సైబర్ నేరాల కట్టడికి పౌరుల సేవలు
సైబర్ ప్రపంచంపై మరింత సమన్వయంతో, సమగ్ర రీతిలో కన్నేసి ఉంచేందుకు సామాన్య ప్రజలు ‘సైబర్ క్రైమ్ వాలంటీర్లు’గా నమోదు కావాలని కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది.
వాలంటీర్లుగా నమోదుకు కేంద్రం పిలుపు
దిల్లీ, జమ్ము: సైబర్ ప్రపంచంపై మరింత సమన్వయంతో, సమగ్ర రీతిలో కన్నేసి ఉంచేందుకు సామాన్య ప్రజలు ‘సైబర్ క్రైమ్ వాలంటీర్లు’గా నమోదు కావాలని కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది. తద్వారా దేశ సార్వభౌమాధికారానికి వ్యతిరేకంగా, చిన్నారులు, మహిళలను కించపరిచేలా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే పోస్టులను అడ్డుకోవడంలో సాయపడాలని కోరింది. ఈ మేరకు ‘ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్’ (ఐ4సీ) అనే ప్రాజెక్టు కింద దీన్ని చేపడుతున్నారు. దీన్ని గతవారం జమ్మూ-కశ్మీర్లో ప్రారంభించారు. అక్కడ.. వాలంటీర్లుగా నమోదుకావాలని సూచిస్తూ పౌరులకు పోలీసులు ఒక సర్క్యులర్ జారీ చేశారు.
♦ భారత పౌరులెవరైనా వాలంటీరు ప్రాజెక్టులో పాలుపంచుకోవచ్చు.
♦ చట్టవిరుద్ధ అంశాలను గుర్తించే సైబర్ వాలంటీరు, సైబర్ అవగాహన ప్రచారకుడు, సైబర్ నిపుణుడు అనే మూడు విభాగాల్లో ఏదో ఒక దానిలో నమోదు కావొచ్చు.
♦ మొదటి విభాగంలోని వాలంటీర్లు.. అశ్లీల దృశ్యాల్లో చిన్నారులను వినియోగించడం, అత్యాచారం, సామూహిక అత్యాచారం, ఉగ్రవాదం, అతివాదం, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు సంబంధించిన అంశాలను గుర్తించడంలో సాయపడతారు.
♦ రెండో విభాగంలోనివారు.. మహిళలు, చిన్నారులు, వయోవృద్ధులు, గ్రామీణులు వంటి వారిని సైబర్ నేరాల గురించి అప్రమత్తం చేస్తారు.
♦ మూడో విభాగంలోని వాలంటీర్లు.. సైబర్ నేరాల్లోని నిర్దిష్ట విభాగాలు, ఫోరెన్సిక్స్, నెట్వర్క్ ఫోరెన్సిక్స్, మాల్వేర్ విశ్లేషణ, మెమరీ విశ్లేషణ, క్రిప్టోగ్రఫీ వంటి అంశాల్లో సేవలు అందిస్తారు.
♦ మొదటి విభాగంలోని వారికి పూర్వాపరాల తనిఖీ ఉండదు. రెండు, మూడు విభాగాల వారికి మాత్రం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ‘కేవైసీ’ నిబంధనల ద్వారా పరిశీలన జరుపుతాయి.
ఏకతాటిపైకి తెచ్చేందుకే..
సైబర్ నేరాల నివారణ, ముందే పసిగట్టడం, దర్యాప్తు, విచారణ వంటి అంశాల కోసం విద్యావేత్తలు, పరిశ్రమలు, ప్రభుత్వ, ప్రైవేటు వర్గాలతో ఒక వేదికను ఏర్పాటు చేయడమే ‘ఐ4సీ’ ఉద్దేశమని హోం మంత్రిత్వశాఖ తెలిపింది. ఇది పూర్తిగా స్వచ్ఛందమని, వాలంటీర్లకు ఎలాంటి పారితోషికం ఉండదని చెప్పింది. ఈ హోదాను వాణిజ్యపరమైన లబ్ధి కోసం కూడా ఉపయోగించకూడదని పేర్కొంది. ఈ ప్రాజెక్టులో తాము పాలుపంచుకుంటున్నట్లు వాలంటీర్లు ఎలాంటి బహిరంగ ప్రకటన చేయకూడదని స్పష్టం చేసింది. తమ విధులకు సంబంధించి పూర్తి గోప్యత పాటించాలంది.
ఇవీ చదవండి..
‘అంతర్జాతీయ శక్తిగా భారత్ను స్వాగతిస్తున్నాం’
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.