ఆకలి కన్నా కరోనానే ఎంతో మేలు..!
సాఫీగా సాగిపోతున్న ఎందరో జీవితాలను కరోనా ఒక్క సారిగా తలకిందులు చేసింది. ముఖ్యంగా రోజువారీ కూలీలు, వలస కార్మికులు...
లఖ్నవూ: సాఫీగా సాగిపోతున్న ఎందరో జీవితాలను కరోనా తలకిందులు చేసింది. ముఖ్యంగా రోజువారీ కూలీలు, వలస కార్మికులు..ఉపాధి కోల్పోయి చేతిలో చిల్లిగవ్వలేక కాలి నడకన సొంత ఊర్లకు పయనమై ప్రాణాలు కోల్పోయారు. అలా బతికుంటే చాలు అనుకుని సొంత ఊర్లకు చేరుకున్న వారే ఇప్పుడు ఆకలితో చనిపోవడం కంటే కరోనాతో చనిపోయినా ఫర్వాలేదు అని అనుకునేంతగా వారి జీవితాలను ఈ వైరస్ మహమ్మారి ప్రభావితం చేసింది.
కరోనా లాక్డౌన్ ఆంక్షలు సడలించడంతో వలస కార్మికులు ఉపాధి కోసం తిరుగుపయనమవుతున్నారు. ఉత్తరప్రదేశ్లోని గోరఖపూర్ పరిసర ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో ఉపాధిని వెతుక్కుంటూ మహారాష్ట్ర, గుజరాతోపాటు ఇతర రాష్ట్రాలకు వస్తున్నారు. ‘‘ఇక్కడే పని దొరికితే నేను తిరిగి వెళ్లేవాడిని కాదు. మా సంస్థ ఇంకా తెరుచుకోలేదు. కానీ, ఏదో ఒక పని దొరుకుతుందేమోనని నేను తిరిగి వెళుతున్నాను. నా పిల్లలు ఆకలితో చనిపోయే కంటే నేను కరోనాతో చనిపోవడమే మేలు’’ అని ఆవేదన వ్యక్తం చేశారు 30 ఏళ్ల అన్సారీ. లాక్డౌన్ తర్వాత పరిశ్రమలు మూతబడటంతో ఉపాధి కోల్పోయి సొంత గ్రామానికి వచ్చిన అన్సారీకి స్థానికంగా ఎలాంటి పని దొరక్కపోవడంతో తిరిగి మహారాష్ట్రకు బయల్దేరాడు.
దివాకర్ ప్రసాద్ అనే వ్యక్తి కోల్కతాలో ఒక పరిశ్రమలో టెక్నీషియన్గా పనిచేసేవాడు. హోలి పండుగకు ఊరికి వచ్చి లాక్డౌన్తో అక్కడే ఉండిపోయాడు. లాక్డౌన్ తర్వాత తిరిగి పరిశ్రమలు తెరుచుకోవడంతో కోల్కతాకు పయనమయ్యాడు. ‘‘కరోనాతో పనిలోకి వెళ్లాలంటే భయంగానే ఉంది. కానీ, పని లేకపోతే నా కుటుంబాన్ని పోషించుకునేది ఎలా, అందుకే తిరిగి పనిలోకి వెళుతున్నా’’ అని తెలిపాడు. ‘‘ముంబయిలో ఉంటే చేతినిండా డబ్బు ఉండేది. కానీ ఇక్కడ (ఉత్తరప్రదేశ్) చాలా కష్టంగా ఉంది. వలస కార్మికుల కోసం ప్రభుత్వం ప్రకటించిన పథకాలు ఏవీ మా వరకు రాలేదు. దీంతో ఉపాధిలేక ఖాళీగా ఉండాల్సి వస్తోంది. అందుకే ముంబయికి వెళిపోతున్నా’’ అని తెలిపాడు 20 ఏళ్ల మహ్మద్ అబిద్ అనే యువకుడు.
ప్రభుత్వం రేషన్ ద్వారా నిత్యవసరాలు అందిస్తున్నప్పటికీ ఇతర అవసరాలకు డబ్బు కావాలి కదా. అందుకే కరోనా భయం ఉన్నా పనిలోకి వెళ్లక తప్పడంలేదు అని మరో వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశాడు. ఇలా దాదాపు 30 లక్షల మంది వరకు వలస కార్మికులు ఉపాధి నిమిత్తం వేరే రాష్ట్రాలకు పయనమవుతున్నట్లు సమాచారం. మరోపక్క ఎమ్ఎన్ఆర్ఈజీఏ ద్వారా రికార్డు స్థాయిలో ఉపాధి కల్పించామని ప్రభుత్వం చెబుతుండటం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నోటా విజేతగా నిలిస్తే?.. సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు
సార్వత్రిక ఎన్నికల వేళ సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్నికల్లో అభ్యర్థుల కన్నా నోటాకు అధికంగా ఓట్లు వస్తే ఏం చేయాలనే విషయమై చర్చకు తావిచ్చేలా ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఒకటి దాఖలైంది. -
100% వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు అసాధ్యం
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎం)పై వ్యక్తమవుతున్న అనుమానాలను సర్వోన్నత న్యాయస్థానం నిర్ద్వంద్వంగా కొట్టిపారేసింది. -
వామపక్ష తీవ్రవాదం కట్టడికి ఏడాదికి రూ.వెయ్యి కోట్ల పైమాటే!
దేశంలో వామపక్ష తీవ్రవాదం కట్టడికి ప్రయత్నిస్తున్న కేంద్రం ఇందుకోసం భారీగా నిధులు వెచ్చిస్తోంది. ఈ మేరకు గత ఐదేళ్లలో.. ఏడాదికి రూ.వెయ్యి కోట్లకు పైగా వెచ్చించింది. -
ఎవరెస్ట్ బేస్ క్యాంప్నకు ఆరేళ్ల బాలుడు
హిమాచల్ప్రదేశ్లోని బిలాస్పుర్కు చెందిన ఆరేళ్ల బాలుడు ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఎవరెస్ట్ శిఖరం బేస్ క్యాంప్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశాడు. బిలాస్పుర్ జిల్లాలోని జుఖాలా ప్రాంతానికి చెందిన యువన్ తల్లిదండ్రులతో కలిసి దుబాయ్లో ఉంటున్నాడు. -
జేఈఈ మెయిన్స్ ఆలిండియా టాపర్గా రైతు బిడ్డ
మహారాష్ట్రలోని మారుమూల గ్రామానికి చెందిన ఓ రైతుబిడ్డ జేఈఈ మెయిన్స్ అఖిల భారతస్థాయిలో మొదటి స్థానంలో నిలిచాడు. -
భారత్లో ఎత్తయిన ప్రాంతాల్లోని చిన్నారులకు స్టంటింగ్ ముప్పు
వయసుకు తగ్గట్లు శారీరక ఎదుగుదల లోపించే (స్టంటింగ్) ముప్పు భారత్లోని కొండ ప్రాంతాల్లో నివసించే చిన్నారులకు ఎక్కువని, తాజా అధ్యయనం తేల్చింది. -
దక్షిణాదిలో నీటి సంక్షోభం!
దక్షిణ భారతదేశం తీవ్ర నీటి సంక్షోభంలో చిక్కుకుంది. ఆ ప్రాంతంలోని రిజర్వాయర్ల సామర్థ్యంలో 17 శాతం మేర మాత్రమే నీరు ఉందని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) తాజా బులెటిన్ పేర్కొంది. -
రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇచ్చారు
దేశ రాజధాని దిల్లీలోని నగరపాలక సంస్థ (ఎంసీడీ) పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పుస్తకాలు సరఫరా చేయకపోవడంపై నగరపాలక సంస్థను దిల్లీ హైకోర్టు శుక్రవారం నిలదీసింది. -
భారతీయులకే అమెరికాలో సీఈవో అవకాశం!
