జాతీయ జెండాను అవమానిస్తే దేశం సహించదు
జాతీయ పతాకాన్ని అవమానించే చర్యల్ని దేశం ఎప్పటికీ ఉపేక్షించదని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. గణతంత్ర దినోత్సవం రోజున రైతుల ర్యాలీ హింసాత్మకంగా మారడాన్ని కేంద్రం తీవ్రంగా ఖండించింది. దేశ రాజధానిలో చోటుచేసుకున్న
దిల్లీ: జాతీయ పతాకాన్ని అవమానించే చర్యల్ని దేశం ఎప్పటికీ ఉపేక్షించదని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. గణతంత్ర దినోత్సవం రోజున రైతుల ర్యాలీ హింసాత్మకంగా మారడాన్ని కేంద్రం తీవ్రంగా ఖండించింది. దేశ రాజధానిలో చోటుచేసుకున్న ఆ హింసాత్మక చర్యలకు బాధ్యులైన వారిని ఊరికే వదిలిపెట్టబోమని హెచ్చరించింది. ఈ మేరకు కేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్ బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘హింస జరగడానికి ఇతరుల్ని ప్రేరేపించిన ప్రతి ఒక్కరిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఎర్రకోట వద్ద జాతీయ పతాకాన్ని అవమానించేలా చేసిన ఏ చర్యల్ని భారత్ ఉపేక్షించదు’ అని జావడేకర్ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా జావడేకర్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ హింసాత్మక ఘటనల వెనక కాంగ్రెస్ పార్టీ కుట్ర ఉందని జావడేకర్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ దిల్లీలో జరుగుతున్న రైతుల ఆందోళనలను ఎల్లప్పుడూ రెచ్చగొట్టడానికే పనిచేసిందని ఆరోపించారు. ఈ ర్యాలీ ఘటనపై అభినందిస్తూ కొందరు కాంగ్రెస్ నాయకులు చేసిన ట్వీట్లను జావడేకర్ ఈ సందర్భంగా ప్రస్తావించారు.
దేశంలో ప్రధాని నరేంద్ర మోదీకి జనాధరణ పెరగడం తట్టుకోలేని ప్రతిపక్షాలు దేశం ప్రశాంతంగా లేకుండా.. హింస జరగాలని కాంక్షిస్తున్నాయని విమర్శించారు. కుటుంబ రాజకీయాల కోసం కొన్ని పార్టీలు చేస్తున్న పనులు ఆందోళన కలగజేస్తున్నాయని తెలిపారు. కేంద్రం, రైతు సంఘాల మధ్య చర్చలు పరిష్కారం కాకూడదనే కాంగ్రెస్ కోరుకుంటోందని విమర్శించారు. ఆందోళనకారులు కత్తులు, రాళ్లతో దాడులకు పాల్పడినప్పటికీ.. ఎంతో సంయమనంతో విధి నిర్వర్తించిన దిల్లీ పోలీసులను ఆయన ప్రశంసించారు.
కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గణతంత్ర దినోత్సవం రోజున రైతులు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీ ఉద్రిక్తంగా మారిన విషయం తెలిసిందే. రైతులు ఎర్రకోటపై రైతు జెండాలను ఎగురవేశారు. ఈ ఘటనలో 300 మంది పోలీసులకు గాయాలైనట్లు దిల్లీ పోలీసు శాఖ వెల్లడించింది. ఘటనకు బాధ్యులుగా అనుమానిస్తున్న 200 మందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు 22 ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్లు తెలిపారు.
ఇదీ చదవండి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మీసం, గడ్డం పెంచారని 80 మంది కార్మికులపై వేటు
హిమాచల్ప్రదేశ్లోని సోలన్ జిల్లాలో ఓ కంపెనీ యాజమాన్యం విచిత్ర కారణంతో కార్మికులను ఉద్యోగం నుంచి తీసేసింది. -
2జీ స్పెక్ట్రమ్పై కేంద్రం అభ్యర్థనకు సుప్రీంకోర్టు రిజిస్ట్రీ తిరస్కరణ
స్పెక్ట్రమ్ వంటి అరుదైన దేశ సహజ వనరుల కేటాయింపులు, బదిలీలకు పారదర్శకమైన వేలం విధానాన్ని మాత్రమే అనుసరించాలన్న 2012నాటి సుప్రీంకోర్టు తీర్పులో మార్పులు కోరుతున్న కేంద్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. -
వాహనదారులు చల్లగా ఉండాలని.. ట్రాఫిక్ సిగ్నళ్ల దగ్గర గ్రీన్ నెట్స్
రోజురోజుకూ ఎండలు మండిపోతున్నాయి. అత్యధిక ఉష్ణోగ్రతలతో పలు రాష్ట్రాలు నిప్పుల కొలిమిలా మారుతున్నాయి. -
మా ఎన్నికల ప్రక్రియలో జోక్యమే
మత స్వేచ్ఛ విషయంలో భారత్ ఉల్లంఘనలకు పాల్పడుతోందని అమెరికా సంస్థ పేర్కొనడాన్ని మన దేశం తీవ్రంగా తప్పుబట్టింది. -
ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు లుక్ఔట్ నోటీసులు
అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటకలోని హాసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు ప్రత్యేక దర్యాప్తు దళం(సిట్) అధికారులు గురువారం లుక్ఔట్ నోటీసులు జారీ చేశారు. -
సీబీఐ.. కేంద్రం నియంత్రణలో ఉండదు
కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ.. తమ నియంత్రణలో ఉండదని గురువారం సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. ఆ సంస్థ చేసే దర్యాప్తును కూడా తాము పర్యవేక్షించబోమని పేర్కొంది. -
శ్రీకృష్ణ జన్మభూమి ఆలయం రక్షిత కట్టడం
మథురలోని శ్రీకృష్ణ జన్మభూమి ఆలయం-షాహి ఈద్గా మసీదు వివాదంలో గురువారం అలహాబాద్ హైకోర్టులో విచారణ కొనసాగింది. -
కొత్త నేర న్యాయ చట్టాలపై శిక్షణకు సహకరించండి
జులై 1 నుంచి అమల్లోకి వస్తున్న మూడు నూతన నేర న్యాయ చట్టాల(భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియమ్)ను సమర్థంగా అమలు చేసేందుకు పోలీసులకు శిక్షణ ఇచ్చేందుకు కేంద్ర హోం మంత్రిత్వశాఖ రాష్ట్రాల సహాయం కోరింది. -
కొత్తరకం జీవికి చంద్రయాన్ పేరు
భారత్కు అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిపెట్టిన చంద్రమండల అన్వేషణ వ్యోమనౌక ‘చంద్రయాన్’కు అరుదైన గౌరవం దక్కింది. -
దిల్లీ మహిళా కమిషన్లో 52 మంది ఒప్పంద ఉద్యోగుల తొలగింపు
దిల్లీ మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ)లో అక్రమంగా నియమితులైన 52 మంది ఒప్పంద ఉద్యోగులను స్త్రీ, శిశు అభివృద్ధి (డబ్ల్యూసీడీ) శాఖ తొలగించారు. -
డిప్లొమాటిక్ పాస్పోర్ట్తో జర్మనీకి ప్రజ్వల్.. విదేశాంగ శాఖ వెల్లడి
లైంగిక దౌర్జన్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్వల్ రేవణ్ణ డిప్లొమాటిక్ పాస్పోర్టుతో దేశం విడిచి వెళ్లినట్లు కేంద్రం విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
భారత్ అంటే బైడెన్కు అమితమైన గౌరవం: శ్వేతసౌధం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
ఎండలిలా.. ప్రచారమెలా..!: ప్రజలను కలిసేందుకు నేతల రకరకాల యత్నాలు
-
బకాయిలు కట్టకపోతే కరెంట్ కట్!.. ఉద్యోగులకు ప్రభుత్వం హెచ్చరిక
-
రివ్యూ: శబరి.. వరలక్ష్మీ శరతకుమార్ నటించిన థ్రిల్లర్ ఎలా ఉంది?
-
ఐదేళ్లలో ఉద్యోగులపై 1500కుపైగా కేసులు