టాటా, బిర్లా బ్యాంక్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చా?
టాటా, బిర్లా, అంబానీ వంటి ప్రముఖుల బ్యాంకు డిపాజిట్లు, రుణాలకు సంబంధించిన సమాచారాన్ని సామాన్య పౌరులు తెలుసుకునే అవకాశం ఉందా?అన్న అంశంపై సుప్రీంకోర్టులో సోమవారం ఆసక్తికర వాదనలు జరిగాయి.బ్యాంకుల కార్యకలాపాలకు...
సుప్రీంకోర్టులో ఆసక్తికర వాదనలు
దిల్లీ: టాటా, బిర్లా, అంబానీ వంటి ప్రముఖుల బ్యాంకు డిపాజిట్లు, రుణాలకు సంబంధించిన సమాచారాన్ని సామాన్య పౌరులు తెలుసుకునే అవకాశం ఉందా?అన్న అంశంపై సుప్రీంకోర్టులో సోమవారం ఆసక్తికర వాదనలు జరిగాయి. బ్యాంకుల కార్యకలాపాలకు సంబంధించిన వివరాలను ‘సమాచార హక్కు చట్టం’ కింద అందజేయాలని ఆరేళ్ల క్రితం సర్వోన్నత న్యాయస్థానం ఆర్బీఐని ఆదేశించింది. దీన్ని పునఃసమీక్షించాలని ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజాలైన ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ సుప్రీంను ఆశ్రయించాయి. వీరి అభ్యర్థనలకు న్యాయస్థానం ఈ ఏడాది ఏప్రిల్ 29న తోసిపుచ్చింది.
ఎస్బీఐ తరఫున సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, హెచ్డీఎఫ్సీ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ సుప్రీంలో వాదనలు వినిపించారు. వ్యక్తుల ఖాతాలతో పాటు బ్యాంకింగ్ కార్యకలాపాలకు సంబంధించిన వివరాలు బ్యాంకుల పరిధిలో రహస్యంగా ఉంటాయని జస్టిస్ ఎస్.అబ్దుల్ నాజిర్, జస్టిస్ కష్ణా మురారీతో కూడిన ధర్మాసనానికి వివరించారు. సుప్రీం ఇచ్చిన తీర్పు వల్ల బ్యాంకింగ్ వ్యవస్థకు సంబంధించిన నిబంధనలు గందరగోళంగా మారే అవకాశం ఉందని వివరించారు.
ఓ ఖాతాదారుడు పెట్టుకున్న విశ్వాసాన్ని బ్యాంకులు ఎలా వమ్ము చేస్తాయని తుషార్ మెహతా వ్యాఖ్యానించారు. అలాగే ఒక వ్యక్తి ఆర్టీఐ ద్వారా తెలుసుకోవాలనుకున్నంత మాత్రాన బ్యాంకింగ్ లావాదేవీలకు సంబంధించిన వివరాలు ఎలా ఇవ్వగలమన్నారు. భవిష్యత్తులో చేపట్టబోయే బిజినెస్ కోసం తీసుకున్న రుణం సహా ఇతర రహస్య సమాచారం శత్రువుల చేతికి చేరే ప్రమాదం ఉందన్నారు. ఇలా సమాచారం ఇస్తే వాణిజ్య రహస్యాలు బయటకు పొక్కే అవకాశం ఉందని రోహత్గీ వాదించారు. వ్యక్తిగత గోప్యత జీవించే హక్కులో భాగమేనని సుప్రీం స్పష్టం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. మరి బ్యాంకు ఖాతాదారులు తమ ఖాతాలకు సంబంధించిన గోప్యతను మెయింటైన్ చేయాల్సిన హక్కు లేదా?అని ప్రశ్నించారు.
ఈ విషయంపై తాజాగా మరోసారి బ్యాంకులు కోర్టును ఆశ్రయించడాన్ని న్యాయవాది ప్రశాంత్ భూషణ్ నిరసించారు. తీర్పును పునఃసమీక్షించాలన్న అభ్యర్థనను కోర్టు ఇప్పటికే తోసిపుచ్చిందని గుర్తుచేశారు. అయితే, ఈ కేసు చాలా ప్రాచుర్యం పొందిందని.. ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్లో భాగంగా ఉన్న బ్యాంకులన్నీ ఇందులో కక్షిదారులేనని తెలిపారు. కానీ, ఒక్క ఐసీఐసీఐ బ్యాంక్ తప్ప ఎవరూ వాదనల్లో పాల్గొనలేదని గుర్తుచేశారు. ఇప్పుడు వచ్చి తమ వాదనను పరిగణనలోకి తీసుకోవాలనడం సమంజసం కాదని కోర్టుకు తెలిపారు.
ప్రశాంత్ భూషణ్ వాదనలతో ఏకీభవించిన కోర్టు ఏప్రిల్ 29న బ్యాంకుల అభ్యర్థనను తోసిపుచ్చిన జస్టిస్ ఎల్.ఎన్.రావు నేతృత్వంలోని ధర్మాసనానికే ఈ కేసు విచారణను తిరిగి పంపనున్నట్లు వెల్లడించింది. దీనిపై తిరిగి గురువారం విచారణ జరగనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం