సరిహద్దు వద్ద ఇప్పటికీ ఉద్రిక్తంగానే: రావత్
తీవ్రస్థాయి ఘర్షణలకు దారితీసే సరిహ్దదు వివాదాలు, రెచ్చగొట్టే చర్యల పట్ల ఉదాసీనంగా ఉండలేమని త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ స్పష్టం చేశారు.
దిల్లీ: తీవ్రస్థాయి ఘర్షణలకు దారితీసే సరిహ్దదు వివాదాలు, రెచ్చగొట్టే చర్యల పట్ల ఉదాసీనంగా ఉండలమేని త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ స్పష్టం చేశారు. శుక్రవారం నేషనల్ డిఫెన్స్ కాలేజ్ నిర్వహించిన వెబినార్లో ఆయన మాట్లాడుతూ..ఇప్పటికీ చైనాతో సరిహద్దు వెంబడి పరిస్థితి ఉద్రిక్తంగానే ఉన్నట్లు అంగీకరించారు. గత కొద్ది నెలలుగా భారత్, చైనా సరిహద్దులో నెలకొన్న ప్రతిష్టంభన ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.
ఈ క్రమంలో బిపిన్ రావత్ మాట్లాడుతూ..భారత దళాల నుంచి గట్టి స్పందన రావడంతో చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఊహించని పరిణామాలను ఎదుర్కొందన్నారు. సరిహద్దు వద్ద సైన్యం దృఢంగా నిలబడి ఉందని, వాస్తవాధీన రేఖలో ఎటువంటి మార్పును తాము అంగీకరించబోమని స్పష్టం చేశారు. ‘భారత్ ప్రాముఖ్యత పెరుగుతున్నప్పుడు దానికి తగ్గట్టే భద్రతా సవాళ్లు కూడా పెరుగుతాయి. మన సైనిక అవసరాల కోసం ఇతర దేశాలపై ఆధారపడటం నుంచి బయటపడాలి. ప్రస్తుతం, భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనే లక్ష్యంతో..దీర్ఘకాలిక స్వదేశీ సామర్థ్యాన్ని పెంపొందించుకునేందుకు పెట్టుబడి పెట్టాలి’ అని అన్నారు. అలాగే దాయాది దేశం పాకిస్థాన్ గురించి మాట్లాడుతూ.. పాక్ ప్రేరేపిత ఉగ్రవాద కార్యకలాపాల కారణంగా ఆ దేశంతో సంబంధాలు మునుపటి కంటే దిగజారాయన్నారు. ఇదిలా ఉండగా, మే నెలలో సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులకు ముగింపు పలికే లక్ష్యంతో ఇప్పటికే భారత్, చైనా మధ్య ఏడు రౌండ్ల చర్చలు జరిగాయి. ఈ రోజు మరోమారు ఇరు దేశాలకు చెందిన అధికారుల మధ్య చర్చలు జరుగుతున్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకునే రావత్ భారత్ వైఖరి వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.