Omicron XE: ముంబయిలో తొలి ‘ఎక్స్ఈ’ కేసు.. కేంద్రం ఏమందంటే..?
దేశంలో కొవిడ్ కొత్త ‘ఎక్స్ఈ’ వేరియంట్ తొలి కేసు ముంబయిలో బయటపడినట్లు వస్తోన్న వార్తలను కేంద్ర ఆరోగ్యశాఖ ఖండించింది. ప్రస్తుతమున్న ఆధారాలతో
ముంబయి: దేశంలో కొవిడ్ కొత్త ‘ఎక్స్ఈ’ వేరియంట్ తొలి కేసు ముంబయిలో బయటపడినట్లు వస్తోన్న వార్తలను కేంద్ర ఆరోగ్యశాఖ ఖండించింది. ప్రస్తుతమున్న ఆధారాలతో కొత్త వేరియంట్ను ధ్రువీకరించలేమని ఆరోగ్య శాఖ చెప్పినట్లు పీఐబీ మహారాష్ట్ర ట్విటర్ వేదికగా వెల్లడించింది.
‘‘ముంబయిలో ఓ మహిళకు ఎక్స్ఈ వేరియంట్ సోకినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ప్రస్తుతమున్న ఆధారాలు ఈ వేరియంట్ను సూచించట్లేదు. ఎక్స్ఈ వేరియంట్ సోకినట్లు భావిస్తోన్న మహిళ నమూనాలను ఇన్సాకాగ్కు చెందిన జీనోమిక్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. మహిళ నమూనాల్లో ఉన్న మ్యుటెంట్ జెనెటిక్ మేకప్.. ఎక్స్ఈ మ్యుటెంట్తో సరిపోలడం లేదని వారు తెలిపారు. సదరు మహిళ రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నారు. అంతేగాక, ఆమెకు ఎలాంటి లక్షణాలు లేవు. ఫిబ్రవరి 10న ఆమె దక్షిణాఫ్రికా నుంచి భారత్కు వచ్చారు. అంతకుముందు ఆమె విదేశీ ప్రయాణాలు చేయలేదు. భారత్కు వచ్చినప్పుడు ఆమెకు పరీక్షల్లో నెగెటివ్ వచ్చింది’’ అని కేంద్ర హోంశాఖ వెల్లడించినట్లు పీఐబీ మహారాష్ట్ర తెలిపింది.
కంగారు పడొద్దు..
ఈ వార్తలపై మహరాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజేశ్ తోపే స్పందించారు. అది ఎక్స్ఈ వేరియంటే అని ఇప్పుడే స్పష్టంగా చెప్పలేమన్నారు. ప్రజలెవరూ కంగారుపడొద్దని తెలిపారు. ‘‘ఎక్స్ఈ వేరియంట్ సోకినట్లుగా భావిస్తోన్న మహిళ డేటా, నమూనాలను తదుపరి విశ్లేషణలకు పంపించాం. అది ఎక్స్ఈ వేరియంటే అని ధ్రువీకరించేలా అటు కేంద్రం నుంచి గానీ.. ఇటు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోలాజికల్స్ నుంచి గానీ ఎలాంటి నివేదిక రాలేదు. అందువల్ల ముంబయిలోకి కొత్త వేరియంట్ ప్రవేశించిందని ఇప్పుడే స్పష్టంగా చెప్పలేం. ఆ రిపోర్టులు వచ్చిన తర్వాతే దీని గురించి పూర్తి వివరాలను వెల్లడిస్తాం. ఇప్పటివరకు వెలువడిన అధ్యయనాల ప్రకారం.. ఎక్స్ఈ వేరియంట్.. ఒమిక్రాన్ కంటే 10శాతం వేగంగా వ్యాప్తి చెందుతుంది. అయితే ప్రజలు కంగారు పడాల్సిన అవసరం లేదు. మళ్లీ ఆంక్షలను విధించే ఆలోచన లేదు’’ అని రాజేశ్ తోపే వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
WhatsApp: యూజర్ల సందేశాలకు భద్రత కల్పించేందుకు సంభాషణలను ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ చేస్తున్నామని వాట్సప్ తెలిపింది. ఒకవేళ దాన్ని బ్రేక్ చేయాలని చెబితే తాము భారత్ను వీడాల్సి వస్తుందని స్పష్టం చేసింది. -
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
విజయ్ మాల్యా విదేశాల్లోని ఆస్తులపై భారత ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీంతోపాటు ఆ దేశాలకు అతడు వస్తే అప్పగించాలని కోరుతోంది. తాజాగా ఫ్రాన్స్ను ఈ మేరకు అభ్యర్థించింది. -
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!