Corona: నిందిస్తూ కూర్చొంటే కరోనాను తరిమికొట్టలేం: కేజ్రీవాల్ కౌంటర్
దేశ రాజధాని ప్రాంతంలో కరోనా కేసులు పెరుగదలపై హరియాణా ఆరోగ్యశాఖ మంత్రి అనిల్ విజ్ చేసిన వ్యాఖ్యలను దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ .......
దిల్లీ: దేశ రాజధాని ప్రాంతంలో కరోనా కేసులు పెరుగుదలపై హరియాణా ఆరోగ్యశాఖ మంత్రి అనిల్ విజ్ చేసిన వ్యాఖ్యలను దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ గట్టిగా తిప్పికొట్టారు. పరస్పరం నిందారోపణలు చేస్తూ కూర్చొంటే కరోనా మహమ్మారిని నిర్మూలించలేమన్నారు. ఈ రక్కసిని దేశం నుంచి పూర్తిగా తరిమికొట్టాల్సి ఉందన్నారు. దిల్లీలో కొవిడ్ కేసులు ఉద్ధృతి ప్రభావం జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్)లో చూపిస్తోందనీ.. అందుకే గురుగ్రామ్, ఫరీదాబాద్, సోనిపట్ జిల్లాల్లో ఇన్ఫెక్షన్ రేటు పెరుగుతున్నట్టు అనిల్ విజ్ ఆరోపించారు. అయితే, సోమవారం దిల్లీలో తొలి ఎలక్ట్రిక్ బస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడారు. అనిల్ విజ్ చేసిన ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు. తాను నిందలు మోపబోననీ.. అలా నిందించుకోవడం వల్ల కరోనా మహమ్మారి నివారణ సాధ్యం కాదని చెప్పారు. దేశంలో కరోనా ఎక్కడ ఉన్నా నిర్మూలించాల్సిందేనన్నారు. దిల్లీలో కొవిడ్ కేసుల సంఖ్య తగ్గుతోందన్న ముఖ్యమంత్రి.. ఈరోజు 12 నుంచి 13వేల మధ్య కొత్త కేసులు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. ఆదివారం దిల్లీలో 18వేలకు పైగా కేసులు నమోదైన విషయం తెలిసిందే.
మరోవైపు, దిల్లీ రవాణా సంస్థ (డీటీసీ) తొలి ఎలక్ట్రిక్ బస్సును కేజ్రీవాల్ ప్రారంభించారు. ఏప్రిల్ నాటికి దిల్లీలో 300 ఎలక్ట్రిక్ బస్సులు వస్తాయన్నారు. మరికొన్ని సంవత్సరాల్లో దిల్లీ ప్రజా రవాణాలో దాదాపు 2వేల బస్సులు వచ్చి చేరతాయని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం