Odisha Train Accident: కళ్ల ముందే ప్రాణాలు కోల్పోయిన అభాగ్యులు ఎందరో?
అప్పటివరకు రైల్లో సరదాగా గడిపారు. పిల్లాపాపలతో కబుర్లు చెప్పుకుంటూ రాత్రి భోజనానికి సిద్ధమవుతున్న తరుణంలో ఒక్క ఉదుటున భారీ శబ్దం.
పెద్ద పెద్ద శబ్దాలు.. గాల్లోకి ఎగిరిన బోగీలు
ఏం జరిగిందో తెలిసేలోపే చాలామంది మృత్యువాత
అంతా చీకటి.. హాహాకారాలు.. భయానక వాతావరణం
‘ఈనాడు’తో కోరమాండల్ ఎక్స్ప్రెస్ ప్రమాద బాధితులు
ఈనాడు-అమరావతి, విశాఖపట్నం: అప్పటివరకు రైల్లో సరదాగా గడిపారు. పిల్లాపాపలతో కబుర్లు చెప్పుకుంటూ రాత్రి భోజనానికి సిద్ధమవుతున్న తరుణంలో ఒక్క ఉదుటున భారీ శబ్దం. అంతే సీట్లలో కూర్చున్న వారంతా ఒక్కసారిగా ఎగిరిపడ్డారు. ఏమైందో తెలియలేదు.. ఎవరెక్కడ ఉన్నారో కనిపించలేదు. చుట్టూ చీకట్లు.. భయానక వాతావరణం. ఎటుచూసినా హాహాకారాలే. అప్పటి వరకూ తల్లుల ఒడిలో కూర్చొని ఆడుకున్న పిల్లలు కనిపించలేదు. పక్కనే ఉన్న వారికి ఏమైందో తెలియడం లేదు. ఇదీ ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం నుంచి చిన్నపాటి గాయాలతో బయటపడిన వారి అనుభవం. వీరంతా ఘోర ప్రమాదానికి గురైన కోరమాండల్ ఎక్స్ప్రెస్ రైల్లోనే ప్రయాణించినా అదృష్టవశాత్తూ ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు. ఘటనా స్థలం నుంచి చెన్నైకి బయలుదేరిన ప్రత్యేక రైలులో శనివారం మధ్యాహ్నం పలువురు విశాఖకు చేరుకున్నారు. మరికొందరు స్వస్థలాలకు ప్రయాణమయ్యారు. ‘ప్రమాద దృశ్యం చూసి గుండె ఆగినంత పనైంది. ఎన్నడూ ఇలాంటి ఘటనలు చూడలేదు. ఎంత మంది చనిపోయారో.. ఎంతమంది బతికారో.. కుటుంబ సభ్యులు ఏమయ్యారో తెలియక చాలామంది విలపిస్తూ కనిపించార’ని ఆయా ప్రయాణికులు ‘ఈనాడు-ఈటీవీ’తో పేర్కొన్నారు.
జనరల్ బోగీలో 30 మంది మృతి
‘బతుకుతెరువు కోసం బిహార్ నుంచి చెన్నైకి వెళ్తున్నాం. కోరమాండల్ జనరల్ బోగీలో ప్రయాణిస్తున్నా. నాతో పాటు 100 మందికి పైగా అందులో ఉన్నారు. వీరిలో 30 మంది వరకు మృతి చెందారు. బోగీలో ఇరుక్కుపోయిన నన్ను సహాయక బృందాలు, స్థానికులు బయటకు లాగారు. కాలికి చిన్నపాటి గాయంతో బయటపడ్డా’.
