వ్యాయామం చేస్తే.. రైల్వేస్టేషన్‌లో ఫ్రీ టికెట్‌

నేటి జీవన విధానంలో మన ఆరోగ్యానికి వ్యాయామం తప్పనిసరే అయినప్పటికీ ఈ ఉరుకులు పరుగుల జీవితంలో ఫిట్‌నెస్‌పై ఆసక్తి చూపించేవారు తక్కువే. అందుకే  వ్యాయామాన్ని ప్రోత్సహించి ఆరోగ్యంపై ప్రజలకు

Published : 21 Feb 2020 15:49 IST

దిల్లీ రైల్వే స్టేషన్లో వినూత్న ప్రయోగం

దిల్లీ: నేటి జీవన విధానంలో మన ఆరోగ్యానికి వ్యాయామం తప్పనిసరే అయినప్పటికీ ఈ ఉరుకులు పరుగుల జీవితంలో ఫిట్‌నెస్‌పై ఆసక్తి చూపించేవారు తక్కువే. అందుకే వ్యాయామాన్ని ప్రోత్సహించి ఆరోగ్యంపై ప్రజలకు మరింత అవగాహన కల్పించేందుకు వినూత్న ప్రయోగం చేపట్టింది రైల్వేశాఖ. కొద్దిసేపు వ్యాయామం చేస్తే ఉచితంగా ప్లాట్‌ఫాం టికెట్‌ పొందే అవకాశం కల్పిస్తోంది. ప్రస్తుతం దిల్లీలోని ఓ రైల్వే స్టేషన్‌లో ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. 

దిల్లీలోని ఆనంద్‌ విహార్‌ రైల్వే స్టేషన్‌లో కొత్తగా ఫిట్‌నెస్‌ మిషన్‌ను ఏర్పాటు చేశారు. ఈ మిషన్‌ ముందు కొద్దిసేపు సిటప్స్‌ చేస్తే ఉచితంగా ప్లాట్‌ఫాం టికెట్‌ వస్తుంది. ఇందుకు సంబంధించిన వీడియోను కేంద్ర రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌ ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. ‘ఫిట్‌నెస్‌తో పాటు పొదుపు కూడా.. ఫిట్‌నెస్‌ను ప్రోత్సహించేందుకు దిల్లీ ఆనంద్‌ విహార్‌ స్టేషన్‌లో వినూత్న ప్రయోగం ఇది’ అని గోయల్‌ పేర్కొన్నారు. 

ఇప్పటికే రష్యాలోని కొన్ని రైల్వే స్టేషన్లలో ఈ విధానం అందుబాటులో ఉంది. అక్కడ 30 సిటప్స్‌ చేస్తే ఉచితంగా రైల్వే టికెట్‌ తీసుకోవచ్చు. దీని నుంచి స్ఫూర్తి పొందే రైల్వే అధికారులు దిల్లీ స్టేషన్‌లో ఈ ఫిట్‌నెస్‌ మిషన్‌ తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని