Goa: ఆస్తి వివాదం.. గోవాలో ఫ్రెంచ్ నటి నిర్బంధం..!
గోవాలో (Goa) నివాసం ఉంటున్న తనను కొందరు వ్యక్తులు నిర్బంధించినట్లు ఓ ఫ్రెంచ్ నటి (French Actor) ఆరోపించారు. ఆస్తి వివాదానికి సంబంధించిన వ్యవహారం కోర్టులో ఉండగానే.. తన ఇంటికి నీరు, కరెంటు తొలగించి వేధింపులకు గురిచేస్తున్నారని అన్నారు.
పనాజీ: ఓ ఆస్తి వివాదానికి సంబంధించి గోవాలోని(Goa) ఇంట్లో తనను కొందరు వ్యక్తులు నిర్బంధించారని ఫ్రెంచ్ నటి (French Actor) ఆరోపించారు. ప్రస్తుతం తాను ప్రమాదకర స్థితిలో ఉన్నానన్నారు. ఉత్తర గోవాలో నివాసముంటున్న ఆమె.. ఇందుకు సంబంధించి ఓ వీడియో విడుదల చేశారు. అయితే, అది సివిల్ వివాదం కావడంతో ఈ వ్యవహారంలో జోక్యం చేసుకునేందుకు స్థానిక పోలీసులు నిరాకరించినట్లు సమాచారం.
పనాజీకి సమీపంలోని కలంగూట్ బీచ్ దగ్గర్లో ఉన్న ఇంట్లో మరియన్నే బార్గో (70) అనే ఫ్రెంచ్ నటి నివసిస్తున్నారు. ఆ ఇంటిని 2008లో ఓ న్యాయవాది నుంచి కొనుగోలు చేశారట. అయితే, ఆ ఆస్తి తమదేనంటూ కొందరు వ్యక్తులు ఇటీవల కోర్టులో దావా వేశారు. దీంతో తమవద్ద ఉన్న దస్త్రాలతో ట్రయల్ కోర్టులో ఫ్రెంచ్ నటి తరపు న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. ఇలా ఈ వ్యవహారం న్యాయస్థానం పరిధిలో ఉండగానే దావా వేసిన వ్యక్తులు ఆ ఇంటికి కరెంటు, నీటి వసతిని తొలగించినట్లు ఆమె ఆరోపించారు. దీంతో గడిచిన మూడు రోజులుగా ఆమె చీకట్లోనే గడుపుతున్నానని వాపోయారు. అంతేకాకుండా ఇంటి గేటుకు తాళం వేయడంతోపాటు కేవలం పని మనిషిని మాత్రమే లోనికి అనుమతిస్తున్నారని ఆమె స్నేహితులు వెల్లడించారు.
ఫ్రెంచ్ నటి చేసిన ఆరోపణలపై స్పందించిన స్థానిక పోలీసులు.. ఆమె ఫిర్యాదు చేసినప్పుడల్లా ఆ ఇంటికి వెళ్లి పరిశీలిస్తున్నామని తెలిపారు. అయితే, ఈ కేసు న్యాయస్థానం పరిధిలో ఉన్నందున ఏమీ చేయలేకపోతున్నామని చెప్పారు. ఇదిలాఉంటే, పారిస్ కేంద్రంగా ఉండే నేషనల్ అకాడమీ ఆఫ్ డ్రామాటిక్ ఆర్ట్స్లో శిక్షణ పొందిన ఆమె.. యూరప్తోపాటు భారతీయ చిత్రాల్లోనూ నటించారు. సినిమాల్లోనే కాకుండా టీవీ, కళారంగంలోనూ గుర్తింపు తెచ్చుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి