xi jinping: చరిత్రాత్మకం.. చైనా తీర్మానం జిన్పింగ్కు రాచబాట
మూడోసారి చైనా అధ్యక్షుడిగా జిన్పింగ్ పగ్గాలు చేపట్టడానికి పాలక కమ్యూనిస్టు పార్టీ రంగం సిద్ధం చేసింది.
మూడోసారి పగ్గాలు చేపట్టేందుకు రంగం సిద్ధం
బీజింగ్: మూడోసారి చైనా అధ్యక్షుడిగా జిన్పింగ్ పగ్గాలు చేపట్టడానికి పాలక కమ్యూనిస్టు పార్టీ రంగం సిద్ధం చేసింది. జిన్పింగ్కు ముందు అధ్యక్ష పదవి నిర్వహించిన హూ జింటావో రెండు పదవీ కాలాలు ముగిశాక అధికారం నుంచి తప్పుకొన్నారు. దేశాధ్యక్ష పదవిలో ఎవరూ రెండుసార్లకు మించి కొనసాగకూడదని గతంలో డెంగ్ జియావో పింగ్ హయాంలో పరిమితి విధించారు. అయితే 2018లో రాజ్యాంగ సవరణ ద్వారా ఈ పరిమితిని రద్దు చేయడంతో జిన్పింగ్ మూడోసారే కాకుండా జీవితకాల అధ్యక్షుడిగా కొనసాగడానికి మార్గం సుగమం అయింది. బీజింగ్లో ఈ నెల 8 నుంచి 11 వరకు నిర్వహించిన పార్టీ కేంద్ర కమిటీ ఆరో ప్లీనరీ సమావేశం గత వందేళ్లలో కమ్యూనిస్టు పార్టీ సాధించిన విజయాలను ఏకరవు పెడుతూ ‘చరిత్రాత్మక తీర్మానం’ చేసింది. రానున్న దశాబ్దాల్లో చైనా కమ్యూనిస్టు పార్టీ దశ, దిశలను ఈ తీర్మానం నిర్దేశిస్తుంది. చైనా కమ్యూనిస్టు పార్టీ చరిత్రలో ఇంతవరకు రెండేసార్లు ఇలాంటి చరిత్రాత్మక తీర్మానాలు చేసింది. 1945లో మావో సారథ్యంలో సాంస్కృతిక విప్లవం తీసుకు రావడానికి.. 1981లో డెంగ్ సియావో పింగ్ ఆర్థిక సంస్కరణలను చేపట్టడానికి ఆ తీర్మానాలు చేశారు. ఇలాంటి వాటిలో తాజా తీర్మానం మూడోది. జిన్పింగ్ చైనాలో మూడు అధికార కేంద్రాలైన కమ్యూనిస్టు పార్టీ, కేంద్ర మిలటరీ కమిషన్, దేశాధ్యక్ష పదవులను ఒంటి చేత్తో నిర్వహిస్తున్నారు. అందువల్ల ఆయన్ను కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థాపకుడు మావో జెడాంగ్ తర్వాత అంతటి ‘కీలక నాయకుడి’గా గుర్తింపు పొందింది జిన్పింగే. 2016లో ఆయనకు ఈ హోదా కట్టబెట్టి.. పార్టీ నిబంధనావళిలో పొందుపరిచారు. ప్లీనరీ సమావేశంలో పార్టీ పొలిట్బ్యూరో
తరఫున జిన్పింగ్ ముఖ్య ప్రసంగం చేశారు. అందులో పార్టీ, ప్రభుత్వం సాధించిన విజయాలను వివరించారు. 2022 ద్వితీయార్ధంలో బీజింగ్లో కమ్యూనిస్టు పార్టీ 20వ జాతీయ మహాసభల నిర్వహణకు ప్లీనరీ సమావేశం తీర్మానం చేసింది. ఆ మహాసభల్లో జిన్పింగ్ను మూడోసారి అధ్యక్షుడిగా ఎన్నుకుంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఆసియా-పసిఫిక్లో ప్రచ్ఛన్నయుద్ధం వద్దు! అలనాటి పరిస్థితులు పునరావృతం కానివ్వరాదు : జిన్పింగ్
వెల్లింగ్టన్: ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో ఉద్రిక్తతలతో ప్రచ్ఛన్నయుద్ధం నాటి పరిస్థితులు పునరావృతం కాకుండా చూడాలని చైనా అధ్యక్షుడు జిన్పింగ్ స్పష్టంచేశారు. ఇక్కడ కూటముల వారీగా విడిపోవడం తగదన్నారు. గురువారం ఆయన ఆసియా-పసిఫిక్ ఆర్థిక సహకార మండలి (అపెక్) శిఖరాగ్ర సదస్సుకు ఒక వీడియో సందేశాన్ని పంపారు. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియాలు కొత్తగా కూటమి ఏర్పాటు చేయడం, అస్ట్రేలియాకు అణు జలాంతర్గాములు సమకూర్చేందుకు సిద్ధపడటం వంటి అంశాల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కూటమిపై చైనా తీవ్ర ఆగ్రహంగా ఉంది. అపెక్ శిఖరాగ్ర సదస్సు వర్చువల్గా న్యూజిలాండ్లో జరుగుతోంది. ఇందులో భాగంగా గురువారం సీఈవో సదస్సు జరిగింది. దీనికి జిన్పింగ్ ఒక వీడియో సందేశాన్ని పంపారు. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో మతం, సిద్ధాంతం, భౌగోళిక రాజకీయ సూత్రాల ఆధారంగా చీలికలు తీసుకురావడానికి జరిగే ప్రయత్నాలు విఫలం కాక తప్పదన్నారు. ఈ ప్రాంతంలో సరకు సరఫరా వ్యవస్థలు సజావుగా సాగాలన్నారు. అలాగే వాణిజ్యం, పెట్టుబడుల సరళీకరణను కొనసాగించాలని కోరారు. తాము అదే మార్గంలో పయనిస్తామన్నారు. మరోవైపు అపెక్ కూటమిలో విభేదాలు ప్రస్ఫుటమయ్యాయి. 2023లో ఈ శిఖరాగ్ర సదస్సుకు ఆతిథ్యమిస్తామంటూ అమెరికా చేసిన ప్రతిపాదనపై ఏకాభిప్రాయం రాలేదు. తన డిమాండ్లు పరిష్కారం కాలేదంటూ రష్యా దీన్ని వ్యతిరేకించడమే ఇందుకు కారణం. తమ దౌత్యాధికారులను అమెరికా ‘బ్లాక్ లిస్ట్’ నుంచి తొలగించాలని లేదా అపెక్ సమావేశాల కోసం ఆ దేశం వెళ్లేందుకు అనుమతించాలని రష్యా డిమాండ్ చేస్తోంది. దీనికి అమెరికా సమ్మతించే అవకాశం లేదన్న వాదన వినిపిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారత్లో ఎత్తయిన ప్రాంతాల్లోని చిన్నారులకు స్టంటింగ్ ముప్పు
వయసుకు తగ్గట్లు శారీరక ఎదుగుదల లోపించే (స్టంటింగ్) ముప్పు భారత్లోని కొండ ప్రాంతాల్లో నివసించే చిన్నారులకు ఎక్కువని, తాజా అధ్యయనం తేల్చింది. -
దక్షిణాదిలో నీటి సంక్షోభం!
దక్షిణ భారతదేశం తీవ్ర నీటి సంక్షోభంలో చిక్కుకుంది. ఆ ప్రాంతంలోని రిజర్వాయర్ల సామర్థ్యంలో 17 శాతం మేర మాత్రమే నీరు ఉందని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) తాజా బులెటిన్ పేర్కొంది. -
రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇచ్చారు
దేశ రాజధాని దిల్లీలోని నగరపాలక సంస్థ (ఎంసీడీ) పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పుస్తకాలు సరఫరా చేయకపోవడంపై నగరపాలక సంస్థను దిల్లీ హైకోర్టు శుక్రవారం నిలదీసింది. -
భారతీయులకే అమెరికాలో సీఈవో అవకాశం!
అమెరికాలో భారతీయులు పెద్ద మార్పును తీసుకొస్తున్నారని ఆ దేశ రాయబారి ఎరిక్ గార్సెటి అన్నారు. దిగ్గజ కంపెనీల్లో ప్రతీ 10 మంది సీఈవోల్లో ఒకరు భారత సంతతి వ్యక్తులే ఉంటున్నారని అన్నారు. -
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు హైకోర్టు నిరాకరణ
ప్రముఖ నటుడు, ఉత్తర్ప్రదేశ్లోని గోరఖ్పుర్ లోక్సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి రవికిషన్ తన తండ్రి అంటూ జూనియర్ నటి షినోవా సోనీ ఆరోపించిన తెలిసిందే. -
కేంద్ర చట్టంపై దిల్లీ ప్రభుత్వ సవాలు విచారణకు సుప్రీంకోర్టు పచ్చజెండా
దేశ రాజధాని దిల్లీలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నియామకాలపై లెఫ్టినెంట్ గవర్నర్కు అధికారం కట్టపెడుతూ కేంద్రం చేసిన చట్టాన్ని సవాలు చేస్తూ దిల్లీ ప్రభుత్వం వేసిన పిటిషన్ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. -
సిసోదియా జ్యుడిషియల్ కస్టడీ 8 వరకు పొడిగింపు
దిల్లీ మద్యం విధానంతో సంబంధమున్న నగదు అక్రమ చలామణి నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కేసులో అరెస్టైన ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు మనీశ్ సిసోదియా, సహ నిందితుడు విజయ్ నాయర్, ఇతరుల జ్యుడిషియల్ కస్టడీని శుక్రవారమిక్కడి న్యాయస్థానం మే ఎనిమిదో తేదీ వరకు పొడిగింది. -
కశ్మీర్లో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదుల హతం
జమ్మూకశ్మీర్లోని బారాముల్లా జిల్లా చెక్ మొహల్లా నౌపొరాలో భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య గురువారం నుంచి కాల్పులు కొనసాగుతున్నాయి. -
100% వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు అసాధ్యం
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎం)పై వ్యక్తమవుతున్న అనుమానాలను సర్వోన్నత న్యాయస్థానం నిర్ద్వంద్వంగా కొట్టిపారేసింది. -
జేఈఈ మెయిన్స్ ఆలిండియా టాపర్గా రైతు బిడ్డ
మహారాష్ట్రలోని మారుమూల గ్రామానికి చెందిన ఓ రైతుబిడ్డ జేఈఈ మెయిన్స్ అఖిల భారతస్థాయిలో మొదటి స్థానంలో నిలిచాడు. -
ఎవరెస్ట్ బేస్ క్యాంప్నకు ఆరేళ్ల బాలుడు
హిమాచల్ప్రదేశ్లోని బిలాస్పుర్కు చెందిన ఆరేళ్ల బాలుడు ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఎవరెస్ట్ శిఖరం బేస్ క్యాంప్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశాడు. బిలాస్పుర్ జిల్లాలోని జుఖాలా ప్రాంతానికి చెందిన యువన్ తల్లిదండ్రులతో కలిసి దుబాయ్లో ఉంటున్నాడు. -
వామపక్ష తీవ్రవాదం కట్టడికి ఏడాదికి రూ.వెయ్యి కోట్ల పైమాటే!
దేశంలో వామపక్ష తీవ్రవాదం కట్టడికి ప్రయత్నిస్తున్న కేంద్రం ఇందుకోసం భారీగా నిధులు వెచ్చిస్తోంది. ఈ మేరకు గత ఐదేళ్లలో.. ఏడాదికి రూ.వెయ్యి కోట్లకు పైగా వెచ్చించింది. -
నోటా విజేతగా నిలిస్తే?
సార్వత్రిక ఎన్నికల వేళ సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్నికల్లో అభ్యర్థుల కన్నా నోటాకు అధికంగా ఓట్లు వస్తే ఏం చేయాలనే విషయమై చర్చకు తావిచ్చేలా ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఒకటి దాఖలైంది. -
చట్టం లేకుండా ఎల్వోసీలు జారీ చేయడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే
రుణ ఎగవేత ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిపై.. నిర్దిష్ట చట్టమేదీ లేకుండానే ప్రభుత్వరంగ బ్యాంకుల వినతి మేరకు సర్కారు లుకౌట్ సర్క్యులర్లు (ఎల్వోసీ) జారీ చేయడం వ్యక్తుల ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని బాంబే హైకోర్టు పేర్కొంది. -
సందేశ్ఖాలీలో భారీగా ఆయుధాల స్వాధీనం
పశ్చిమబెంగాల్లోని సందేశ్ఖాలీలో సోదాలు నిర్వహించిన సీబీఐ అధికారులు.. తృణమూల్ కాంగ్రెస్ బహిష్కృత నేత షాజహాన్ షేక్ బంధువు ఇంటి నుంచి భారీ సంఖ్యలో ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. -
2025 నుంచి ఏడాదికి రెండుసార్లు బోర్డు పరీక్షలు
జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా ఏడాదికి రెండు సార్లు బోర్డు పరీక్షలను నిర్వహిస్తామని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. -
ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ విధానం సవరించాలంటే భారత్ను వీడతాం
సమాచార దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు అమలు చేస్తున్న తన ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ విధానాన్ని సవరించాలని బలవంత పెడితే తాము భారత్లో సేవలను నిలిపివేస్తామంటూ వాట్సప్ సంచలన వ్యాఖ్యలు చేసింది. -
ఈవీఎంలపై సుప్రీం తీర్పు విపక్షాలకు గట్టి చెంపదెబ్బ
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల (ఈవీఎంలు)పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ సారథ్యంలోని విపక్ష కూటమికి గట్టి చెంపదెబ్బ. -
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
ఏడాదికి రెండు సార్లు సీబీఎస్ఈ పరీక్షలు నిర్వహించేందుకు సీబీఎస్ఈ రంగం సిద్ధం చేస్తోంది. బోర్డు పరీక్షల్లో సెమిస్టర్ విధానం తీసుకొచ్చే ఆలోచన లేదని సమాచారం.