టీసీల ప్రవర్తన దారుణం
- ఫిలిప్, తెనాలి, గుంటూరు జిల్లా
‘ఎటు చూసినా మృతదేహాలే.. ఏం చేయలో దిక్కుతోచని స్థితిలో ఉన్నాం. అసలు అక్కడి నుంచి ఎలా బయట పడతామో అర్థం కాలేదు. రైల్వే అధికారులు స్పందించి ప్రశాంతి ఎక్స్ప్రెస్ ఎక్కించారు. ఒడిశా వరకు ప్రశాంతంగా వచ్చాం. వైజాగ్లో టీసీలు వచ్చి సీట్లలో కూర్చోవద్దని హెచ్చరించారు. చేసేది లేక మరుగుదొడ్ల వద్ద నిలబడాల్సి వచ్చింది. ప్రాణాలలో బయటపడిన మాకు టీసీల ప్రవర్తన చాలా ఇబ్బంది పెట్టింది’
50 మందిని బయటకు తెచ్చాం
- కె.లోకేశ్వరరావు, మధురవాడ, విశాఖ
‘పండగకని గత నెల 22న కోల్కతాలోని సోదరుడి ఇంటికి అయిదుగురు కుటుంబ సభ్యులం వెళ్లాం. తిరిగి విశాఖపట్నం వచ్చేందుకు శుక్రవారం కోరమాండల్లో బయలుదేరాం. మేం బి-5 కోచ్లో ఎక్కాం. రాత్రి రైలు దేనినో గుద్దుకున్నట్లు అనిపించింది. తరువాత ఏమీ తెలియలేదు. చుట్టూ అంధకారం. ఎటు చూసినా గాయపడిన వారి అరుపులు, కేకలే. మేమంతా రైలు కింద ఉన్నట్లు గుర్తించాం. ఏం చేయాలో తెలియలేదు. మా పిల్లలు ఎక్కడున్నారో కనిపించలేదు. నెమ్మదిగా తేరుకొని ఏసీ గ్లాసులు ఉన్న వైపు వెళ్లి వాటిని పగలగొట్టే ప్రయత్నం చేశాం. ఎంత ప్రయత్నించినా కుదరలేదు. అంతలో స్థానికులు అక్కడికి చేరుకున్నారు. వారి సహకారంతో అద్దాలు పగలగొట్టాం. మా పిల్లలు, అమ్మ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. నా భార్య తలకి తీవ్ర గాయమైంది. స్థానికుల సాయంతో సుమారు 50 మందిని బయటకు తెచ్చాం.’
బతికే ఉన్నామా అనిపిస్తోంది..
- లక్ష్మీ బిశ్వాస్, కృష్ణా జిల్లా
‘మాది పశ్చిమ బెంగాల్. కృష్ణా జిల్లా పెడనలో స్థిరపడ్డాం. సెలవులకని పిల్లలతో కలిసి సొంతూరు కోల్కతా వెళ్లాం. తిరుగు ప్రయాణంలో ఇద్దరు పిల్లలతో కలిసి కోరమాండల్ బి-6 బోగీలో ఎక్కాం. ప్రమాదం జరగ్గానే మేం ఒక్కసారిగా ముందుకు పడిపోయాం. బోగీ పల్టీ కొట్టి పూర్తిగా తలకిందులైంది. ఆ ప్రాంతమంతా వేడిగా అనిపించింది. అంతా గాఢాంధకారం. చీకట్లో ఏమీ తెలియలేదు. ఫోన్ దగ్గరే ఉండడంతో పిల్లల కోసం వెతికా. వాళ్లిద్దరూ చాలా దూరంలో పడి ఉన్నారు. అతి కష్టం మీద వారిని గుర్తించా. ఈ సమయంలో చాలా భయానక పరిస్థితిని చూశా. అప్పటికే కొందరు మృతిచెంది ఉన్నారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని కిటికీ లోపల నుంచి బయటకు దూకి బయటపడ్డాం. పిల్లలిద్దరికీ వీపు మీద చేతులకు, తలకు గాయాలయ్యాయి. అక్కడి తీవ్రతను చూస్తే ఇప్పటికీ బతికున్నామా అనిపిస్తుంది.’
ఊహించని ఘోరం
- శంకరరావు, విశాఖ
‘నేను కోల్కతాలో పనిచేస్తున్నాను. విజయవాడ వెళ్లాల్సి ఉన్నందున సెలవు పెట్టి కోరమాండల్లో నేనొక్కడినే కోల్కతా నుంచి వస్తున్నా. అప్పుడే టిఫిన్ చేసి పడుకుందామనుకునే సమయంలో ఘోరం జరిగిపోయింది. నాకు స్పృహ పోయింది. చాలాసేపు బోగీలోనే పడి ఉన్నా. టార్చ్ వెలుతురు కనిపిస్తున్నా లేవలేకపోతున్నా. బోగీలోని వారంతా సాయం కోసం అరిచారు. శరీర భాగాలు తెగిపడిన వారు అక్కడే పడి ఉండిపోయారు. మా బోగీలోకి వేరే బోగీ చొచ్చుకొచ్చింది. లోపలంతా ధ్వంసమైంది. స్థానికుల సాయంతో బయటపడిన నాకు అక్కడే ప్రాథమిక చికిత్స చేసి తలకు కట్టుకట్టారు. ప్రత్యేక రైలులో విశాఖ వచ్చా.’
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నోటా విజేతగా నిలిస్తే?.. సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు
సార్వత్రిక ఎన్నికల వేళ సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్నికల్లో అభ్యర్థుల కన్నా నోటాకు అధికంగా ఓట్లు వస్తే ఏం చేయాలనే విషయమై చర్చకు తావిచ్చేలా ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఒకటి దాఖలైంది. -
100% వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు అసాధ్యం
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎం)పై వ్యక్తమవుతున్న అనుమానాలను సర్వోన్నత న్యాయస్థానం నిర్ద్వంద్వంగా కొట్టిపారేసింది. -
వామపక్ష తీవ్రవాదం కట్టడికి ఏడాదికి రూ.వెయ్యి కోట్ల పైమాటే!
దేశంలో వామపక్ష తీవ్రవాదం కట్టడికి ప్రయత్నిస్తున్న కేంద్రం ఇందుకోసం భారీగా నిధులు వెచ్చిస్తోంది. ఈ మేరకు గత ఐదేళ్లలో.. ఏడాదికి రూ.వెయ్యి కోట్లకు పైగా వెచ్చించింది. -
ఎవరెస్ట్ బేస్ క్యాంప్నకు ఆరేళ్ల బాలుడు
హిమాచల్ప్రదేశ్లోని బిలాస్పుర్కు చెందిన ఆరేళ్ల బాలుడు ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఎవరెస్ట్ శిఖరం బేస్ క్యాంప్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశాడు. బిలాస్పుర్ జిల్లాలోని జుఖాలా ప్రాంతానికి చెందిన యువన్ తల్లిదండ్రులతో కలిసి దుబాయ్లో ఉంటున్నాడు. -
జేఈఈ మెయిన్స్ ఆలిండియా టాపర్గా రైతు బిడ్డ
మహారాష్ట్రలోని మారుమూల గ్రామానికి చెందిన ఓ రైతుబిడ్డ జేఈఈ మెయిన్స్ అఖిల భారతస్థాయిలో మొదటి స్థానంలో నిలిచాడు. -
భారత్లో ఎత్తయిన ప్రాంతాల్లోని చిన్నారులకు స్టంటింగ్ ముప్పు
వయసుకు తగ్గట్లు శారీరక ఎదుగుదల లోపించే (స్టంటింగ్) ముప్పు భారత్లోని కొండ ప్రాంతాల్లో నివసించే చిన్నారులకు ఎక్కువని, తాజా అధ్యయనం తేల్చింది. -
దక్షిణాదిలో నీటి సంక్షోభం!
దక్షిణ భారతదేశం తీవ్ర నీటి సంక్షోభంలో చిక్కుకుంది. ఆ ప్రాంతంలోని రిజర్వాయర్ల సామర్థ్యంలో 17 శాతం మేర మాత్రమే నీరు ఉందని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) తాజా బులెటిన్ పేర్కొంది. -
రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇచ్చారు
దేశ రాజధాని దిల్లీలోని నగరపాలక సంస్థ (ఎంసీడీ) పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పుస్తకాలు సరఫరా చేయకపోవడంపై నగరపాలక సంస్థను దిల్లీ హైకోర్టు శుక్రవారం నిలదీసింది. -
భారతీయులకే అమెరికాలో సీఈవో అవకాశం!
అమెరికాలో భారతీయులు పెద్ద మార్పును తీసుకొస్తున్నారని ఆ దేశ రాయబారి ఎరిక్ గార్సెటి అన్నారు. దిగ్గజ కంపెనీల్లో ప్రతీ 10 మంది సీఈవోల్లో ఒకరు భారత సంతతి వ్యక్తులే ఉంటున్నారని అన్నారు. -
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు హైకోర్టు నిరాకరణ
ప్రముఖ నటుడు, ఉత్తర్ప్రదేశ్లోని గోరఖ్పుర్ లోక్సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి రవికిషన్ తన తండ్రి అంటూ జూనియర్ నటి షినోవా సోనీ ఆరోపించిన తెలిసిందే. -
కేంద్ర చట్టంపై దిల్లీ ప్రభుత్వ సవాలు విచారణకు సుప్రీంకోర్టు పచ్చజెండా
దేశ రాజధాని దిల్లీలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నియామకాలపై లెఫ్టినెంట్ గవర్నర్కు అధికారం కట్టపెడుతూ కేంద్రం చేసిన చట్టాన్ని సవాలు చేస్తూ దిల్లీ ప్రభుత్వం వేసిన పిటిషన్ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. -
సిసోదియా జ్యుడిషియల్ కస్టడీ 8 వరకు పొడిగింపు
దిల్లీ మద్యం విధానంతో సంబంధమున్న నగదు అక్రమ చలామణి నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కేసులో అరెస్టైన ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు మనీశ్ సిసోదియా, సహ నిందితుడు విజయ్ నాయర్, ఇతరుల జ్యుడిషియల్ కస్టడీని శుక్రవారమిక్కడి న్యాయస్థానం మే ఎనిమిదో తేదీ వరకు పొడిగింది. -
కశ్మీర్లో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదుల హతం
జమ్మూకశ్మీర్లోని బారాముల్లా జిల్లా చెక్ మొహల్లా నౌపొరాలో భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య గురువారం నుంచి కాల్పులు కొనసాగుతున్నాయి. -
చట్టం లేకుండా ఎల్వోసీలు జారీ చేయడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే
రుణ ఎగవేత ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిపై.. నిర్దిష్ట చట్టమేదీ లేకుండానే ప్రభుత్వరంగ బ్యాంకుల వినతి మేరకు సర్కారు లుకౌట్ సర్క్యులర్లు (ఎల్వోసీ) జారీ చేయడం వ్యక్తుల ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని బాంబే హైకోర్టు పేర్కొంది. -
సందేశ్ఖాలీలో భారీగా ఆయుధాల స్వాధీనం
పశ్చిమబెంగాల్లోని సందేశ్ఖాలీలో సోదాలు నిర్వహించిన సీబీఐ అధికారులు.. తృణమూల్ కాంగ్రెస్ బహిష్కృత నేత షాజహాన్ షేక్ బంధువు ఇంటి నుంచి భారీ సంఖ్యలో ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. -
2025 నుంచి ఏడాదికి రెండుసార్లు బోర్డు పరీక్షలు
జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా ఏడాదికి రెండు సార్లు బోర్డు పరీక్షలను నిర్వహిస్తామని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. -
ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ విధానం సవరించాలంటే భారత్ను వీడతాం
సమాచార దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు అమలు చేస్తున్న తన ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ విధానాన్ని సవరించాలని బలవంత పెడితే తాము భారత్లో సేవలను నిలిపివేస్తామంటూ వాట్సప్ సంచలన వ్యాఖ్యలు చేసింది. -
ఈవీఎంలపై సుప్రీం తీర్పు విపక్షాలకు గట్టి చెంపదెబ్బ
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల (ఈవీఎంలు)పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ సారథ్యంలోని విపక్ష కూటమికి గట్టి చెంపదెబ్బ. -
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
ఏడాదికి రెండు సార్లు సీబీఎస్ఈ పరీక్షలు నిర్వహించేందుకు సీబీఎస్ఈ రంగం సిద్ధం చేస్తోంది. బోర్డు పరీక్షల్లో సెమిస్టర్ విధానం తీసుకొచ్చే ఆలోచన లేదని సమాచారం.