Arvind Kejriwal: భగత్ సింగ్, అంబేడ్కర్ కలలను నెరవేరుస్తున్నా: కేజ్రీవాల్‌

ఉగ్రవాది అంటూ కాంగ్రెస్, భాజపా తనపై చేస్తున్న వ్యాఖ్యలను దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తిప్పికొట్టారు.

Published : 20 Feb 2022 12:33 IST

దిల్లీ: ఉగ్రవాది అంటూ కాంగ్రెస్, భాజపా తనపై చేస్తోన్న వ్యాఖ్యలను దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తిప్పికొట్టారు. అవినీతిపరులైన కొందరు నేతలు.. తనపై ఉగ్రవాదముద్ర వేస్తున్నారని చురకలంటించారు. దిల్లీలోని ప్రభుత్వ పాఠశాలల్లో స్మార్ట్ క్లాస్ రూముల ప్రారంభోత్సవానికి హాజరైన కేజ్రీవాల్.. భాజపా, కాంగ్రెస్‌లపై మండిపడ్డారు. ప్రధాన పార్టీల నేతలు ఆరోపిస్తున్న ఉగ్రవాదే.. 12,430 స్మార్ట్ క్లాస్‌రూమ్‌లను దేశానికి అంకితమిచ్చినట్లు తెలిపారు. భగత్ సింగ్, బాబా సాహెబ్ అంబేడ్కర్ కలలను తాను నెరవేరుస్తున్నట్లు కేజ్రీవాల్ పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని