Booster dose: అలా అయితేనే బూస్టర్ డోసు.. ఎయిమ్స్ చీఫ్ కీలక వ్యాఖ్యలు
మూడో డోసు వినియోగంపై దిల్లీ ఎయిమ్స్ చీఫ్ రణ్దీప్ గులేరియా తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. మొదటి రెండు డోసులు ఎన్ని రోజులు సమర్థంగా......
దిల్లీ: దేశ ప్రజలకు బూస్టర్ డోసులు ఇవ్వడంపై చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. టీకా రెండు డోసులు తీసుకున్నప్పటికీ మూడో మోతాదు అవసరమని అంతర్జాతీయ నిపుణులు చెబుతుండగా.. బలహీన రోగనిరోధక వ్యవస్థ ఉన్నవారికి బూస్టర్ డోసు అవసరమేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణుల కమిటీ వెల్లడించింది. కాగా మూడో డోసు వినియోగంపై దిల్లీ ఎయిమ్స్ చీఫ్ రణ్దీప్ గులేరియా తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. మొదటి రెండు డోసులు ఎన్ని రోజులు సమర్థంగా పనిచేస్తాయనే అంశంపైనే బూస్టర్ షాట్ వినియోగం ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు.
మీడియాతో రణ్దీప్ గులేరియా మాట్లాడుతూ.. ‘బూస్టర్ డోసు వినియోగంపై ఇంకా ఎలాంటి నిర్ణయానికి రాలేదు. యాంటీబాడీల ఆధారంగా బూస్టర్ షాట్ను ఇవ్వలేం. అది సమయం మీద ఆధారపడి ఉంటుంది. రెండో డోసు తీసుకున్న ఏడాది తర్వాత బూస్టర్ డోసు గురించి ఆలోచించాలి. అయితే దీనిపై మరింత సమాచారం అవసరం’ అని అన్నారు. ‘బ్రిటన్లో కేసులు పెరుగుతుండటాన్ని మనం చూస్తున్నాం. అయితే ఆసుపత్రుల్లో చేరేవారు, మృతుల సంఖ్య మాత్రం పెరగడం లేదు. బ్రిటన్ గతేడాది డిసెంబర్లో వ్యాక్సినేషన్ ప్రారంభించింది. అంటే డిసెంబర్లో ఇచ్చినప్పటికీ టీకాల ప్రభావం ఇంకా వారిపై ఉంది. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుంటే భారతీయులు సురక్షితంగానే అన్నట్లు అర్థం’ అని అన్నారు. అయితే వైరస్లో మరిన్ని మ్యుటేషన్లు ఏర్పడితే బూస్టర్ డోసులు తప్పనిసరి అవుతుందని పేర్కొన్నారు.
మూడో డోసు వినియోగంపై ఇంకా చర్చలు కొనసాగుతున్నట్లు గులేరియా తెలిపారు. ఈ టీకాపై ప్రభుత్వం వచ్చే ఏడాదే నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయన్నారు. వైరస్ ప్రభావం అధికంగా ఉండేవారు, వృద్ధులకే మొదట ప్రాధాన్యం ఇస్తామని వెల్లడించారు. పిల్లలకు వ్యాక్సిన్లపైనా గులేరియా మాట్లాడారు. చిన్నారులకు వేసే టీకాలపై ఇంకా చర్చలు సాగుతున్నాయని, అమెరికా లాంటి దేశాలు సిఫార్సు చేసిన వ్యాక్సిన్లను అందుబాటులో ఉంచే అవకాశాలున్నాయని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం