నౌకపై నౌక.. చెన్నై పోర్టు తడాఖా!
భారత నౌకా పరిశ్రమ గర్వించేలా చెన్నై పోర్టు తన పనితనంతో తడాఖా చూపింది. ఓ భారీ వస్తువును బార్జి(పెద్ద పంటు)పై అమర్చే ‘ఫ్లోట్ ఆన్ - ఫ్లోట్ ఆఫ్(ఫ్లో-ఫ్లో)’ పద్ధతిని విజయవంతంగా పూర్తి చేసింది.
‘ఫ్లోట్ ఆన్- ఫ్లోట్ ఆఫ్’లో సరికొత్త రికార్డు
భారీ ఓడను గయానాకు సాగనంపిన అధికారులు
ఈనాడు, చెన్నై: భారత నౌకా పరిశ్రమ గర్వించేలా చెన్నై పోర్టు తన పనితనంతో తడాఖా చూపింది. ఓ భారీ వస్తువును బార్జి(పెద్ద పంటు)పై అమర్చే ‘ఫ్లోట్ ఆన్ - ఫ్లోట్ ఆఫ్(ఫ్లో-ఫ్లో)’ పద్ధతిని విజయవంతంగా పూర్తి చేసింది. అరుదుగా చేపట్టే ఈ క్రతువును పూర్తి చేసిన పోర్టు అధికారులు, ఇంజినీర్లను ప్రధాన మంత్రి మోదీ ప్రత్యేకంగా ప్రశంసించారు. పోర్టులు, షిప్పింగ్ రంగానికి ఇదో గొప్ప శుభవార్త అని కొనియాడారు.
ఎలా చేర్చారంటే..
బార్జి మధ్య ప్లాట్ఫాంను సముద్రం నీటిలో మునిగేలా చేశారు. ఓడను నీటి మార్గాన తీసుకెళ్లి సరిగ్గా.. బార్జి ప్లాట్ఫాంపై కూర్చునేలా నిలిపారు. ఆ తర్వాత ముంచి ఉంచిన ప్లాట్ఫాం భాగాన్ని పైకి లేపారు. దాంతో ఓడ.. బార్జిలోకి వచ్చినట్లయింది. వెంటనే భారీ దూలాలతో ఓడను కదలకుండా బిగించేశారు. ఈ తంతు పూర్తికి 12 గంటల పాటు శ్రమించాల్సి వచ్చిందని పోర్టు అధికారులు తెలిపారు. ఇందుకు బార్జిలో ఓడ కోసం ప్రత్యేక ప్లాట్ఫాంను తయారు చేసినట్లు వివరించారు. ఇది ఓ రికార్డు అని, ‘మేకిన్ ఇండియా’ సాధించిన ఘనతగా పోర్టులు, షిప్పింగ్, వాటర్వేస్ మంత్రిత్వశాఖ ప్రకటించింది.
విశేషం ఏంటీ..?
285 మీటర్ల పొడవు, 43 మీ వెడల్పు, 14.2 మీ ఎత్తుతో 17 వేల టన్నుల బరువున్న ‘ఎంవీ మలీషా’ అనే ఓడను ఉన్నది ఉన్నట్లు చెన్నై నుంచి 14 వేల కి.మీ దూరంలోని రిపబ్లిక్ ఆఫ్ గయానా దేశానికి తరలించాలి. అందుకు.. ముందుగా దాన్ని భారీ పంటుపై అమర్చాలి. ఇది అంత సులువైన పనికాదు. దీన్ని ప్రతిష్ఠాత్మకంగా భావించి చెన్నై పోర్టు ఈ బాధ్యతను తీసుకుంది. అరుదైన ఫ్లోట్ ఆన్ - ఫ్లోట్ ఆఫ్ విధానాన్ని ఎంచుకొని.. ఇటీవలే దిగ్విజయంగా పంటుపైకి ఓడను చేర్చి ఆ దేశానికి సాగనంపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
-
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల
-
కొండయ్య.. లెక్కే వేరు