అమెరికాలో భారతీయులు పెద్ద మార్పును తీసుకొస్తున్నారని ఆ దేశ రాయబారి ఎరిక్ గార్సెటి అన్నారు. దిగ్గజ కంపెనీల్లో ప్రతీ 10 మంది సీఈవోల్లో ఒకరు భారత సంతతి వ్యక్తులే ఉంటున్నారని అన్నారు. -
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు హైకోర్టు నిరాకరణ
ప్రముఖ నటుడు, ఉత్తర్ప్రదేశ్లోని గోరఖ్పుర్ లోక్సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి రవికిషన్ తన తండ్రి అంటూ జూనియర్ నటి షినోవా సోనీ ఆరోపించిన తెలిసిందే. -
కేంద్ర చట్టంపై దిల్లీ ప్రభుత్వ సవాలు విచారణకు సుప్రీంకోర్టు పచ్చజెండా
దేశ రాజధాని దిల్లీలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నియామకాలపై లెఫ్టినెంట్ గవర్నర్కు అధికారం కట్టపెడుతూ కేంద్రం చేసిన చట్టాన్ని సవాలు చేస్తూ దిల్లీ ప్రభుత్వం వేసిన పిటిషన్ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. -
సిసోదియా జ్యుడిషియల్ కస్టడీ 8 వరకు పొడిగింపు
దిల్లీ మద్యం విధానంతో సంబంధమున్న నగదు అక్రమ చలామణి నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కేసులో అరెస్టైన ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు మనీశ్ సిసోదియా, సహ నిందితుడు విజయ్ నాయర్, ఇతరుల జ్యుడిషియల్ కస్టడీని శుక్రవారమిక్కడి న్యాయస్థానం మే ఎనిమిదో తేదీ వరకు పొడిగింది. -
కశ్మీర్లో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదుల హతం
జమ్మూకశ్మీర్లోని బారాముల్లా జిల్లా చెక్ మొహల్లా నౌపొరాలో భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య గురువారం నుంచి కాల్పులు కొనసాగుతున్నాయి. -
చట్టం లేకుండా ఎల్వోసీలు జారీ చేయడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే
రుణ ఎగవేత ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిపై.. నిర్దిష్ట చట్టమేదీ లేకుండానే ప్రభుత్వరంగ బ్యాంకుల వినతి మేరకు సర్కారు లుకౌట్ సర్క్యులర్లు (ఎల్వోసీ) జారీ చేయడం వ్యక్తుల ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని బాంబే హైకోర్టు పేర్కొంది. -
సందేశ్ఖాలీలో భారీగా ఆయుధాల స్వాధీనం
పశ్చిమబెంగాల్లోని సందేశ్ఖాలీలో సోదాలు నిర్వహించిన సీబీఐ అధికారులు.. తృణమూల్ కాంగ్రెస్ బహిష్కృత నేత షాజహాన్ షేక్ బంధువు ఇంటి నుంచి భారీ సంఖ్యలో ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. -
2025 నుంచి ఏడాదికి రెండుసార్లు బోర్డు పరీక్షలు
జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా ఏడాదికి రెండు సార్లు బోర్డు పరీక్షలను నిర్వహిస్తామని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. -
ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ విధానం సవరించాలంటే భారత్ను వీడతాం
సమాచార దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు అమలు చేస్తున్న తన ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ విధానాన్ని సవరించాలని బలవంత పెడితే తాము భారత్లో సేవలను నిలిపివేస్తామంటూ వాట్సప్ సంచలన వ్యాఖ్యలు చేసింది. -
ఈవీఎంలపై సుప్రీం తీర్పు విపక్షాలకు గట్టి చెంపదెబ్బ
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల (ఈవీఎంలు)పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ సారథ్యంలోని విపక్ష కూటమికి గట్టి చెంపదెబ్బ. -
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
ఏడాదికి రెండు సార్లు సీబీఎస్ఈ పరీక్షలు నిర్వహించేందుకు సీబీఎస్ఈ రంగం సిద్ధం చేస్తోంది. బోర్డు పరీక్షల్లో సెమిస్టర్ విధానం తీసుకొచ్చే ఆలోచన లేదని సమాచారం.