Apurva Chandra: వార్తాసంస్థలకు ఆదాయాన్ని పంచాలి.. బిగ్ టెక్ అగ్రిగేటర్లకు సూచన!
డిజిటల్ వార్తాసంస్థల కంటెంట్తో ఆదాయాన్ని ఆర్జించే బిగ్ టెక్ అగ్రిగేటర్లు.. అందులో సరైనా వాటాను సంబంధిత ప్రచురణకర్తలతో పంచుకోవాలని సమాచార ప్రసారశాఖ కార్యదర్శి అపూర్వచంద్ర ఆకాంక్షించారు. ‘డిజిటల్ న్యూస్ పబ్లిషర్స్ అసోసియేషన్’ కాంక్లేవ్ ప్రారంభ సెషన్ను ఉద్దేశించి ఈ మేరకు తన సందేశం పంపించారు.
దిల్లీ: డిజిటల్ వార్తాసంస్థల కంటెంట్(Digital News)ను ఉపయోగించి ఆదాయాన్ని ఆర్జించే బిగ్ టెక్ అగ్రిగేటర్లు.. అందులో న్యాయమైన భాగాన్ని సంబంధిత ప్రచురణకర్తలతో పంచుకోవాలని సమాచార ప్రసారశాఖ కార్యదర్శి అపూర్వచంద్ర(Apurva Chandra) సూచించారు. 17 మీడియా సంస్థల ‘డిజిటల్ న్యూస్ పబ్లిషర్స్ అసోసియేషన్(DNPA)’ కాంక్లేవ్ ప్రారంభ సెషన్ను ఉద్దేశించి ఆయన ఈ మేరకు తన సందేశం పంపించారు. ఆస్ట్రేలియా, కెనడా, ఫ్రాన్స్, యూరోపియన్ యూనియన్లు ఇప్పటికే తమ చట్టసభల ద్వారా ఈ విధమైన చర్యలు తీసుకున్నాయని గుర్తుచేశారు. వార్తల ద్వారా వచ్చే ఆదాయం.. వార్తాప్రచురణకర్తలు, అగ్రిగేటర్ల(Aggregators) మధ్య న్యాయంగా విభజన జరిగేలా అవి చొరవ చూపాయన్నారు.
‘కొవిడ్ తర్వాత.. డిజిటల్ వార్తా పరిశ్రమే కాకుండా, ప్రింట్ న్యూస్ వ్యవస్థ సైతం ఆర్థికంగా దెబ్బతింది. ఈ పరిశ్రమపై ప్రతికూల ప్రభావం కొనసాగితే.. ప్రజాస్వామ్యానికి నాల్గో స్తంభమైన ‘జర్నలిజం’ భవిష్యత్తు కూడా దెబ్బతింటుంది. దేశానికి సేవ చేసిన చరిత్ర ఈ పరిశ్రమకు ఉంది. ఈ నేపథ్యంలో వార్తాపరిశ్రమ వృద్ధికిగానూ.. డిజిటల్ న్యూస్ పబ్లిషర్ల కంటెంట్ ద్వారా బిగ్ టెక్ అగ్రిగేటర్లకు వచ్చే రాబడిలో.. సంబంధిత వార్తాసంస్థలు న్యాయమైన వాటా పొందడం చాలా ముఖ్యం’ అని అపూర్వ చంద్ర పేర్కొన్నారు. సరైన, వాస్తవమైన వార్తలు బయటకు వచ్చేలా నిర్ధరించుకునేందుకుగానూ స్థానిక వార్తాసంస్థలు సరైన వ్యవస్థలను కలిగి ఉన్నట్లు భావిస్తున్నానన్నారు. కేంద్ర ప్రభుత్వ ‘స్వీయ నియంత్రణ’ విధానానికి ఇవి మంచి ఉదాహరణలని తెలిపారు.
ఆస్ట్రేలియా ఎంపీ పాల్ ఫ్లెచర్ మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం ఆదాయ విభజనపై రూపొందించిన ముసాయిదాపై తొలుత గూగుల్, ఫేస్బుక్ల నుంచి తీవ్ర ప్రతిఘటన వచ్చినట్లు తెలిపారు. ‘ఆస్ట్రేలియాలో తమ సెర్చ్ సేవలను నిలిపేస్తామని గూగుల్ ఒక సమయంలో ప్రకటించింది. అనంతరం గూగుల్ వెనక్కు తగ్గింది. ఫేస్బుక్ సైతం.. పోలీసు, అంబులెన్స్, రెడ్క్రాస్ వంటి కీలకమైన సేవల పేజీలను మూసివేసింది. కానీ, బలమైన రాజకీయ నాయకత్వంతో మేం వాటిని దీటుగా ఎదుర్కొన్నాం. చివరకు ఆ రెండు సంస్థలు దిగొచ్చాయి’ అని ఆయన వివరించారు. ఆస్ట్రేలియాలో బిగ్ టెక్ ప్లాట్ఫాంలు, వార్తా ప్రచురణకర్తల మధ్య ఆదాయ భాగస్వామ్యంలో సంస్కరణలపై చట్టాన్ని తీసుకురావడం వెనుక పాల్ ఫ్లెచర్ది కీలక పాత్ర.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి
-
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
-
చిరంజీవిని విమర్శిస్తే ఖబడ్దార్.. వైకాపాకు సీఎం రమేశ్ హెచ్చరిక
-
రారండోయ్.. ఓటేయడానికి ఆంధ్రాకు
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక