Defence Ministry: అనుకొన్నదాని కంటే అధికంగా ‘ఆత్మనిర్భర్‌’..!

ఆయుధ కొనుగోళ్ల బడ్జెట్‌లో అత్యధిక మొత్తం దేశీయ పరిశ్రమలకు చేరేట్లు కొనుగోళ్లు చేసింది. ముందస్తుగా నిర్దేశించుకొన్న లక్ష్యం ప్రకారం 64శాతానికి పైగా ఆయుధ కొనుగోళ్లు దేశీయ పరిశ్రమల నుంచే జరిగినట్లు రక్షణ మంత్రిత్వశాఖ బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది.

Published : 20 Apr 2022 14:45 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆయుధ కొనుగోళ్ల బడ్జెట్‌లో అత్యధిక మొత్తం దేశీయ పరిశ్రమలకు చేరినట్టు తెలుస్తోంది. ముందస్తుగా నిర్దేశించుకొన్న లక్ష్యం ప్రకారం 64శాతానికి పైగా ఆయుధ కొనుగోళ్లు దేశీయ పరిశ్రమల నుంచే జరిగినట్లు రక్షణ మంత్రిత్వశాఖ బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. 2021-2022 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 65.50శాతం ఆయుధ కొనుగోళ్ల బడ్జెట్‌ నిధులు దేశీయ పరిశ్రమలకే వెళ్లాయని ఆ ప్రకటనలో వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆశించిన ఆత్మనిర్భర్‌ భారత్‌ అంచనాలను మించి లక్ష్యాన్ని సాధించిందని పేర్కొన్నారు. 

ఇదే ఆర్థిక సంవత్సరానికి 99.50శాతం డిఫెన్స్‌ సర్వీసెస్‌ నిధులను వినియోగించుకొన్నట్లు రక్షణ శాఖ వెల్లడించింది. మార్చి 2022లో వెలువడి ప్రాథమిక వ్యయ నివేదిక ఆధారంగా ఈ విషయం వెల్లడైందని పేర్కొంది. గత కొన్నేళ్లుగా ప్రభుత్వం దేశీయ తయారీ రంగాన్ని ఊతం ఇచ్చేలా పలు చర్యలు తీసుకొంది. ఈ క్రమంలో రక్షణ రంగంలో ఎఫ్‌డీఐలను ఆటోమేటిక్‌ రూట్‌లో 49శాతం నుంచి 74శాతానికి ప్రభుత్వం పెంచింది.

ప్రపంచంలోనే అత్యధికంగా ఆయుధాలు దిగుమతి చేసుకొనే దేశాల్లో భారత్‌ అగ్రస్థానంలో ఉంది. వచ్చే ఐదేళ్లలో భారత్‌ 130 బిలియన్‌ డాలర్లు విలువైన ఆయుధాలను కొనుగోలు చేయవచ్చని అంచనా. ఈ నేపథ్యంలో ప్రభుత్వం దిగుమతులను తగ్గించుకొని.. దేశీయంగా తయారు చేసుకోవాలని నిర్ణయించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని