మరో కేంద్రమంత్రికి కరోనా పాజిటివ్‌

దేశంలో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు కేంద్రమంత్రులు, రాజకీయ నేతలు కొవిడ్‌ బారిన పడగా.. తాజాగా కేంద్రమంత్రి డీవీ సదానంద గౌడకు పాజిటివ్‌గా........

Published : 19 Nov 2020 20:13 IST

దిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు కేంద్రమంత్రులు, రాజకీయ నేతలు కొవిడ్‌ బారిన పడగా.. తాజాగా కేంద్రమంత్రి డీవీ సదానంద గౌడకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విటర్‌లో వెల్లడించారు. కరోనా స్వల్ప లక్షణాలు ఉండటంతో పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా నిర్థరణ అయినట్టు ఆయన తెలిపారు. స్వీయ నిర్బంధంలోకి వెళ్లినట్టు చెప్పారు. ఇటీవలి కాలంలో తనను కలిసినవారంతా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఎయిమ్స్‌లో చేరిన ఆంటోనీ దంపతులు
అలాగే, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీమంత్రి ఏకే ఆంటోనీ, ఆయన సతీమణి కూడా కరోనా బారిన పడ్డారు.ఈ విషయాన్ని ఏకే ఆంటోనీ తనయుడు అనిల్‌ కె ఆంటోనీ వెల్లడించారు. ప్రస్తుతం వాళ్లిద్దరూ దిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్సపొందుతున్నట్టు చెప్పారు. ఇద్దరి ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని