3కోట్ల మాస్కులు, 22,533 వెంటిలేటర్లు ఇచ్చాం!
దేశంలో శరవేగంగా విజృంభిస్తున్న కరోనా మహమ్మారిని సమర్థంగా ఎదుర్కోవడమే లక్ష్యంగా కేంద్రం అనేక చర్యలు చేపడుతోంది......
రాష్ట్రాలకు సాయంపై కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటన
దిల్లీ: దేశంలో శరవేగంగా విజృంభిస్తున్న కరోనా మహమ్మారిని సమర్థంగా కట్టడి చేయడమే లక్ష్యంగా కేంద్రం అనేక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వాలతో ఎప్పటికప్పుడు సమన్వయం చేయడంతో పాటు అవసరమైన వైద్య పరికరాలనూ సమకూరుస్తోంది. కరోనాతో నెలకొన్న విపత్కర పరిస్థితుల్లో మార్చి 11 నుంచి ఇప్పటివరకు రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు పంపిణీ చేసిన వైద్య పరికరాలకు సంబంధించిన వివరాలను కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. 3.04 కోట్ల ఎన్ 95 మాస్కులు, 1.28 కోట్లకు పైగా పీపీఈ కిట్లు, 10.83 కోట్ల హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలను ఉచితంగా ఇచ్చినట్టు తెలిపింది. అలాగే, భారత్లో తయారైన 22,533 వెంటిలేటర్లను సైతం పలు రాష్ట్రాలకు పంపినట్టు ప్రకటనలో పేర్కొంది. కరోనా చికిత్సకు అవసరమైన సదుపాయాలు పెంచేందుకు రాష్ట్రాలకు కేంద్రం తనవంతు సహకారం అందిస్తున్నట్టు ప్రకటనలో పేర్కొంది. కేంద్ర ఆరోగ్యశాఖ, టెక్స్టైల్, ఫార్మాస్యూటికల్ మంత్రిత్వశాఖలతో పాటు డీఆర్డీవో వంటి దేశీయ సంస్థల కృషితో ఈ కష్టకాలంలో దేశీయంగానే పీపీఈ కిట్లు, ఎన్ 95మాస్కులు, వెంటిలేటర్లు తయారు చేసుకొని సులభంగా పంపిణీ చేయగలిగినట్టు తెలిపింది. తద్వారా ఆత్మనిర్భర్ భారత్, మేకిన్ ఇండియా బలోపేతమైందని పేర్కొంది.
దేశంలో కరోనా వ్యాప్తి ఉద్ధృతమవుతోంది. నిన్న ఒక్కరోజే దాదాపు 67వేల కేసులు నమోదయ్యాయి. అలాగే, రికార్డు స్థాయిలో 56,383మంది కోలుకున్నారు. దేశంలో మొత్తం కొవిడ్ బాధితుల సంఖ్య 23,96,637కి పెరిగింది. వీరిలో ఇప్పటివరకు 16,95,982మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. 47వేలమందికి పైగా మృతిచెందారు. దేశంలో ప్రస్తుతం 6,53,622 యాక్టివ్ కేసులు ఉన్న విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి