కరోనా విజృంభణ.. దిల్లీ సర్కార్ కీలక ఆదేశాలు
కరోనా విజృంభణతో దేశ రాజధాని నగరం వణుకుతోంది. దిల్లీలో ఇప్పటివరకు 53,116 కేసులు నమోదవ్వడంతో అక్కడి......
దిల్లీ: కరోనా విజృంభణతో దేశ రాజధాని నగరం వణుకుతోంది. దిల్లీలో ఇప్పటివరకు 53,116 కేసులు నమోదవ్వడంతో అక్కడి ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. ఈ మేరకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేసే వైద్యులతో పాటు ఇతర సిబ్బందికి సెలవులు రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. దేశవ్యాప్తంగా అత్యధికంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో మహారాష్ట్ర, తమిళనాడు తర్వాత దిల్లీ మూడో స్థానంలో ఉన్న విషయం తెలిసిందే.
రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని ఆస్పత్రులు, వైద్య సంస్థలకు చెందిన ఎండీలు, డీన్లు, డైరెక్టర్లు ఇందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఎవరైనా సెలవుల్లో ఉంటే వారిని తక్షణమే విధుల్లో చేరేలా ఆదేశాలివ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. అత్యవసర పరిస్థితుల్లో అయితే సెలవులు తీసుకోవచ్చని తెలిపింది.
కరోనా రోగులకు కచ్చితంగా ఐదు రోజులు సంస్థాగత క్వారంటైన్లో ఉంచాల్సిందేనంటూ దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ జారీచేసిన ఆదేశాలపై రాష్ట్ర ప్రభుత్వం విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. వైద్యులు, నర్సులతో పాటు క్వారంటైన్ వసతులు నిర్వహించేందుకు కొరత నెలకొన్న వేళ సెలవులు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
కరోనా రోగులకు ఐదు రోజుల పాటు సంస్థాగత క్వారంటైన్ విధించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం తప్పని ఆప్ ఎమ్మెల్యే అతిషీ అభిప్రాయపడ్డారు. తాను కరోనా బారిన పడ్డాననీ.. హోం క్వారంటైన్లో ఉండటంతో త్వరగా కోలుకొనేందుకు కుటుంబ సభ్యులు సైతం సహకరిస్తున్నారన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి
-
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
-
చిరంజీవిని విమర్శిస్తే ఖబడ్దార్.. వైకాపాకు సీఎం రమేశ్ హెచ్చరిక
-
రారండోయ్.. ఓటేయడానికి ఆంధ్రాకు
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక