ఐఎస్ఎస్లో గడిపిన అనంతరం వారు భూమి పైకి తిరుగుపయనమయ్యారు. 19 గంటల ప్రయాణం తర్వాత ఆదివారం వారు ఫ్లోరిడాలోని పెన్సకోలా తీరంలో ల్యాండ్ కానున్నారు. వారు భూమిపైకి చేరుకోవడానికి అనువుగా ఉండే మొత్తం ఐదు ప్రాంతాల్ని ఎంపిక చేశారు. ప్రస్తుతం ఫ్లోరిడాలో జోరు వర్షాలు కురుస్తున్నాయి. అయినా, వాతావరణం అనుకూలిస్తుందన్న అంచనాలతో క్రూడ్రాగన్ రాకకు అనుమతించారు. ఒకవేళ వాతావరణం సహకరించనట్లైతే.. ల్యాండింగ్ని వాయిదా వేస్తామని నాసా అధికారులు తెలిపారు. మూడు రోజులకు కావాల్సిన అన్ని వసతులు క్రూడ్రాగన్లో ఉన్నట్లు వెల్లడించారు.
వ్యోమగాములతో పాటు 150 కిలోల బరువు..
ఇద్దరు వ్యోమగాములతో పాటు 150 కిలోల బరువును కూడా క్రూడ్రాగన్ మోసుకొస్తోంది. దీంట్లో ఎక్కువగా.. బయోలాజికల్ శాంపిల్స్, పరిశోధనలకు సంబంధించిన కాగితాలు ఉన్నట్లు నాసా తెలిపింది. అలాగే 2011లో అప్పటి వ్యోమగాములు వదిలి వచ్చిన అమెరికా జాతీయ జెండాను తిరిగి భూమిపైకి తీసుకురానున్నారు. వాణిజ్య అంతరిక్ష యాత్ర లక్ష్యానికి గుర్తుగా ఆరోజు వారు ఆ పతాకాన్ని అక్కడ వదిలి వచ్చారు. నేడు ఆ లక్ష్యం నెరవేరిన సందర్భంగా తిరిగి దాన్ని భూమిపైకి తీసుకొస్తున్నారు. అలాగే 2019లో ప్రయోగాత్మకంగా పంపిన క్రూడ్రాగన్ డెమో-1 తీసుకెళ్లిన ‘ఎర్తీ’ అనే బొమ్మ కూడా తిరిగి రానుంది. తాజా యాత్రలో ‘జీరో-జీ ఇండికేటర్’గా ఉపయోగించిన డైనోసార్ బొమ్మను కూడా తీసుకొస్తున్నారు.
క్రూడ్రాగన్ రోదసీ ప్రయోగంలో భారత్కు చెందిన ఇంజినీర్ బలరామమూర్తి ప్రముఖ పాత్ర పోషించారు. చెన్నైకి చెందిన ఆయన.. 9 ఏళ్లుగా స్పేస్ఎక్స్ సంస్థలో పనిచేస్తున్నారు. మానవసహిత యాత్ర సామర్థ్యమున్న వాహకనౌక అభివృద్ధి, పనితీరు నిర్ధారణలో ఆయన భాగస్వామిగా ఉన్నారు. తాజా ప్రయోగంలో ఆయన చీఫ్ ఇంజినీర్గా వ్యవహరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
WhatsApp: యూజర్ల సందేశాలకు భద్రత కల్పించేందుకు సంభాషణలను ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ చేస్తున్నామని వాట్సప్ తెలిపింది. ఒకవేళ దాన్ని బ్రేక్ చేయాలని చెబితే తాము భారత్ను వీడాల్సి వస్తుందని స్పష్టం చేసింది. -
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
విజయ్ మాల్యా విదేశాల్లోని ఆస్తులపై భారత ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీంతోపాటు ఆ దేశాలకు అతడు వస్తే అప్పగించాలని కోరుతోంది. తాజాగా ఫ్రాన్స్ను ఈ మేరకు అభ్యర్థించింది. -
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!