కేరళలో జార్జి ఫ్లాయిడ్ తరహా ఘటన?
కేరళలో చోటుచేసుకున్న ‘జార్జి ఫ్లాయిడ్’ మాదిరి సంఘటనపై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమౌతోంది.
భగ్గుమంటున్న సోషల్ మీడియా
కోచి: కేరళలో చోటుచేసుకున్న ‘జార్జి ఫ్లాయిడ్’ మాదిరి సంఘటనపై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కేరళ పోలీసు అధికారి ఒకరు, ఓ వ్యక్తిని నేలకేసి అదిమిపెట్టి అతనిపై కూర్చున్న చిత్రం ఇంటర్నెట్లో చర్చనీయాంశమైంది. కేరళ ఉన్నత విద్యాశాఖ మంత్రి కే.టీ. జలీల్ కాన్వాయ్ వెళుతుండగా ఈ సంఘటన చోటుచేసుకున్నట్టు తెలిసింది.
ఇటీవల సంచలనం సృష్టించిన బంగారం స్మగ్లింగ్ కేసులో ఈడీ అధికారులు మంత్రి జలీల్ను ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ఆయన రాజీనామా చేయాలంటూ ఆంటోనీ అనే కార్యకర్తతో సహా పలువురు కేరళ యువజన కాంగ్రెస్ సభ్యులు ఆదివారం సాయంత్రం నిరసన ప్రదర్శన చేపట్టారు. మంత్రి కాన్వాయ్ సమీపిస్తుండటంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు వెంటపడ్డారు. వారినుంచి తప్పించుకునేందుకు పరిగెడుతూ కింద పడిపోయిన ఆంటోనీ లేచేందుకు ప్రయత్నించారు. ఈ లోగా అక్కడకు చేరుకున్న ఓ పోలీసు అధికారి అటుగా వస్తున్న జలీల్ కాన్వాయ్ వెళ్లిపోయేవరకు అతనిని బలప్రయోగంతో నేలకు అదిమిపెట్టి ఉంచారు. ఇది గమనించిన ఆంటోనీ సహచరులు సంఘటనా స్థలానికి పరిగెత్తి వచ్చి అతనిని రక్షించారు.
కాగా ఈ సంఘటనకు సంబంధించిన చిత్రాన్ని కేరళ కాంగ్రెస్ నేత వీటీ బలరామ్ ‘‘ప్రజలు ఇంకా పినరయి ప్రభుత్వం..’’ అనే వ్యాఖ్యను జతచేస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. ఈ సంఘటనకు సంబంధించిన చిత్రాలు అమెరికాలో పోలీసుల దౌర్జన్యం వల్ల మరణించిన జార్జి ఫ్లాయిడ్ లాగా ఉండటంతో నెటిజన్లు తాజా ఘటనను ఆ ఉదంతంతో పోలుస్తూ తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
-
చిరంజీవిని విమర్శిస్తే ఖబడ్దార్.. వైకాపాకు సీఎం రమేశ్ హెచ్చరిక
-
రారండోయ్.. ఓటేయడానికి ఆంధ్రాకు
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక
-
ఓ అన్న మాట్లాడాల్సిన మాటలేనా?.. షర్మిల చీరపై జగన్ అభ్యంతరకర వ్యాఖ్యలు
-
కూకట్పల్లిలో హత్యాచారం కేసు.. 45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