‘మోడెర్నా’ టీకాకు ఎఫ్డీఏ ఆమోదం
జీవసాంకేతిక దిగ్గజ సంస్థ ‘మోడెర్నా’ తయారుచేసిన కరోనా టీకా అత్యవసర వినియోగానికి అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్డీఏ) ఆమోదం తెలిపింది.
వాషింగ్టన్: జీవసాంకేతిక దిగ్గజ సంస్థ ‘మోడెర్నా’ తయారుచేసిన కరోనా టీకా అత్యవసర వినియోగానికి అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్డీఏ) ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ప్రకటించారు.
ఇప్పటికే ఫైజర్ టీకా అత్యవసర వినియోగానికి అనుమతించిన ఎఫ్డీఐ తాజాగా మోడెర్నాకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరో వైపు ఫైజర్లాగే మోడెర్నా కూడా ఒకే విధమైన పనితీరును కనబరిచే అవకాశముందని వైద్య రంగ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. కేసుల సంఖ్యతో పాటు మరణాల సంఖ్య అంతకంతకూ పెరుగుతండటంపై ఆందోళన చెందుతున్న అమెరికా టీకా అత్యవసర వినియోగం ద్వారా మరణాలను తగ్గించ వచ్చని భావిస్తోంది. ఎఫ్డీఐ అనుమతి లభించిన నేపథ్యంలో సోమవారం నుంచే బాధితులకు టీకా అదించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.‘ఎంఆర్ఎన్ఏ-1273’ పేరున సిద్ధం చేసిన వ్యాక్సిన్ను విస్తృతంగా సరఫరా చేసేందుకు మోడెర్నా సంస్థ ఇప్పటికే సిద్ధంగా ఉంది.
94.1% ప్రభావవంతం..
తాము తయారుచేసిన టీకా సురక్షితమని, 94.1% సమర్థంగా పనిచేస్తున్నట్టు క్లినికల్ పరీక్షల్లో తేలిందని మోడెర్నా వెల్లడించింది. దీని కారణంగా ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదని పేర్కొంది. ఇప్పటికే ఆమోదం పొందిన ఫైజర్ టీకాను మైనస్ 70 డిగ్రీల సెల్సియస్ వద్ద నిల్వ చేయాల్సి ఉండగా... మోడెర్నా వ్యాక్సిన్ను సాధారణ ఫ్రిజ్లో కూడా నిల్వ చేయవచ్చు. ప్రస్తుతం అమెరికాలో కరోనా తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. ఇప్పటివరకూ సుమారు 3.18 లక్షల మంది మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఇంకా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దీంతో వీలైనంత త్వరగా సాధారణ ప్రజలకు టీకాను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం