CoronaVirus: కరోనాపై అలర్ట్.. వివిధ రాష్ట్రాల్లో సన్నద్ధత ఇలా... (10 పాయింట్లు)
కరోనా (coronavirus)పై రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. కొవిడ్ (Covid 19) విజృంభించకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఆయా రాష్ట్రాల్లో అప్రమత్తతపై టాప్ 10 పాయింట్లు ఇవే..
ఇంటర్నెట్ డెస్క్: చైనా, జపాన్ సహా వివిధ ప్రపంచ దేశాల్లో కరోనా వైరస్ (Corona Virus) మళ్లీ విజృంభిస్తుండటంతో భారత్ అప్రమత్తమైంది. ఇప్పటికే రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలను అప్రమత్తం చేసిన కేంద్ర ప్రభుత్వం... వైద్య రంగం సన్నద్ధతపై మంగళవారం మాక్డ్రిల్ నిర్వహించాలని సూచించింది. చైనా, దక్షిణ కొరియా, జపాన్, థాయిలాండ్, హాంకాంగ్ తదితర దేశాల్లో కరోనా కేసులు భారీగా నమోదవుతుండటంతో అక్కడి నుంచి వచ్చిన వారికి ఆర్టీ -పీసీఆర్ టెస్టులు తప్పనిసరి చేసింది. ప్రతి ఒక్కరు మాస్కులు ధరించాలని, రద్దీ ప్రాంతాలకు దూరంగా ఉంటూ కొవిడ్ నిబంధనలు పాటించాలని కోరుతోంది. ఈ నేపథ్యంలో దేశంలోని వివిధ రాష్ట్రాల్లో సన్నద్ధతపై టాప్ 10 పాయింట్లు.
- హిమాచల్ప్రదేశ్లో క్రిస్మస్ సందర్భంగా పర్యాటకుల తాకిడి పెరిగింది. దీంతో అప్రమత్తమైన అక్కడి ప్రభుత్వం కొవిడ్ నిబంధనలు విధించింది. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచించింది.
- ప్రజలంతా కొవిడ్ నిబంధనలు పాటించాలని ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి విజ్ఞప్తి చేశారు. ఆదివారం మన్కీ బాత్లో మాట్లాడిన ఆయన ప్రపంచంలోని అనేక దేశాల్లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటం చూస్తున్నామని.. ఈ తరుణంలో మనమంతా జాగ్రత్తగా ఉండటం అవసరమన్నారు. మాస్కులు ధరిద్దాం.. చేతుల్ని శుభ్రం చేసుకుందాం అని పిలుపునిచ్చారు.
- వివిధ దేశాల్లో మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటంతో తమ రాష్ట్రం అప్రమత్తంగా ఉందని బిహార్ సీఎం నీతీశ్ కుమార్ అన్నారు. కరోనా పరీక్షలు చేయడంతో పాటు వ్యాక్సిన్లూ సరఫరా చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో రోజూ 45 వేల నుంచి 50 వేల టెస్టులు చేస్తున్నట్టు చెప్పారు. కేంద్రమూ జాగ్రత్తగా ఉందన్న ఆయన.. బయటి దేశాల నుంచి వచ్చేవారిపట్ల మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు.
- బీఎఫ్.7 వేరియంట్తో భారత్లో అంతగా భయాందోళనలు అవసరం లేదని వైద్యరంగ నిపుణులు పేర్కొంటున్నారు. ఇప్పటికే చాలా మంది ప్రజలు టీకాలు పొందడం ద్వారానో, లేదంటే కొవిడ్ బారిన పడటం మూలంగా ఇమ్యూనిటీని కలిగి ఉన్నారని తెలిపారు. చైనాలో కఠిన ఆంక్షల కారణంగా అక్కడి ప్రజలు తక్కువ ఇమ్యూనిటీతో ఉండటం వల్లే అక్కడ వైరస్ విజృంభణ అధికంగా ఉన్నట్టు సఫ్దర్జంగ్ ఆస్పత్రి కమ్యూనిటీ మెడిసిన్ డిపార్ట్మెంట్ అధిపతి డా.జుగల్ కిశోర్ విశ్లేషించారు. కేంద్ర ప్రభుత్వం ఎంతో క్రియాశీలంగా ఉందని.. శాస్త్రీయమైన సూచనలు చేస్తోందన్నారు. ఇతర దేశాల్లో కొవిడ్ కేసులు భారీగా పెరుగుతున్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
- ప్రపంచ దేశాల్లో కరోనా కేసులు పెరుగుతుండటంతో ఎదుర్కొనేందుకు కర్ణాటక ప్రభుత్వం వ్యూహం రచించనుంది. ఇందులో భాగంగా ఆరోగ్య, విపత్తు నిర్వహణ శాఖ మంత్రులు, ఉన్నతాధికారులు సోమవారం సమావేశమై చర్చిస్తారని సీఎం బసవరాజ్ బొమ్మై వెల్లడించారు. ఆరోగ్యమంత్రి సుధాకర్, విపత్తు నిర్వహణ సంస్థ మంత్రి ఆర్.అశోక సోమవారం వైద్యరంగ, సాంకేతిక నిపుణులతో భేటీ అయ్యి వాస్తవ పరిస్థితులపై చర్చిస్తారన్నారు. న్యూ ఇయర్ వేడుకలు, పండుగల సీజన్ నేపథ్యంలో ఎలాంటి నిబంధనలు ఖరారు చేయాలనే అంశంపై నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. మన దేశంలో కరోనా పట్ల అంతగా భయపడాల్సిన అవసరం లేకపోయినా అవగాహన ఎంతో ముఖ్యమన్నారు.
- దిల్లీలోని ప్రభుత్వ ఆస్పత్రులను అధికారులు స్వయంగా వెళ్లి సందర్శించనున్నారు. కరోనా వల్ల ఊహించని పరిస్థితులు ఎదురైతే ఏ మేరకు సన్నద్ధత కలిగి ఉన్నారనే అంశాన్ని పరిశీలించనున్నట్టు అధికారులు తెలిపారు. దిల్లీ ఆరోగ్య శాఖ కార్యదర్శి అమిత్ సింగ్లా అధ్యక్షతన జరిగిన సమావేశంలో అన్ని జిల్లాల మెజిస్ట్రేట్లు హాజరయ్యారు. ఆస్పత్రుల్లో తగినన్ని పడకలు, ఇతర సామగ్రి సరిపడా ఉన్నాయో లేదో పరిశీలించనున్నారు.
- ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సోమవారం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. కరోనాను నియంత్రించే అంశంపై సన్నద్ధత గురించి ప్రధానంగా చర్చించనున్నట్టు అధికారులు వెల్లడించారు.
- కరోనా విషయంలో యూపీ ప్రభుత్వం ఇప్పటికే అప్రమత్తమైంది. తాజ్ మహల్తో పాటు ఇతర ప్రసిద్ధ స్థలాల్లోకి వచ్చే వారికి కొవిడ్ పరీక్షను తప్పనిసరి చేసింది. కొత్త కేసులు వస్తే జీనోమ్ సీక్వెన్సింగ్కు పంపాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ అధికారుల్ని ఆదేశించారు. మాస్కులు ధరించడం, ప్రికాషన్ డోసులు వేయించుకోవాల్సిన ఆవశ్యకతపై ప్రజలకు అవగాహన కల్పించాలని సీఎం ఆదేశించారు.
- తమ ప్రభుత్వం 5 పాయింట్ల కార్యక్రమాన్ని అనుసరిస్తుందని మహారాష్ట్ర ఆరోగ్యమంత్రి తానాజీ సావంత్ వెల్లడించారు. కరోనాను ఎదుర్కొనేందుకు టెస్ట్, ట్రాక్, ట్రీట్, వ్యాక్సినేట్తో పాటు కొవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకుంటామన్నారు. విమానాశ్రయాల్లో ర్యాండమ్ థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు చేయనున్నట్టు తెలిపారు.
- దేశంలో శనివారం 236 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 3,424కి చేరింది. అలాగే, కేరళ, మహారాష్ట్రలో ఒక్కొక్కటి చొప్పున మరణాలు నమోదు కావడంతో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు మృతుల సంఖ్య 5,30,693కి చేరింది. మొత్తం ఇన్ఫెక్షన్లలో యాక్టివ్ కేసులు 0.01 శాతం ఉండగా.. రికవరీ రేటు 98.80 శాతంగా ఉన్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నోటా విజేతగా నిలిస్తే?.. సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు
సార్వత్రిక ఎన్నికల వేళ సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్నికల్లో అభ్యర్థుల కన్నా నోటాకు అధికంగా ఓట్లు వస్తే ఏం చేయాలనే విషయమై చర్చకు తావిచ్చేలా ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఒకటి దాఖలైంది. -
100% వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు అసాధ్యం
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎం)పై వ్యక్తమవుతున్న అనుమానాలను సర్వోన్నత న్యాయస్థానం నిర్ద్వంద్వంగా కొట్టిపారేసింది. -
వామపక్ష తీవ్రవాదం కట్టడికి ఏడాదికి రూ.వెయ్యి కోట్ల పైమాటే!
దేశంలో వామపక్ష తీవ్రవాదం కట్టడికి ప్రయత్నిస్తున్న కేంద్రం ఇందుకోసం భారీగా నిధులు వెచ్చిస్తోంది. ఈ మేరకు గత ఐదేళ్లలో.. ఏడాదికి రూ.వెయ్యి కోట్లకు పైగా వెచ్చించింది. -
ఎవరెస్ట్ బేస్ క్యాంప్నకు ఆరేళ్ల బాలుడు
హిమాచల్ప్రదేశ్లోని బిలాస్పుర్కు చెందిన ఆరేళ్ల బాలుడు ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఎవరెస్ట్ శిఖరం బేస్ క్యాంప్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశాడు. బిలాస్పుర్ జిల్లాలోని జుఖాలా ప్రాంతానికి చెందిన యువన్ తల్లిదండ్రులతో కలిసి దుబాయ్లో ఉంటున్నాడు. -
జేఈఈ మెయిన్స్ ఆలిండియా టాపర్గా రైతు బిడ్డ
మహారాష్ట్రలోని మారుమూల గ్రామానికి చెందిన ఓ రైతుబిడ్డ జేఈఈ మెయిన్స్ అఖిల భారతస్థాయిలో మొదటి స్థానంలో నిలిచాడు. -
భారత్లో ఎత్తయిన ప్రాంతాల్లోని చిన్నారులకు స్టంటింగ్ ముప్పు
వయసుకు తగ్గట్లు శారీరక ఎదుగుదల లోపించే (స్టంటింగ్) ముప్పు భారత్లోని కొండ ప్రాంతాల్లో నివసించే చిన్నారులకు ఎక్కువని, తాజా అధ్యయనం తేల్చింది. -
దక్షిణాదిలో నీటి సంక్షోభం!
దక్షిణ భారతదేశం తీవ్ర నీటి సంక్షోభంలో చిక్కుకుంది. ఆ ప్రాంతంలోని రిజర్వాయర్ల సామర్థ్యంలో 17 శాతం మేర మాత్రమే నీరు ఉందని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) తాజా బులెటిన్ పేర్కొంది. -
రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇచ్చారు
దేశ రాజధాని దిల్లీలోని నగరపాలక సంస్థ (ఎంసీడీ) పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పుస్తకాలు సరఫరా చేయకపోవడంపై నగరపాలక సంస్థను దిల్లీ హైకోర్టు శుక్రవారం నిలదీసింది. -
భారతీయులకే అమెరికాలో సీఈవో అవకాశం!
అమెరికాలో భారతీయులు పెద్ద మార్పును తీసుకొస్తున్నారని ఆ దేశ రాయబారి ఎరిక్ గార్సెటి అన్నారు. దిగ్గజ కంపెనీల్లో ప్రతీ 10 మంది సీఈవోల్లో ఒకరు భారత సంతతి వ్యక్తులే ఉంటున్నారని అన్నారు. -
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు హైకోర్టు నిరాకరణ
ప్రముఖ నటుడు, ఉత్తర్ప్రదేశ్లోని గోరఖ్పుర్ లోక్సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి రవికిషన్ తన తండ్రి అంటూ జూనియర్ నటి షినోవా సోనీ ఆరోపించిన తెలిసిందే. -
కేంద్ర చట్టంపై దిల్లీ ప్రభుత్వ సవాలు విచారణకు సుప్రీంకోర్టు పచ్చజెండా
దేశ రాజధాని దిల్లీలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నియామకాలపై లెఫ్టినెంట్ గవర్నర్కు అధికారం కట్టపెడుతూ కేంద్రం చేసిన చట్టాన్ని సవాలు చేస్తూ దిల్లీ ప్రభుత్వం వేసిన పిటిషన్ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. -
సిసోదియా జ్యుడిషియల్ కస్టడీ 8 వరకు పొడిగింపు
దిల్లీ మద్యం విధానంతో సంబంధమున్న నగదు అక్రమ చలామణి నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కేసులో అరెస్టైన ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు మనీశ్ సిసోదియా, సహ నిందితుడు విజయ్ నాయర్, ఇతరుల జ్యుడిషియల్ కస్టడీని శుక్రవారమిక్కడి న్యాయస్థానం మే ఎనిమిదో తేదీ వరకు పొడిగింది. -
కశ్మీర్లో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదుల హతం
జమ్మూకశ్మీర్లోని బారాముల్లా జిల్లా చెక్ మొహల్లా నౌపొరాలో భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య గురువారం నుంచి కాల్పులు కొనసాగుతున్నాయి. -
చట్టం లేకుండా ఎల్వోసీలు జారీ చేయడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే
రుణ ఎగవేత ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిపై.. నిర్దిష్ట చట్టమేదీ లేకుండానే ప్రభుత్వరంగ బ్యాంకుల వినతి మేరకు సర్కారు లుకౌట్ సర్క్యులర్లు (ఎల్వోసీ) జారీ చేయడం వ్యక్తుల ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని బాంబే హైకోర్టు పేర్కొంది. -
సందేశ్ఖాలీలో భారీగా ఆయుధాల స్వాధీనం
పశ్చిమబెంగాల్లోని సందేశ్ఖాలీలో సోదాలు నిర్వహించిన సీబీఐ అధికారులు.. తృణమూల్ కాంగ్రెస్ బహిష్కృత నేత షాజహాన్ షేక్ బంధువు ఇంటి నుంచి భారీ సంఖ్యలో ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. -
2025 నుంచి ఏడాదికి రెండుసార్లు బోర్డు పరీక్షలు
జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా ఏడాదికి రెండు సార్లు బోర్డు పరీక్షలను నిర్వహిస్తామని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. -
ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ విధానం సవరించాలంటే భారత్ను వీడతాం
సమాచార దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు అమలు చేస్తున్న తన ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ విధానాన్ని సవరించాలని బలవంత పెడితే తాము భారత్లో సేవలను నిలిపివేస్తామంటూ వాట్సప్ సంచలన వ్యాఖ్యలు చేసింది. -
ఈవీఎంలపై సుప్రీం తీర్పు విపక్షాలకు గట్టి చెంపదెబ్బ
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల (ఈవీఎంలు)పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ సారథ్యంలోని విపక్ష కూటమికి గట్టి చెంపదెబ్బ. -
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
ఏడాదికి రెండు సార్లు సీబీఎస్ఈ పరీక్షలు నిర్వహించేందుకు సీబీఎస్ఈ రంగం సిద్ధం చేస్తోంది. బోర్డు పరీక్షల్లో సెమిస్టర్ విధానం తీసుకొచ్చే ఆలోచన లేదని సమాచారం.