దేశ రక్షణ కోసం ఇతరులపై ఆధారపడబోము
దేశ రక్షణ కోసం భారత్ ఎప్పటికీ ఇతర దేశాలపై ఆధారపడబోదని కేంద్ర రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఆత్మనిర్భర్ భారత్ అభియాన్లో భాగంగా రక్షణ రంగ తయారీ సామర్థ్యాలను పెంచుకునేందుకు దేశం
బెంగళూరులో రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్
బెంగళూరు: దేశరక్షణ కోసం భారత్ ఎప్పటికీ ఇతర దేశాలపై ఆధారపడబోదని కేంద్ర రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఆత్మనిర్భర్ భారత్ అభియాన్లో భాగంగా రక్షణ రంగ తయారీ సామర్థ్యాలను పెంచుకునేందుకు దేశం నిరంతరం కృషిచేస్తోందని తెలిపారు. కర్ణాటక రాజధాని బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హాల్)లో ఎల్సీఏ తేజస్ నూతన ఉత్పత్తి లైన్ను రాజ్నాథ్ నేడు ప్రారంభించారు.
ఈ సందర్భంగా రక్షణమంత్రి మాట్లాడుతూ.. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తేజస్.. అనేక అంశాల్లో విదేశీ యుద్ధవిమానాల కంటే మెరుగైందని కొనియాడారు. అంతేగాక, చౌకగానూ లభిస్తోందన్నారు. ఇప్పుడు చాలా దేశాలు తేజస్పై ఆసక్తి కనబరుస్తున్నాయని తెలిపారు. ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ కింద దేశ రక్షణ సామర్థ్యాలను మెరుగుపర్చుకునే దిశగా భారత్ చర్యలు చేపట్టిందని, ఇకపై రక్షణ విషయంలో ఇతర దేశాలపై ఆధారపడబోమన్నారు.
భారత వాయుసేనకు తేజస్ విమానాలను అందించేందుకు హాల్తో రూ. 48వేల కోట్ల ఒప్పందం జరిగిన విషయం తెలిసిందే. 2024 మార్చి నుంచి ఈ విమానాల సరఫరా ప్రారంభం కానుందని హాల్ ఛైర్మన్ ఆర్. మాధవన్ ఇటీవల తెలిపారు. ఏటా 16 చొప్పున మొత్తం 83 తేజస్లను వాయుసేకు అందించనున్నట్లు వెల్లడించారు.
ఇవీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.